breaking news
rs 30 lakhs
-
తండ్రి చేతిలో తనయుల కిడ్నాప్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తన తండ్రి నుంచి డబ్బులు రాబట్టేందుకు తనయులనే కిడ్నాప్ చేసిన ఓ తండ్రి ఉదంతం చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. అంబత్తూరు సమీపం కల్లికుప్పంకు చెందిన కిరణ్కుమార్ (39) చెన్నై చేట్పట్లోని కాల్సెంటర్లో పనిచేస్తున్నాడు. ఇతనికి వికాస్ (11), జయదీప్ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. స్కూలుకు వెళ్లేందుకు నిల్చుని ఉండగా వ్యాన్ రిపేరుకు గురైంది, అందుకే కారు పంపారు అంటూ ఇద్దరు వ్యక్తులు పిల్లలు ఇద్దరిని ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో మరో ఇద్దరు కారు ఎక్కారు. కిరణ్కుమార్కు వారు ఫోన్ చేసి రూ.30లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కిడ్నాపర్లు పిల్లలను విడిచిపెట్టి పారిపోయారు. కిరణ్కుమార్కు రూ.30లక్షల వరకు అప్పు ఉందని, రిటైర్డు శాస్త్రవేత్తై తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉన్న లక్షలాది రూపాయలతో అప్పు తీర్చుకోవచ్చని పథకం పన్ని కిరణ్కుమార్ స్నేహితులతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీస్ విచారణలో తేలింది. కిరణ్కుమార్తోపాటు ఇద్దరు స్నేహితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
కారులో 30లక్షల చోరీ
-
కారులో 30లక్షల చోరీ
తిరుమల క్రైమ్ (తిరుపతి): మాయమాటల చెప్పి కారులో ఉన్న 30 లక్షల రూపాయలను చోరీ చేసిన సంఘటన తిరుమలలో బుధవారం జరిగింది. సారంగి హోటల్కు చెందిన మోహన్ రూ. 30లక్షలు తీసుకుని తిరుమలలోని శ్రీదేవి కాంప్లెక్స్కు అతని అసిస్టెంట్ భానుప్రకాష్తో కలిసి వచ్చాడు. భాను ప్రకాష్ను కారులో కూర్చోబెట్టి ఆయన శ్రీదేవి కాంప్లెక్స్లోకి వెళ్లాడు. కారులో ఉన్న భాను ప్రకాష్ను ఓ అగంతకుడు కింద చేతి రుమాలు పడిపోయింది అందులో పది రూపాయలు ఉన్నాయని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన భాను కిందికి దిగి చూస్తుండగానే కారులోని 30లక్షల రూపాయలను అగంతకుడు చోరీ చేసి తీసుకెళ్లాడు. ఈ విషయంపై పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తిరుమల క్రైమ్ ఏఎస్పీతోపాటు ఐదుగురు సీఐలు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.