-
గురువింద చంద్రం..!
-
‘రాంబెల్లి నేవల్ బేస్ నిర్వాసితులకు సాయం చేశాం’
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం జిల్లా రాంబెల్లి మండలంలో ఏర్పాటు చేసిన నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ (ఏఓబీ) కారణంగా భూములు కోల్పొయిన నిర్వాసితులైన కుటుంబాలకు నష్టపరిహారంతోపాటు, పునరావాసానికి సకల చర్యలను పూర్తి చేసినట్లు రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాంబిల్లి మండలంలో భారత నౌకా దళానికి ఒక ప్రత్యామ్నాయ నౌకా స్థావరం నిర్మించాలన్న ప్రతిపాదనకు 2009లో అంతిమంగా ఆమోదం లభించినట్లు సీతారామన్ చెప్పారు. ‘ నేవల్ బేస్ కోసం రాంబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియ చేపట్టిన సమయంలో నిర్వాసితులకు పలు హమీలు ఇచ్చింది. యువతకు ఉపాధి, కేంద్రీయ విద్యాలయం, హెల్త్ సెంటర్లు తదితర సౌకర్యాలు కల్పిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చిన విషయం వాస్తవమేనా’ అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సూటిగా జవాబివ్వకుండా దాటవేశారు. నేవల్ బేస్ నిర్మాణానికి అవసరమైన 4636.71 ఎకరాల భూమిని సేకరించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీని కోసం మార్చి 2005 నుంచి డిసెంబర్ 2017 మధ్య కాలంలో రక్షణ మంత్రిత్వ శాఖ 189.535 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది. పునరావాసం, పునరుద్దరణ, నష్ట పరిహారం చెల్లింపు కోసం మరో 103.005 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. నేవల్ ప్రాజెక్ట్ కారణంగా ఆశ్రయం కోల్పోయిన కుటుంబాలకు వేరే చోట పునరావాసం కల్పించడంతోపాటు పక్కా ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసినట్లు కూడా మంత్రి వెల్లడించారు. పునరావాస కాలనీల్లో తారు రోడ్లు, విద్యుత్ సరఫరా, తాగు నీటి సౌకర్యం కోసం ఓవర్ హెడ్ ట్యాంక్, కమ్యూనిటీ సెంటర్, స్కూలు, అంగన్ వాడీ, పంచాయతీ భవనంతోపాటు ఇతర ప్రాధమిక వసతులన్నీ కల్పించినట్లు మంత్రి తెలిపారు. నిర్వాసితుల కుటుంబాలలో మిగిలిన 33 మందికి వారి విజ్ఞప్తి మేరకు ఇళ్ల కేటాయింపు జరిగింది. మొత్తం 2733 నేవల్ ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించడానికి అవసరమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. విశాఖలో షిప్ బిల్డింగ్ సెంటర్ నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతు వంటి పనులలో నైపుణ్యం పెంపొందించేందుకు విశాఖపట్నంలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్)’ ను ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం రాజ్య సభలోనౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 766 కోట్ల రూపాయల వ్యవయంతో విశాఖపట్నం, ముంబైలో సీఈఎంఎస్ ఏర్పాటు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చులో 87 శాతాన్ని సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్ వేర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గ్రాంటుగా ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ రెండు సెంటర్ల ఏర్పాటుకు అయ్యే మొత్తం 766 కోట్ల రూపాయల వ్యయాన్ని వాయిదా ప్రకారం విడుదల చేస్తున్నాం . మొదటి వాయిదా కింద 25 కోట్ల రూపాలను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. అలాగే ఇండియన్ షిప్పింగ్ రిజిస్ట్రార్ కూడా 50 కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం మంజూరు చేసింది. ఈ సెంటర్ల నిర్వహణ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో సెంటర్ లో ఏడాదికి 10,500 మందికి శిక్షణ ఇచ్చే సామర్ధ్యం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా ఈ సెంటర్లు పని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు. విస్తరణ దిశగా విశాఖ పోర్ట్ పురోగతి విస్తరణ దిశగా విశాఖపట్నం పోర్టు పురోగమిస్తున్నట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. విశాఖపట్నం పోర్టు ఆధునికీకరణ, సామర్ధ్యం పెంపు దిశగా తీసుకుంటున్న చర్యల గురించి విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సుదీర్ఘ వివరణలతో జవాబిచ్చారు. పోర్టు సామర్ధ్యం పెంచేందుకు కొత్తగా అనేక బెర్త్ లు, టెర్మినళ్ళను నిర్మిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. విశాఖపట్నం ఔటర్ హార్బర్ లో జనరల్ కార్గో బెర్త్ స్థాయి పెంపు, కోల్ హాండ్లింగ్ ఫెసిలిటీ యంత్రీకరణ, కోస్టల్ కార్గో బెర్త్ అభివృద్ధి, కంటైనర్ టెర్మిల్ విస్తరణ, 100 టన్నుల సామర్ధ్య కలిగిన 3 హార్బర్ మొబైల్ క్రేన్ల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులతో విశాఖపట్నం పోర్టు విస్తరణ శరవేగంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి వివరించారు. నేపాల్ కు రెండో గేట్ వేగా 2010లో విశాఖపట్నం పోర్ట్ ను ప్రకటించినట్లు మంత్రి చెప్పారు. -
విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్లో పేలుడు
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు మల్కాపురం, న్యూస్లైన్: విశాఖపట్నంలోని డాక్యార్డ్ సమీపంలో ఉన్న షిప్ బిల్డింగ్ సెంటర్ (ఎస్బీసీ)శనివారం జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాద కారణాలను నేవల్ అధికారులు వెల్లడించలేదు. ఎల్అండ్టీ వద్ద సబ్ కాంట్రాక్ట్ పనులు చేపట్టే అంజలి కన్రస్ట్రక్షన్లో పనిచేసే అమర్ (30) షిప్ బిల్డింగ్ సెంటర్లో తమ సంస్థ తరఫున సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఎస్బీసీకి వచ్చిన అమర్ సైట్ ఏ కంపార్ట్మెంట్-4 బ్లాక్ నంబర్-2లో ఆల్ఫా బీ-26 (సబ్మెరైన్) వద్ద పనులు పర్యవేక్షిస్తున్నాడు. ఎల్అండ్టీలో ఇంజనీర్ అమ్జిత్ఖాన్, హెచ్ఈడీ ఉద్యోగి విష్ణుతో కలిసి హైడ్రోలింగ్ పవర్టెస్ట్ నిర్వహణ కోసం వెళ్లారు. అదే సమయంలో ప్లాంజ్పై ఒత్తిడి పెరిగి పేలుడు సంభవిం చింది. దీంతో అమర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు తెలిసింది. అమర్ది నగరంలోని అక్కయ్యపాలెం. గాయాలైన అమ్జిత్ఖాన్, విష్ణులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనతో కలవరానికి గురైన కార్మికులు అధికారులను ప్రశ్నిస్తే తమపట్ల దురుసుగా ప్రవర్తించారని, వారి తీరును నిరసిస్తూ అక్కడ ఆందోళన చేపట్టారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
థాయ్లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్లరీనే!
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
ఇండోనేషియాలో స్టార్లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
ప్రముఖ నటికి సర్జరీ.. షాకయ్యానన్న మాజీ భర్త!
నేను గెలిస్తే సినిమాలు మానేస్తా.. కంగనా సంచలన నిర్ణయం
భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు
T20 WC 2024 Trophy At Sakshi: సెమీస్ చేరే జట్లు ఇవే: పీయూశ్ చావ్లా
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement