-
తెలుగు సినిమాతో ఎంట్రీ.. డర్టీ మూవీ, బోల్డ్ సీన్స్తో విమర్శలు..
ప్రతి ఏడాది బోలెడన్ని సినిమాలు రిలీజవుతుంటాయి. అందులో పెద్ద సినిమాల కన్నా చిన్న చిత్రాల జాబితానే పెద్దదిగా ఉంది. ఈ చిన్న సినిమాల ద్వారా ఎందరో నటీనటులు వెండితెరకు పరిచయమవుతుంటారు. అందులో కొందరే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు. మరికొందరు ఇక్కడ ఇమడలేక సినిమాలకు గుడ్బై చెప్తారు. ఇప్పుడు చెప్పుకునే హీరోయిన్ ప్రయాణం.. టాలీవుడ్తోనే మొదలైంది. అయితే తనకు కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ఇచ్చింది మాత్రం బాలీవుడే.. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సిమ్రత్ కౌర్. 1997లో ముంబైలో పుట్టింది సిమ్రత్ కౌర్. 2017లో ప్రేమతో మీ కార్తీక్ చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ప్రయాణం మొదలుపెట్టింది. తర్వాతి ఏడాది పరిచయం అనే సినిమా చేసింది. అదే ఏడాది హిందీలో సోని అనే మూవీ చేసింది. రెండేళ్లపాటు ఖాళీగా ఉన్న ఆమె 2020వ సంవత్సరంలో డర్టీ హరితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించినందుకు గానూ చాలామంది ఆమెను తిట్టిపోశారు. కానీ గదర్ 2 సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించింది. ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.691 కోట్లు రాబట్టింది. బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో సిమ్రత్ కెరీర్లోనే ఈ మూవీ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది. View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) చదవండి: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నన్ను తన గదికి రమ్మన్నాడు.. షకీల సంచలన ఆరోపణలు -
సాలార్ లో ఐటెం సాంగ్ చేయనున్న స్టార్ హీరోయిన్..
-
అలా జరగడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయా, రోజూ ఏడ్చా: హీరోయిన్
కొందరికి సినిమానే లోకం.. కాస్త గ్యాప్ వచ్చినా తట్టుకోలేరు. అవకాశాల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తారు. ఛాన్సులు రావడం ఆగిపోతే అస్సలు తట్టుకోలేరు. కుమిలిపోతారు, డిప్రెషన్కు లోనవుతారు. ఈ బాధను అనుభవించిన బాలీవుడ్ నటీమణుల్లో సిమ్రత్ కౌర్ రాంధవ ఒకరు. 2017లో వచ్చిన ప్రేమతో మీ కార్తీక్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా తన కెరీర్ మొదలైంది. మొదట్లో నటనపై అంత ఆసక్తి లేనప్పటికీ ఫస్ట్ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన గుర్తింపు చూసి యాక్టింగ్పై ప్యాషన్ పెంచుకుంది. కానీ అవుట్సైడర్(సినీ బ్యాగ్రౌండ్ లేని వ్యక్తి)గా తనకు అవకాశాలు అంత ఈజీగా రాలేవు. తాజాగా ఆమె తన జీవితంలోని కష్ట సమయాలను తలుచుకుని ఎమోషనలైంది. ఏం చేయాలో తెలీలేదు సరైన సమయం వచ్చేంతవరకు ఎదురుచూడాలని తెలుసుకున్నాను. అప్పటిదాకా పోరాటం చేస్తూనే ఉండాలి. అవుట్సైడర్కు ఏదీ అంత ఈజీగా రాదు. మన దగ్గర ఎవరి ఫోన్ నెంబర్లు ఉండవు, పెద్దగా పరిచయాలుండవు. మనమే సరైన వ్యక్తులను వెతుక్కుని అవకాశాలు అడగాలి. అయితే నా బాధల్లా.. ఆ కరెక్ట్ పర్సన్స్ ఎక్కడుంటారు? ఎక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వాలి? అనేది తెలియలేదు. సౌత్లో నా జర్నీ మొదలైంది. ఒక సినిమా చేశాక కూడా నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అనేది అర్థం కాలేదు. ప్రేమతో మీ కార్తీక్ సినిమా స్టిల్ ఎక్కడ తప్పు చేస్తున్నాను? కొన్ని నిర్మాణ సంస్థలను కలిస్తే వారు నన్ను మెచ్చుకుని వదిలేసేవాళ్లు. నాకు ఎందుకు పని దొరకడం లేదు? ఎక్కడ తప్పు చేస్తున్నాను? అని ఆలోచించేదాన్ని. సౌత్లో ఒక సినిమా చేసిన తర్వాత కూడా మరో ఆఫర్ కోసం ఎంతగానో ప్రయత్నించాను, కష్టపడ్డాను. కానీ నా ప్రయత్నం వృధా అయింది. 2019లో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నేను ఒక ఫెయిల్యూర్గా ఫీలయ్యాను. జీవితంలో ఏమీ చేయలేకపోతున్నానని నలిగిపోయాను. సౌత్, బాలీవుడ్ ఎక్కడా ఛాన్సులు రావట్లేదంటే నటిగా నేను పనికిరానేమోనని తిట్టుకున్నాను. కొన్ని నెలలపాటు ఒకే గదిలో.. రోజూ ఏడ్చేదాన్ని కొన్ని నెలలపాటు రూమ్లో బందీ అయిపోయాను. ఆ గదిలో నుంచి బయటకు రాకపోయేదాన్ని. ఎవరితో మాట్లాడేదాన్ని కూడా కాదు. ప్రతిరోజు ఏడ్చేదాన్ని. అప్పుడు మా పేరెంట్స్ నాకు అండగా ఉన్నారు. ఎవరూ ఒక్క రాత్రిలో స్టార్ అయిపోరని, దాని కోసం వెయ్యిసార్లైనా పోరాడాలని చెప్పారు. యాక్టింగ్ వద్దనుకుంటే నాకు నచ్చింది ఇంకేదైనా చేయమన్నారు. వాళ్లు చెప్పినట్లుగానే ఎన్నో ప్రయత్నాల తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి' అని చెప్పుకొచ్చింది. సిమ్రత్ ప్రస్తుతం గదర్ 2 సినిమా చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) చదవండి: ఖుషి ట్రైలర్.. 'పెళ్లంటేనే సావురా.. నువ్వెప్పుడో సచ్చిపోయినవ్' -
ఆ ఫోటోలు వైరల్ చేయకండి.. ప్లీజ్ సాటి ఆడదానిగా కోరుతున్నా: హీరోయిన్
అమీషా పటేల్- సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' ఆగస్ట్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ నటించిన 'OMG 2' తో ఢీకొంటుంది. 'గదర్ 2'ను తాజాగా ఓ వివాదం వెంటాడుతుంది. ఈ సినిమాలో కనిపించనున్న నటి సిమ్రత్ కౌర్కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గదర్-2 సినిమాలో బెడ్రూమ్లోని హాట్ ఫోటోలు అంటూ కొన్ని ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. దీంతో గదర్ లాంటి క్లీన్ సినిమాలో ఇలాంటి సీన్లు ఎలా పెట్టారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు సిమ్రత్ కౌర్ను ఈ సినిమాలోకి ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. (ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?) దీనిని అమీషా పటేల్ ఖండించింది. ఆ లీక్ అయిన చిత్రాలు తమ రాబోయే చిత్రానికి సంబంధించినవి కావని స్పష్టం చేసింది. సిమ్రత్ కౌర్పై కావాలనే ఎవరో నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారని అమిషా తెలిపింది. ఇలాంటి వీడియోలు దయచేసి వైరల్ చేయకండి అంటూ ఒక ఆడదానిగా రిక్వెస్ట్ చేస్తున్నానని అమీషా పేర్కొంది. సినిమాల్లో కేవలం ఆమె టాలెంట్ను మాత్రమే గుర్తించండి. కానీ ఇలా ఆ అమ్మాయిని అవమానించవద్దని, కొత్త టాలెంట్ని ప్రోత్సహిద్దామని అమిషా తెలిపింది. సినిమాల్లో రొమాన్స్ ఉండటం తప్పులేదు కానీ అది లిమిట్స్లో మాత్రమే ఉండాలి. ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా దృష్టిలో ఉంచుకొని సినిమాలు నిర్మించాలని ఆమె కోరింది. ఇంతటితో ఈ ఊహాగానాలు దయచేసి ఆపేయండి. ఆగస్ట్ 11న గదర్ 2ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండని ఆమె తెలిపింది. These are not images from GADAR 2!! 🙏🏻🙏🏻🙏🏻 https://t.co/sHdSNpbrlh — ameesha patel (@ameesha_patel) July 12, 2023 (ఇదీ చదవండి: తొలి పారితోషికంపై సితార కామెంట్స్.. నెట్టింట ప్రశంసల జల్లు) -
మాయా సెల్ఫోన్
‘‘మాయా పేటిక’ సినిమాలో నా మనసుకు దగ్గరైన పాత్ర నాది.. అందుకే ఎంతో ఇష్టపడి చేశాను. సెల్ఫోన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అని హీరో విరాజ్ అశ్విన్ అన్నారు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక’. మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో రమేష్ రాపర్తి మాట్లాడుతూ– ‘‘మాయా పేటిక’ ద్వారా సెల్ఫోన్ కథ చెబుతున్నాం. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘రెగ్యులర్ కథలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు మాగుంట శరత్ చంద్రా రెడ్డి. ‘‘నా కెరీర్లో ‘మాయా పేటిక’ ముఖ్యమైనది’’ అన్నారు పాయల్ రాజ్పుత్. ‘‘అద్భుతమైన డ్రామా, వినోదం, సంగీతం ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సిమ్రత్ కౌర్. ఈ కార్యక్రమంలో నటీనటులు శ్యామల, రజత్ రాఘవ్ మాట్లాడారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement