breaking news
Sandeep Kumar sultaniya
-
గ్రామీణ ప్రాంతాల్లో మ్యుటేషన్ ఫీజు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాం తాల్లో వ్యవసాయేతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం మ్యుటేషన్ ఫీజును ఖరారుచేసింది. ఫీజు కింద సదరు ఆస్తి విలువలో 0.1 శాతం లేదంటే రూ.800 (రెండింటిలో ఏది ఎక్కువైతే అది) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మంగళవారం జీవో నంబర్–46 విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రమంతటా గ్రామ పంచాయతీల పరిధిలోని వ్యవసాయేతర స్థిరాస్తులపై హక్కుల బదిలీ కోసం ఒకేరకమైన ఫీజు వసూలు చేస్తారు. గతంలో గ్రామ పంచాయతీల తీర్మానం మేరకు ఆయా గ్రామాల్లో మ్యుటేషన్ ఫీజు నిర్ధారించే ఆనవాయితీ ఉంది. దీంతో మ్యుటేషన్ ఫీజు ఒక్కో గ్రామంలో ఒక్కోలా ఉండేది. తాజా ఉత్తర్వులతో మ్యుటేషన్ ఫీజు ఖరారు అధికారం గ్రామ పంచాయతీలకు ఉండదు. ధరణి ద్వారా గ్రామాల్లోనూ ఏకరూప రుసుము అమలవుతుంది. క్రయవిక్రయాలు, వారసత్వ హక్కుల బదిలీ, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల వంటి లావాదేవీలకు ఇది వర్తి స్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. -
హెల్మెట్ ఉంటేనే ఆర్టీఏకు రండి
అవగాహనార్యాలీలో సుల్తానియా సాక్షి, హైదరాబాద్ : ‘బాధ్యతగా హెల్మెట్ ధరిం చండి. ప్రాణాలను కాపాడుకోండి. మీ కోసం మీ కుటుంబం ఎదురు చూస్తోందనే విషయాన్ని మరచి పోవద్దు.’ అని రవాణా శాఖ కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా వాహనదారులకు అన్నారు. హెల్మెట్లేని వాహనదారులను ఆర్టీఏ కార్యాల యాల్లోకి అనుమతించబోమని చెప్పారు. శనివారం ఖైరతాబాద్లోని రవాణా కమిషనర్ కార్యాలయం వద్ద హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సుల్తానియా మాట్లాడుతూ హెల్మెట్ ధరించాలనే నిబంధన కొత్తగా వచ్చిందికాదన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో 25 శాతం మంది హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారేనని ఆం దోళన వ్యక్తం చేశారు. కాలేజీలు, విద్యాసంస్థలు, నగరంలోని ప్రధానకూడళ్లలో హెల్మెట్పై విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు హైదరాబాద్ సం యుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. ఖైరతాబాద్ నుంచి సోమాజిగూడ రాజ్భవన్ రోడ్డు, రాజీవ్ చౌరస్తా, పంజగుట్ట, ఎర్రమంజిల్ మీదుగా తిరిగి రవాణా కమిషనర్ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది. కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారులు జీపీఎన్ ప్రసాద్, దశరథం, లక్ష్మి, పలువురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఉప్పల్ ప్రాంతీయ రవాణా కార్యాలయం వద్ద జరిగిన హెల్మెట్ అవగాహనర్యాలీని రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్కుమార్ ప్రారంభించారు.