breaking news
Regional conflicts
-
ఆస్పత్రి తరలింపుపై రాజకీయాలొద్దు
ఛాతీ ఆస్పత్రి పరిరక్షణ కమిటీ వెంగళరావునగర్: ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి తరలించే విషయంలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావద్దని, ఇది సరైన పద్ధతి కాదని చెస్ట్ హాస్పిటల్ పరిరక్షణ కమిటీ (జేఏసీ) చైర్మన్ డాక్టర్ ప్రమోద్కుమార్ చెప్పారు. గురువారం వైద్యులు, వైద్యేతర సిబ్బంది ఆస్పత్రిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రమోద్కుమార్ మాట్లాడుతూ ఛాతీ ఆస్పత్రితో ఇతర ఆస్పత్రులకు సంబంధం లేదని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయంగాని, ప్రాంతీయతత్వంగాని కొత్తగా సృష్టిం చవద్దన్నారు. ఇక్కడ నుంచి ఆస్పత్రిని తరలిస్తే వైద్యుల కంటే ఎక్కువగా రోగులే ఇబ్బంది పడతారని చెప్పారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్యులు ఈ విషయంలో అనవసర జోక్యం చేసుకుని ఇది తమకు అంగీకారమేనని చెప్పడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవని, ఇక్కడ అందరం కలిసి కట్టుగా అన్నదమ్ముల్లా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. దీన్ని తరలించవద్దని అందరం ముక్తకంఠంతో చెబుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ఉమర్ఖాన్, సతీష్, వీరమణి, అనిల, బ్లాండినా, అరుణ జ్యోతి, లక్ష్మీనారాయణ, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు. -
కలిసుంటేనే అభివృద్ధి
‘రామినేని’ అవార్డుల ప్రదాన సభలో పరిపూర్ణానంద సరస్వతి స్వామి విజయవాడ: ప్రాంతీయ విభేదాల కారణంగా తెలుగుజాతి వెనుకపడిపోయిందని, ఈ సమయంలో ఆంధ్ర, రాయలసీమ అని ఆలోచించకూడదని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. కృష్ణానది రాయలసీమలోని శ్రీశైలం మీదుగా వస్తుందని, ఆ నీరే లేకపోతే ఇక్కడ పంటలు ఎండిపోతాయని, అలాగని నీరు నిలుపుకొంటే సీమకూ ఉపయోగం ఉండదన్నారు. రెండు ప్రాంతాలు కలిస్తేనే పచ్చటి పంటలు పండుతున్నాయన్నారు. అక్కడి మల్లన్న ఇక్కడి దుర్గామల్లేశ్వరుడు ఇద్దరూ ఒక్కరేనన్నారు. ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్లో డాక్టర్ రామినేని అయ్యన్న చౌదరి పేరిట ఏర్పాటుచేసిన రామినేని ఫౌండేషన్ 15వ పురస్కారోత్సవం జరిగింది. సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్.మోహనరావుకు విశిష్ట పురస్కారం, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, రంగస్థల కళాకారుడు ఆచంట వెంకటరత్నం నాయడు, సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహరావులకు విశేష పురస్కారాలను అందజేశారు. ముఖ్యఅతిథి పరిపూర్ణానంద మాట్లాడుతూ ప్రాంతీయ భావాలను విడనాడి తెలుగువారంతా కలిసి కొత్త రాజధానిని అభివృద్ధి చేయాలని, దీనిలో రామినేని ఫౌండేషన్ తనదైన మార్కు చూపిం చాలన్నారు. సమావేశానికి జెడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం అధ్యక్షత వహించగా, ఎంపీలు గోకరాజు గంగరాజు, కేశినేని శ్రీని వాస్ (నాని), ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, శ్రీరాం రాజగోపాల్, ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మప్రచారక్, ఆయన సోదరులు పాల్గొన్నారు.