breaking news
siromundanam issue
-
34 ఏళ్ల సర్వీసులో ఇదే ప్రథమం: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీస్శాఖకు వివిధ అంశాల్లో జాతీయస్థాయిలో 26 అవార్డులు దక్కాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అభివృద్ధి మార్పులు, టెక్నాలజీ వంటి వివిధ విభాగాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. ఆయన ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న 74వ స్వాతంత్ర్య దినోత్సవ రిహార్సల్స్ లో పాల్గొని పోలీసు, భద్రతా,రిజర్వ్ బలగాలు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చీరాల ఘటనలో ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో ఎవరినీ ఉపేక్షించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. రాజమండ్రి శిరోముండనం ఘటనపై డీజీపీ స్పందిస్తూ తమ దృష్టికి రాగానే ఎస్ఐని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని తెలిపారు. తన 34 ఏళ్ల సర్వీసులో ఒక పోలీసు అధికారిని ఇంత త్వరితగతిన అరెస్ట్ చేసింది లేదని, ఇదే ప్రథమం అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కేసులకు వెనుకాడవద్దని పోలీస్శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో ముగ్గురిని అరెస్ట్ చేశామని డీజీపీ వెల్లడించారు. -
ఆయన ‘తోట’లోనే నిరసన సెగలు
∙ఎమ్మెల్యే త్రిమూర్తుల స్వగ్రామంలో తిరుగుబాటు ∙శిరోముండనం కేసులో బిగుస్తున్న ఉచ్చు ∙అసహనంతో అనుచిత వ్యాఖ్యలు వెంకటాయపాలెం(రామచంద్రపురం రూరల్) : రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు సొంత గ్రామం వెంకటాయపాలెంలోనే నిరసనల సెగ గట్టిగా తగులుతోంది. శిరోముండనం కేసు తుది విచారణ దగ్గర పడుతున్న నేప«థ్యంలో ఎమ్మెల్యేలో అసహనం పెరిగిపోతోందని ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల నీటి పారుదల సలహా సంఘ సమావేశంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్ర బోస్పై విరుచుకుపడిన తీరు ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.దీంతోపాటు ఇటీవల కాలంలో నియోజకవర్గంలో కూడా పలువురిపై ఇదే విధంగా చిందులు తొక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి తోడు ఆయనకు వ్యతిరేకంగా తన నియోజకవర్గంలోనే నిరసన సెగలు చెలరేగడంతో మరింత ఒత్తిడికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు...: శిరోముండనం కేసు వ్యవహారంలో ప్రభుత్వ ప్రమేయంతో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆయన సొంత గ్రామమైన వెంకటాయపాలెంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించగా శుక్రవారం రెండో రోజూ దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఈ శిబిరంలో గ్రామస్తులు బత్తుల బాలయ్య, నందికోళ్ల సత్తియ్య, కాకర విష్ణుమూర్తి, బొడ్డువారి పేట గ్రామస్తులు బొడ్డు శ్రీను, బొడ్డు కామరాజు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, పీవైఎల్ డివిజ¯ŒS కార్యదర్శి మల్లవరపు రాజు, ఏఐకేఎంఎస్ నాయకుడు ఎం.రాముడు, జై భీం దళిత సేవా సంఘం నాయకుడు చెట్లర్ కర్ణ దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాన్ని కె.గంగవరం ఎంపీపీ, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, దళిత స్త్రీ శక్తి రాష్ట్ర కోఆర్డినేటర్ కొంకి రాజామణి, నాయకురాలు ఎస్. నాగమణిలు సందర్శించి మద్ధతు పలికారు. శిరోముండనం కేసులో ముద్దాయిలకు శిక్ష పడేవరకు పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ దళిత సేవా సంఘం కార్యదర్శి దడాల వెంకటరమణ, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ నీలం మధుసూదనరావు, పీవైఎల్ నాయకులు గుత్తుల వెంకటరమణ, ఏఐకేఎంఎస్ నాయకుడు గెద్దాడ సూరిబాబు, పీవైఎల్ నాయకుడు అంబటి కృష్ణ, వెంకటాయపాలెం ఎంపీటీసీ దడాల వెంకటరమణలు పాల్గొన్నారు. మహిళల ఆధ్వర్యంలో నిరశనలే...: వెంకటాయపాలెంలోని చిన్నంపేటలో అప్పటి ఎమ్మెల్యే పిల్లి అప్పారావు దాతల నుంచి సేకరించిన స్థలంలో కీ.శే. మల్లిపూడి పల్లంరాజు పేరుతో కమ్యూనిటీ హాలు, ఆడిటోరియం నిర్మించారు. ప్రస్తుతం ఇదే స్థలంలో 33/11 కేవీ సబ్ స్టేష¯ŒS నిర్మించాలని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నిర్ణయించారు. దీంతో గ్రామంలో ప్రజలకు తెలియకుండానే పంచాయతీ తీర్మానం కూడా జరిగిపోయింది. దీనిపై గ్రామస్తులు వ్యతిరేకించి సబ్స్టేçÙ¯ŒS అక్కడ వద్దని పోరాటం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు బుధవారం సాయంత్రం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మార్కింగ్ చేయాలని ప్రయత్నం చేయగా ‘ ఇక్కడ సబ్ స్టేష¯ŒS వద్దని విజ్ఞప్తి చేయగా’ ‘మీరు చెబితే నేను ఆగడం ఏమిటి? ఎవరు అడ్డు వచ్చినా ఇక్కడ సబ్స్టేçÙ¯ŒS నిర్మాణం ఆగదు’ అనడంతో మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఇళ్ల మధ్యలో సబ్ స్టేష¯ŒS నిర్మాణానికి తాము ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని, అవసరమైతే ఒంటిపై కిరోసి¯ŒS పోసుకుని ఆత్మాహుతికైనా సిద్ధపడతామని’ హెచ్చరించారు. సర్ధిచెప్పాల్సిన ఎమ్మెల్యే ‘పది మంది చచ్చినంత మాత్రాన నష్టం లేదని’ నిర్లక్ష్యంగా అనడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై గురువారం సమావేశమై శుక్రవారం నుంచి రిలే నిరాహా దీక్షలు చేయడానికి కూర్చున్నామని, సబ్ స్టేష¯ŒS నిర్మాణం ఆలోచన విడిచిపెట్టేవరకు తమ దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్రీనివాసకుమార్(శ్యాం) నిరాహార దీక్ష శిభిరాన్ని ప్రారంభించారు. కె.గంగవరం ఎంపీపీ, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరామారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి ఇసుకపట్ల శ్యామల, గ్రామ మాజీ సర్పంచ్ పిల్లి రాంబాబు, మందపల్లి మోషే, పిల్లి చంద్రరావులు మహిళల నిరసన దీక్షకు మద్దతు పలికారు. -
శిరోముండనం బాధితుల రిలే దీక్షలు
నిందితుల కొమ్ము కాస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. శిబిరాన్ని ప్రారంభించిన రిపబ్లిక¯ŒS పార్టీ నేత మోకా వెంకటాయపాలెం (రామచంద్రపురం రూరల్) : వెంకటాయపాలెం దళిత యువకుల శిరోముండనం కేసు విచారణను జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా గురువారం నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. బాధితులు, ప్రజాసంఘాల నాయకులు, దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ దీక్షలు చేపట్టారు.దీక్షా శిబిరాన్ని యానాంకు చెందిన రిపబ్లిక¯ŒS పార్టీ సీనియర్ నాయకుడు మోకా మోహనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో న్యాయం కోసం హైకోర్టులో విశేష కృషి చేసిన బొజ్జా తారకం మన మధ్య లేకపోవడం విచారకరమన్నారు. ఈ పోరాటాన్ని ముందుకు నడిపి నిందితులకు శిక్షలు పడినపుడే తారకానికి నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. దళిత ఐక్యపోరాట వేదిక నాయకులు నీలం మధుసూదనరావు, ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, మాల మహానాడు నాయకుడు తాడి బాబ్జీ. జై భీమ్ దళిత సేవా సంఘం నాయకులు గుబ్బల శ్రీను, దడాల వెంకటరమణ, చెట్లర్ కర్ణ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు సైతం తాము వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. తొలిరోజు దీక్షలో శిరోముండనం బాధితులు కోటి చినరాజు, చల్లపూడి పట్టాభి రామయ్య, గ్రామస్తులు దడాల రవికుమార్, రేవు అప్పారావు, దడాల కృష్ణమూర్తి, బొడ్డు కృష్ణమూర్తి, కాకర విష్ణుమూర్తి, గుత్తుల వెంకటరమణ, ఇసుకపట్ల శ్యామల కూర్చున్నారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకుడు గుబ్బల ఆదినారాయణ, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సంఘ జిల్లా కార్యదర్శి ఆర్ రాఘవులు, బీసీ సంఘం నాయకుడు వాసంశెట్టి శ్యాం, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు జనిపెల్ల సత్తిబాబు, జిల్లెళ్ల వెంకటేశ్వరరావు, ఏఐకేఎంఎస్ నాయకుడు అంబటి కృష్ణ, గెద్దాడ సూరిబాబు పాల్గొన్నారు.