breaking news
Sewa
-
లక్షలాది జీవితాలను మార్చిన విప్లవమూర్తి
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మహాత్మా గాంధీ స్ఫూర్తిగా సామాజిక సేవకు తమ జీవితాలను అందించిన అనేకమందిలో ఇలా భట్ లేదా అందరికీ చిరపరిచితమైన ఇలా బెన్ ఒకరు. ఆకాశమే హద్దుగా దేశ భవిష్యత్తు గురించి కలలు కన్న ఇలాబెన్ అహ్మదాబాద్లో న్యాయవిద్యను అభ్యసించారు. నవ భారత నిర్మాణంలో తాను భాగస్వామి నని గర్వంగా భావించారు. ‘‘జాతి నిర్మాణం అంటే నా దృష్టిలో కార్మికులకు దగ్గర కావడమే. ఎందుకంటే.. ఈ దేశానికి పునాదు లైన వీరు ఇప్పటికీ పేదలుగానే ఉన్నారు. నిర్లక్ష్యానికి గురవు తున్నారు’’ అనేవారు ఆమె. ఆ కాలపు విద్యార్థి నేత రమేశ్ భట్ కార్యకలాపాలకు ఆకర్షితులైన ఇలా బెన్ అతడినే పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామి గానూ మారిపోయారు. విద్యాభ్యాసం తరు వాత ఇలా బెన్ మజూర్ మహాజన్ (టెక్స్టైల్ లేబర్ అసోసి యేషన్–టీఎల్ఏ)లో చేరిపోగా... రమేశ్ భట్ అహ్మదాబాద్లోని గుజరాత్ విద్యాపీఠ్లో చేరారు. మిల్లు వర్కర్ల ట్రేడ్ యూనియన్ అయిన టీఎల్ఏను స్థాపిం చింది అనసూయ సారాభాయ్ అయినప్పటికీ దీని రాజ్యాంగాన్ని రచించింది మాత్రం స్వయంగా మహాత్మా గాంధీ కావడం గమనార్హం. ట్రేడ్ యూనియన్ ప్రాముఖ్యం, నిర్వహణ వంటి అనేక అంశాలను టీఎల్ఏ లోనే నేర్చుకున్న ఇలా బెన్ ఇక్కడే మొదటిసారి అసంఘటిత రంగంలోని మహిళా కార్మికులను కూడా కలిశారు. వారంతా కాయగూరలు అమ్మే, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే, దుస్తులు కుట్టే కష్టజీవులైనప్ప టికీ పేదలుగానే ఉండటం ఆమెలోని ఆలోచనలను తట్టిలేపింది. వారి హక్కుల సాధనే లక్ష్యంగా ఇలా బెన్ 1972లో ‘సేవా’ సంస్థను ప్రారంభించారు. చిన్నగా మొదలైన ఈ సంస్థ అనతి కాలంలోనే దేశం.. ఆమాటకొస్తే ప్రపంచవ్యాప్త అసంఘటిత మహిళా కార్మికుల ఉద్యమాలకు ఆధారభూతమైంది. ఒక్కో మహిళా కార్మికురాలు... యూనియన్ కోసం తమ చిన్న చిన్న సంచి ముడులు విప్పి పావలా చొప్పున చెల్లించడం ఇలా బెన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందట. అయితే కేవలం వీరి హక్కుల కోసం పోరాడటమే సరిపోదని ఇలా బెన్ వేగంగా గుర్తించారు. యజమానుల మనసు మార్చే.. మున్సిపాలిటీ, పోలీస్ వంటి వ్యవస్థలు మహిళా కార్మికులను దోచుకోకుండా రక్షించేందుకు తగిన చట్టాలూ అవసరమని భావించారు. ఇజ్రాయెల్ పర్యటనలో సహకార సంఘాలు, ట్రేడ్ యూనియన్ల పనితీరుపై అవగాహన పెంచుకున్న ఇలా బెన్ వాటిని భారత్లోనూ స్థాపించే ప్రయత్నం మొదలుపెట్టారు. మహిళా కార్మికులకు తాము పొదుపు చేసుకున్న డబ్బును దాచుకునేందుకు బ్యాంకుల్లాంటి వ్యవస్థలేవీ లేకపోవడం గుర్తించిన ఆమె... వారితో ఓ సహకార బ్యాంకును ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఇదో విప్లవాత్మకమైన చర్యే. ఆలోచనలు, కార్యాచరణ రెండూ అలాగే ఉండేవి. సమాజంలోని అట్టడుగు పేదల జీవితాలు మార్చే ఈ పనులకు ఆమె పెట్టుకున్న పేరు ‘అభివృద్ధికి పోరాటం’. ఇలా బెన్ మార్గాన్ని ఒక్క గుజరాత్లోనే కాదు... భారత్తో పాటు ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లోనూ అనుకరించారు. ఇలా బెన్ ఆలోచనలు ఎంత విప్లవాత్మకంగా ఉండేవంటే.. కొన్ని పనులు చేయడంతోనే సమస్యలు పరిష్కారం కావనీ, అసలు సమస్య ఆలోచనా ధోరణులు మార్చడంలోనే ఉందనీ ఆమె గుర్తించారు. చట్టాలు, విధానాలు, దృక్పథాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా మాత్రమే అసంఘటిత రంగ మహిళా కార్మికుల హక్కుల సాధన సాధ్యమని నమ్మి ఆచరించారు. ఇలా బెన్ కృషికి గుర్తింపు చాలా వేగంగానే రావడం మొదలైంది. 1977లో రామన్ మెగసెసె అవార్డు వరించింది. ఆ తరువాతి కాలంలో పద్మశ్రీ, పద్మభూషణ్లు కూడా! రాజ్యసభ సభ్యు రాలిగా నామినేట్ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలు డాక్టరేట్లతో సత్కరించాయి. నెల్సన్ మండేలా స్థాపించిన అంతర్జాతీయ బృందం ‘ద ఎల్డర్స్’లోనూ ఆమెకు సభ్యత్వం లభించింది. ఇలా బెన్ రాజ్యసభ సభ్యురాలిగా వీధి వ్యాపారులు, ఇళ్లలోంచి పనిచేసేవారి కోసం పలు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆమె కృషి ఫలితంగానే వీధి వ్యాపారుల బిల్లు చట్టమైంది. పద్మశ్రీ అవార్డు అందుకునేటప్పుడు కూడా ఇలా బెన్ కోరింది ఒక్కటే... అసంఘటిత రంగంలోని మహిళా కార్మికుల కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేయమని! 1988లో వీరిపై చేసిన అధ్య యనం ‘శ్రమశక్తి’ పేరుతో విడుదలైంది. శ్రామికులను సంఘటిత పరచడం ఎంత ముఖ్యమైందో ఇలా బెన్కు బాగా తెలుసు. అందుకేనేమో... అహ్మదాబాద్లో మొదలుపెట్టిన కార్మిక సంస్థలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. ఆమె స్ఫూర్తితో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్, హోమ్ బేస్డ్ వర్కర్స్తోపాటు ఇళ్లల్లో పని చేసేవారు, చెత్త ఏరుకునేవారికీ సంఘాలు ఏర్పడ్డాయి. ఇంట ర్నేషనల్ లేబర్ యూనియన్లోనూ ఇలా బెన్ ఇళ్లల్లోంచి పనిచేసుకునే వారి కోసం ఓ సదస్సు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. పరిశోధకులు, విధాన రూపకర్తలు, సామాజిక కార్యకర్తలతో ఆమె ‘వీగో’ పేరుతో ఒక అంత ర్జాతీయ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇలా బెన్ సాధించిన అతి గొప్ప విజయం ఏదైనా ఉందంటే.. అది పేద మహిళా కార్మికుల జీవితాలను మార్చడమే కాదు.. విద్యావంతులు, ప్రొఫెషనల్స్ కూడా ఉద్యమంలో పాల్గొనేలా చేయడం! గత ఏడాది ‘సేవా’ సంస్థ స్వర్ణోత్సవాలు జరిగాయి. అయితే ఇలా బెన్ మాత్రం అప్పటికి కూడా రానున్న యాభై ఏళ్లలో ఎలాంటి మార్పులు తీసుకురాగలమో చూడాలన్న ఆశాభావంతోనే ఉండేవారు. రేనానా ఝాబ్వాలా, వ్యాసకర్త ప్రఖ్యాత సామాజిక కార్యకర్త (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
Ela Bhatt: పద్మభూషణ్ ఇలా భట్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, గాంధేయవాది ఇలా భట్( 89) ఇక లేరు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం గుజరాత్ అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. 1933లో జన్మించిన ఇలా భట్.. సూరత్లోని సర్వజనిక్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి, ఎంటీబీ ఆర్ట్స్ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. 1955లో టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ (TLA) అని పిలువబడే టెక్స్టైల్ కార్మికుల పూర్వ యూనియన్లో న్యాయ విభాగంలో చేరారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ (SEWA) వ్యవస్థాపకురాలిగా ఇలా భట్ పేరొందారు. అంతేకాదు.. మహిళల ఆర్థిక సంక్షేమం కోసం మొట్టమొదటి మహిళా బ్యాంకును సైతం ఆమె ఏర్పాటు చేశారు. 1977లో కమ్యూనిటీ లీడర్ షిప్ కేటగిరీ కింద.. ఆమె రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. అంతేకాదు.. 1979లో ఏర్పాటైన మహిళల ప్రపంచ బ్యాంకుకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆపై దానికి ఆమె చైర్పర్సన్గానూ వ్యవహరించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 1985లో పద్మశ్రీ, ఆ మరుసటి ఏడాదికే పద్మ భూషణ్ ప్రకటించింది భారత ప్రభుత్వం. 2011లో గాంధీ శాంతి బహుమతి సైతం ఆమె అందుకున్నారు. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలకు సలహాదారుగా పని చేశారు. గాంధీజీ ప్రేరణతో, భట్ సేవా (SEWA)ను స్థాపించారు. రాజ్యసభ సభ్యురాలిగానూ ఆమె 1989 వరకు పనిచేశారు. 2007లో ఆమె మానవ హక్కులు, శాంతిని పెంపొందించడానికి నెల్సన్ మండేలా స్థాపించిన ఎల్డర్స్ అనే గ్రూప్లో చేరారు. కాగా, ఇలా భట్ మృతిపట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Saddened by the demise of noted activist and Padma Bhushan awardee, Smt. Ela Bhatt. She devoted her life to Gandhian ideals and transformed the lives of millions of women, by empowering them. My heartfelt condolences to her near & dear ones, and her many admirers. — Rahul Gandhi (@RahulGandhi) November 2, 2022 -
'ఆయన ఓ ఆధ్యాత్మిక శ్రీమంతుడు'
ముంబయి: ఆయనొక పేరు మోసిన వ్యాపార వేత్త. వారికి కోట్లలో ఆస్తి. దాదాపు 55 ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు. ఆ ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఉన్నారు. కానీ, ఉన్నపళంగా అనూహ్యంగా మిగతా భాగస్వాములంతా అవాక్కయ్యేలా తన బాధ్యతలను వదులుకున్నారు. దీంతోపాటు ఇక ఆస్పత్రుల నిర్వహణ బాధ్యతలే కాకుండా ఆ వాసనే అంటకుండా దూరంగా జరిగారు. అది కూడా 'సేవామార్గానికి'. ఇప్పటి వరకు మంచి వైద్యం అందజేయడం ద్వారా సమాజానికి సేవలు అందించిన ఈ ఖరీదైన వ్యాపార వేత్త ఇక తన ఆధ్మాత్మిక ఆలోచనలతో సేవ చేయాలనుకుని ఆధ్యాత్మిక సేవా మార్గం ఎంచుకున్నారు. ఫోర్టిస్ హెల్త్ కేర్ అనే పేరుగడించిన ఆస్పత్రులకు శివిందర్ మోహన్ సింగ్ అనే బిలియనీర్ వ్యాపారవేత్త ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ఆయన తన సేవలు అందిస్తున్నారు. అయితే, ఉన్నపలంగా తన బాధ్యతలను విరమించుకుని 'రాధా సోమి సత్సంగ్ బియాస్' అనే ఆధ్మాత్మిక సంస్థలో చేరి పూర్తిస్థాయిలో ఆధ్మాత్మిక చింతనలో మునిగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఫోర్టిస్ కంపెనీ స్పష్టం చేసింది. 40 ఏళ్ల శివిందర్ సింగ్కు మలవిందర్ అనే సోదరుడు కూడా ఉన్నారు. వీరిరువురు ఫోర్టిస్ బ్రాండ్ కింద 55 ఆస్పత్రులు నడుపుతున్నారు. దీంతోపాటు రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ అనే ఆర్థిక సేవలు అందించే సంస్థ కూడా ఉంది. రాధా సోమి సత్సంగ్ బియాస్ అనేది అమృతసర్కు చెందిన తత్వసంబంధ ఆధ్యాత్మిక సంస్థ. ప్రస్తుతం శివిందర్ సింగ్ ఇందులో చేరుతుండటంతో 2016 జనవరి 1 నుంచి ఫోర్టిస్ సంస్థ ఆయనను నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ హోదాతో గౌరవించనుంది. శివిందర్ సింగ్ సోదరుడు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొనసాగనున్నారు. ఈ ఇరువురు సోదరులు 2015 ఇండియన్ బిలియనీర్స్ ఫోర్బ్స్ జాబితాలో 35 స్థానాన్ని పొందారు.