breaking news
Riyaa
-
డేటింగ్ యాప్లో.. బ్లడ్ డోనార్స్!
కరోనాకు ముందు డేటింగ్ యాప్లకు మంచి డిమాండ్ ఉండేది. టిండర్ లాంటి డేటింగ్ యాప్ యూజర్లంతా తమ జీవిత భాగస్వామి కోసం తెగ స్వైప్ చేశారు. కరోనా దెబ్బకు డేటింగ్ యాప్లు చప్పబడ్డాయి. కానీ ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో టిండర్ మరోసారి యాక్టివేట్ అయ్యింది. అయితే ఈసారి లైఫ్ పార్టనర్ కోసం కాదు. తమ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికోసం. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారు. డేటింగ్ యాప్ ద్వారా ..రక్తదాతలు, పేషంట్లకు మధ్య వారధిగా నిలుస్తూ ఇద్దరి మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తున్నారు చెన్నైకి చెందిన వైద్యవిద్యార్థి రియా గుప్తా డేటింగ్ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న ఎంతోమందికి రక్తం అందిస్తున్నారు. ఇటీవల రెండునెలల వయసున్న భవన్ కు అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు రక్తం అవసరమైంది. కరోనా సమయంలోఎక్కడా రక్తదానం చేసేవారు దొరకలేదు. ఈ విషయం అర్ధరాత్రి రెండు గంటల ప్రాతంలో రియాకు తెలియడంతో.. తనకు తెలిసిన వాళ్లు, స్నేహితులకు ఫోన్లు చేయడం, సోషల్ మీడియా, వాట్సాప్లలో బ్లడ్ డోనార్స్ కావాలని పోస్టులు పెట్టింది. ఎట్టకేలకు ఆమె పోస్టులకు టిండర్ అకౌంట్లో ఒక దాత అర్ధరాత్రి మూడు గంటలకు స్పందించారు. దీంతో మరుసటిరోజు ఉదయం ఎనిమిది గంటలకు భవన్కు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇలా అవసరంలో ఉన్న వారెందరికో రియా బ్లడ్డోనార్స్ను ఏర్పాటు చేస్తోంది. ప్లాస్మాడోనర్ ప్రేరణతో.. ‘‘మనదేశంలో కరోనా రెండోసారి విజృంభిస్తోన్న ఈ సమయంలో ‘‘ఫలానా గ్రూపు రక్తం కావాలి! సాయం చేయండి ప్లీజ్!’’ అని సోషల్ మీడియాలో కోకొల్లలుగా మెసేజులు వస్తున్నాయి. అలా ఓ నెలరోజులు పాటు నేను నా ఫ్రెండ్స్ వాళ్ల రిక్వెస్ట్లు చూసేవాళ్లం. కరోనా సమయంలో సాయం చేయడానికి ముందుకొచ్చేవారు తక్కువే. వ్యాక్సిన్ వేసుకున్న వారు 28 రోజులు గడవందే రక్తదానం చేయకూడదు. దీంతో రక్తదాతలు దొరకడం చాలా కష్టమైంది. ఇలా అనుకుంటున్న సమయంలో ఓరోజు.. ‘‘టిండర్ అకౌంట్ ద్వారా ప్లాస్మా డోనర్ దొరికారు’’ అని ఒకతను చెప్పడం మేము విన్నాం. అప్పుడు అతనిలాగే బ్లడ్ డోనర్స్ కోసం టిండర్ డేటింగ్ యాప్ను వాడాలనుకున్నాం. ఈ క్రమంలోనే నా స్నేహితులతో కలసి ‘‘బ్లడ్డోనర్స్ కావాలి’’ అని టిండర్లో పోస్టులు పెట్టాము. దానికి మంచి స్పందన లభించడంతో..స్లాక్, టిండర్, వాట్సాప్ గ్రూపులను ఎగ్మోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, మెటర్నిటి ఆసుపత్రి, అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మొదలైన వాటిని సమన్వయపరిచాం. ఈ సంస్థల నుంచి ‘‘బ్లడ్ కావాలని రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ను టిండర్ గ్రూపులో పోస్టు చేస్తాం! రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వారికి పేషంట్లు లేదా ఆసుపత్రి సిబ్బందిని నేరుగా కలుసుకునే Ðð సులుబాటు కల్పిస్తాం’’ అని రియా చెప్పింది. ఇప్పటిదాక వందమందికిపైగా డోనర్స్తో రక్తదానం చేయించాము. నా ఇన్స్టాగ్రామ్ పేజి బ్లడ్ డోనార్ కనెక్ట్కు రక్తం కావాలని ఏదైనా మెస్సేజ్ వచ్చిందంటే అరగంట నుంచి గంటలోపు రక్త దాతను వెదికి రిక్వెస్ట్ పెట్టిన వారికి చేరుస్తాము. త్వరలో మా సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాము’’ అని రియా వివరించింది. రియా చేస్తున్న సాయం గురించి తెలుసుకున్న రెడ్ క్రాస్ ఇండియా, చెన్నై ట్రైకలర్ వంటి ఎన్జీవోలు సైతం రక్తం కోసం రియాను సంప్రదించడం విశేషం. -
హైదరాబాద్ మూలాలున్న రియాకు అవార్డు
సాక్షి, హైదరాబాద్: రాజధాని మూలాలున్న రియా ఉప్పలపాటి అనే 17 ఏళ్ల యువతి ‘అట్లాంటా ఇన్నోవేటర్స్’టాలెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. పాతికేళ్లలోపు విభాగంలో ఆమె ఈ అవార్డు సాధించారు. వాల్టన్ హైస్కూల్లో సీనియర్ గ్రేడ్ చదువుతున్న రియా సొంతంగా అట్లాంటా సిటీలో ‘ఫరెవర్ ఎర్త్’అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై అవగాహన పెంపొందించడంతో పాటు వ్యర్థాలను వీలైనంత మేర తగ్గిస్తూ ప్రజలు సుస్థిర జీవితాన్ని నిర్వహించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. ఆమె రచించిన ‘ఇన్మై బ్యాక్ యార్డ్–ఎ పర్సనల్ స్టోరీ ఆఫ్ ద డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెట్రోలియం ఆన్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ’పుస్తకం ఇటీవలే అట్లాంటాలో విడుదలైంది. పెట్రోలియం, చమురు పరిశ్రమల కారణంగా ఎదురవుతున్న సమస్యల గురించి ఈ పుస్తకంలో చర్చించారు. హైదరాబాద్, అట్లాంటాలో ఒక్కో విద్యార్థికి పూర్తి ట్యూషన్ ఫీజును భరించేలా హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ను ఫరెవర్ ఎర్త్ సంస్థ స్పాన్సర్ చేస్తుంది. రియా తాత ఉప్పలపాటి సుబ్బారావు బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ కాగా.. ఆమె తండ్రి ఇంజనీర్గా, తల్లి డాక్టర్గా అట్లాంటాలో పనిచేస్తున్నారు. -
‘రాజమహల్’లో హారర్
సూర్యనాథ్, రియా, వందన, సౌమ్య ముఖ్య తారలుగా సన్ ఐ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘రాజమహల్’ చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. అప్పాజి కొండ దర్శకుడు. తొలి సన్నివేశానికి గురుదత్ స్వామీజీ కెమెరా స్విచాన్ చేయగా, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు క్లాప్ ఇచ్చారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘సెంటిమెంట్, రొమాన్స్ సమాహారంతో సాగే హారర్ మూవీ ఇది. ఈ 26న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. హీరోగా తనకిది తొలి చిత్రమని సూర్యనాథ్ చెప్పారు. ఈ కథ బాగుందని, మంచి పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉందని సౌమ్య అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ యువన్, కెమెరా: జీఎల్ బాలు.