breaking news
Senior Intermediate
-
సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్లో తప్పిదం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పరీక్షలో ఒక ప్రశ్న తప్పుగా వచ్చింది. ప్రశ్నాపత్రంలోని సెక్షన్–బీలో నాలుగు మార్కులకు ఇచ్చిన 14వ ప్రశ్నలో ‘ఏ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ వాటర్ ఈజ్ లేబుల్డ్ యాజ్ 100 పర్సంట్ (డబ్ల్యూ/వీ)’గా వచ్చింది. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, 10.30 గంటలకు ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి అందిన సమాచారంతో ఈ ప్రశ్నలో ఉన్న ‘డబ్ల్యూ/వీ’కి బదులుగా డబ్ల్యూ/డబ్ల్యూగా మార్చుకుని జవాబులు రాయాలని విద్యార్థులకు ఇన్విజిలేటర్లు సూచించారు. ముద్రణ లోపం కారణంగా తప్పిదం జరిగిందని, అందుకే ప్రశ్నను మార్పు చేసుకుని జవాబు రాయాలని పేర్కొన్నారు. అయితే, అప్పటికే గంటన్నర సమయం గడిచిపోవడంతోపాటు ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నకు యథావిధిగా చాలామంది విద్యార్థులు జవాబు రాశారు. దానిని మళ్లీ మార్పుచేసి జవాబు రాయాల్సి రావడంతో సమయం సరిపోక ఇబ్బందిపడినట్లు విద్యార్థులు తెలిపారు. కాగా, ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ‘డబ్ల్యూ/వీ’ అనే పదం సరైనదేనని, అనవసరంగా దీనిని మార్పుచేసి విద్యార్థులను అయోమయానికి గురిచేశారని కెమిస్ట్రీ సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. కొన్ని కార్పొరేట్ కళాశాలలు తమ విద్యార్థులకు ఇచ్చిన స్టడీ మెటీరియల్లో డబ్ల్యూ/డబ్ల్యూ అని ఉందని, వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రశ్నను సవరించారని ఆరోపిస్తున్నారు.ఇంటర్ పరీక్షా కేంద్రంలో మాస్కాపీయింగ్!సోషల్ మీడియాలో వీడియో వైరల్చాగలమర్రి: నంద్యాల జిల్లా చాగలమర్రిలోని ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాగలమర్రిలోని శ్రీ వాసవి జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐదు కాలేజీలకు చెందిన విద్యార్థులు గత 15 రోజులుగా పరీక్షలు రాస్తున్నారు. ఇటీవల ఒక కాలేజీకి చెందిన విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతుండగా, శ్రీ వాసవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీడియో తీసినట్లు తెలిసింది. ఆ వీడియోను తమ కాలేజీ కరస్పాండెంట్కు ఆయన పంపినట్లు సమాచారం. దీంతో వాసవి కాలేజీ కరస్పాండెంట్ ఆ వీడియోను మాస్కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థుల కాలేజీ కరస్పాండెంట్కు పంపించి.. ‘మీ పిల్లలు ఎలా మాస్కాపీయింగ్కు పాల్పడుతున్నారో.. చూడండి..’ అని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆ వీడియా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, కరస్పాండెంట్ల వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లోకి చేరినట్లు సమాచారం. ఈ వీడియోను ఒక కాలేజీ కరస్పాండెంట్ కొద్దిరోజుల కిందట ఆర్ఐవోకు పంపినట్లు తెలిసింది. వెంటనే ఆర్ఐవో సునీత స్పందించి ముగ్గురు అధికారులను తనిఖీల కోసం పంపించగా, వారికి ముడుపులు ముట్టచెప్పి అసలు వ్యవహారాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అయినా, ఆర్ఐవో ఆదేశాల మేరకు గత ఐదారు రోజుల నుంచి ఈ పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయడం గమనార్హం. మాస్కాపీయింగ్ జరగలేదు: ప్రిన్సిపాల్ ఓబులేసు తమ కాలేజీ గుర్తింపు రెన్యూవల్కు గడువు పూర్తికావడంతో అఫిలియేషన్ కొనసాగించేందుకు పరిశీలించడానికి ఆర్ఐవో సునీతతోపాటు త్రిసభ్య కమిటీ సభ్యులు వచ్చారని శ్రీ వాసవి కాలేజీ ప్రిన్సిపాల్ ఓబులేసు తెలిపారు. తమ కళాశాల పరీక్ష కేంద్రంలో ఎలాంటి మాస్కాపీయింగ్ జరగలేదని ఆయన చెప్పారు. -
బాలికలదే పైచేయి..
సీనియర్ ఇంటర్లో 54 శాతం ఉత్తీర్ణత.. రాష్ర్టంలో 8వ స్థానం -సర్కార్ కళాశాలల ఫలితాల్లో జిల్లా టాప్ - జిల్లా విద్యార్థినికి సీఈసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ - మెరుగుపడిన ఉత్తీర్ణత శాతం ఆదిలాబాద్ టౌన్ : సీనియర్ ఇంటర్మీడియెట్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. ఉత్తీర్ణత శాతంలో వారిదే హవా కొనసాగింది. గతంతో పోల్చుకుంటే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతంలో కాస్తంతా మెరుగుపడింది. గతానికంటే ఐదు శాతం పెరిగి.. ఈ ఏడాది జిల్లా 54 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో చివరి స్థానంలో నిలిచిన జిల్లా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరీక్ష ఫలితాల్లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్ధానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలల పరంగా రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలువడం గమనార్హం. ఇదిలా ఉండగా జైనూర్ ప్రభుత్వ కళాశాలలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం.. జనరల్ కోర్సుల్లో మొత్తం 22,251 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 12,093 మంది ఉత్తీర్ణత సాదించారు. 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 10,694 మంది పరీక్షకు హాజరుకాగా 5,121 మంది పాసయ్యారు. 48 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా బాలికలు 11,557 మంది పరీక్షకు హాజరుకాగా 6,972 ఉత్తీర్ణులయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్ కోర్సుల్లో మొత్తం 2,756 మంది పరీక్షకు హాజరు కాగా 1483 మంది ఉత్తీర్ణత సాధించారు. 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 1,787 మందికి 894 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 50 శాతం నమోదైంది. బాలికలు 969 మందికి 589 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 61 శాతం నమోదైంది. రాష్ట్ర స్థాయిలో వొకేషనల్ ఫలితాల్లో 8వ స్థానంలో నిలిచింది. ఫలితాలను గ్రేడ్, మార్కుల రూపంలో విడుదల చేశారు. 75 శాతం పైగా మార్కులు వచ్చిన వారికి ఏ-గ్రేడ్, 60-75 వరకు బి-గ్రేడ్, 50-60 వరకు సి-గ్రేడ్, 35-50 డి-గ్రేడ్ కేటాయించారు. ప్రభుత్వ కళాశాలల ఫలితాల్లో స్టేట్ ఫస్ట్.. ప్రభుత్వ కళాశాలలు కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు దీటుగా మంచి ఉత్తమ సాధించాయి. ప్రభుత్వ కళాశాలల పరంగా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 75 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కళాశాలల్లో చదివిన విద్యార్థులు 5,451 మంది పరీక్షకు హాజరుకాగా 4,064 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 2,701 మందికి గాను 1,925 మంది పాసయ్యారు. 71.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 2,750 మంది పరీక్షకు హాజరుకాగా 2,139 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 77.78 శాతం నమోదైంది. వొకేషనల్ ఫలితాల్లో మొత్తం 643 మంది పరీక్షకు హాజరుకాగా 546 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 85గా నమోదైంది. బాలురు 490 మంది పరీక్షకు హాజరుకాగా 407 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 83.06 శాతం నమోదైంది. బాలికలు 153 మంది పరీక్షకు హాజరుకాగా 139 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.85 శాతం నమోదైంది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 4వ స్థానంలో నిలిచింది వందశాతం ఉత్తీర్ణత.. ప్రభుత్వ జూనియర్ కళాశాల జైనూర్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 93 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 93 మంది ఉత్తీర్ణత సాధించారు. నార్నూర్ జూనియర్ కళాశాలలో 98.73 ఉత్తీర్ణత సాధించారు. ఈ కళాశాలలో 79 మంది పరీక్ష రాయగా 78 మంది ఉత్తీర్ణులయ్యారు. సారంగాపూర్, జైపూర్ కళాశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 10 ప్రభుత్వ కళాశాలల్లో 90 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా సర్కార్ కళాశాలల్లో పలితాలు రావడంపై అయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సంతోషం వ్యక్తం చేశారు. మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్ఐవో ప్రభాకర్ తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష ఫీజు మే 6లోగా చెల్లించాలన్నారు. మే 1 నుంచి మార్కుల మెమోలను అందజేస్తామని తెలిపారు. రీకౌంటింగ్ కోసం రూ.100, జిరాక్స్ కాపీ కోసం రూ.600 డీడీ తీయాలని ఆయన సూచించారు. సత్తాచాటిన విద్యార్థులు ఆదిలాబాద్ టౌన్ : ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఉత్తమ మార్కులు సాధించి జిల్లా పేరును నిలబెట్టారు. రాష్ట్రస్థాయిలో సీఈసీ గ్రూప్లో జిల్లా విద్యార్థిని పులి రాణి 1000 మార్కులకు గాను 963 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఎంపీసీలో నిర్మల్లోని దీక్ష కళాశాలకు చెందిన వినీత్కుమార్ 978 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచాడు. బైపీసీలో కె.నవత 958, సీఈసీలో ప్రశాంత్ 917 మార్కులు సాధించారు. ఎస్ఎస్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థిని సంకీర్తన ఎంపీసీలో 973, వి.రాణి బైపీసీలో 962 మార్కులు సాధించారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రీసెంట్ కళాశాలకు చెందిన సబా ఖానమ్ ఎంపీసీలో 966, గుల్నాజ్ 936, తన్వీర్ అహ్మద్ ఖాన్ 923 మార్కులు సాధించారు. బైపీసీలో ముషరఫ్ అర్జుమాండ్ 976, షాహిస్తా నజ్రీన్ 933, సానియా ఫాతిమ 971 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలోని విద్యార్థి కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపీసీలో హరితగౌడ్ 939, కె.అంకిత 938, ృసష్టి 929, బైపీసీలో మల్లికార్జున్ 897, సీఈసీలో ప్రాచి 910 మార్కులు సాధించారు. నలంద కళాశాల విద్యార్థులు ఎంపీసీలో హీన అగర్వాల్ 975, శ్వేత జెన్కర్ 970, జ్యోతి అమ్మాని 965, బైపీసీలో గేడం గోవర్ధన్ 926, సౌమ్య 918, సీఈసీలో సాయిరాం 910, ఎంఈసీలో అహుజ స్నేహ సుభాష్లాల్ 875 మార్కులు సాధించారు. పట్టణంలోని ఆదిత్య కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపీసీలో సౌమ్య యాదవ్ 948, బైపీసీలో షాహిద్ అన్సారీ 918 మార్కులు సాధించారు.