breaking news
recovering in hospital
-
కోలుకుంటున్న క్షతగాత్రులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/మొయినాబాద్: మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కోలుకుంటున్నారు. స్వల్ప గాయాలతో వికారాబాద్, చేవెళ్ల ఆస్పత్రుల్లో చేరిన 27 మందిలో ఇప్పటికే ఆరుగురు డిశ్చార్జ్ కాగా, మంగళవారం మరో ఐదుగురు ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తు తం ఉస్మానియా ఆస్పత్రిలో ఆరుగురు, పీఎంఆర్లో 12 మంది, వికారాబాద్లో ఒకరు, నిమ్స్లో ఇద్దరు, మెడ్లైఫ్లో ఒకరు చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతో చేవెళ్ల పీఎంఆర్ ఆస్పత్రిలో చేరిన ఎండీ యోనస్, జె.జగదీశ్తోపాటు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బి.ప్రవీణ, సయ్యద్ తహ్రా, సయ్యద్ ఖాతిజలు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపారు.మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు.. తలకు తీవ్ర గాయాలైన సయ్యద్ అస్మాను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. షేక్ తస్లీమా, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ ఖాజావలి, సయ్యద్ షఫీలను కూడా ఉస్మానియాకు పంపారు. ప్రస్తుతం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మోహిని స్వప్న మాత్రమే చికిత్స పొందుతోంది. పీఎంఆర్ ఆస్పత్రిలో 12 మందికి చికిత్స అందిస్తున్నారు. సుజాత, నందినికి నిమ్స్లో చికిత్స చేశారు. టిప్పర్ యజమాని లక్ష్మణ్నాయక్ బండ్లగూడ జాగీర్లోని మెడ్లైఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శకలాలే ఆనవాళ్లు.. ఘోర ప్రమాదంతో భీతావహంగా మారిన మీర్జాగూడ మంగళవారం నిశ్శబ్దంగా కనిపించింది. కంకర లోడుతో వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది మరణించగా, 27 మంది గాయపడిన విషయం తెలిసిందే. సోమ వారం శవాల దిబ్బలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో కంపించిన ఈ ప్రాంతం సాధారణంగా మారిపోయింది. ఆ మార్గంలో వెళ్లేవాళ్లు ప్రమాద స్థలాన్ని ఆసక్తిగా, ఒకింత భయంగా పరిశీలిస్తూ ఘటనపై చర్చించుకున్నారు. రోడ్డు పక్కన కంకర దిబ్బలు, వాహనాల శకలాలు ప్రమాదానికి ఆనవాళ్లుగా మిగిలాయి. టిప్పర్, బస్సును చేవెళ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. నిద్ర వస్తుంటే మధ్యలో చాయ్ తాగాం ఏడాది క్రితమే టిప్పర్ కొనుగోలు చేశాను. అప్పటికే నాతో కలిసి పనిచేసిన మహారాష్ట్రకు చెందిన ఆకాశ్కాంబ్లేను డ్రైవర్గా నియమించుకున్నా. ఆదివారం రాత్రి లక్డారం సమీపంలోని క్వారీలో కంకర లోడ్ చేయించాం. సోమవారం తెల్లవారుజాము వరకు నేనే టిప్పర్ నడిపాను. రాత్రంతా డ్రైవింగ్ చేయడం వల్ల నిద్ర వస్తుంటే మధ్యలో ఓ హోటల్ వద్ద ఆపి ఇద్దరం చాయ్ తాగాం. అప్పటి వరకు నా చేతిలో ఉన్న స్టీరింగ్ను ఆకాశ్ కాంబ్లే తీసుకున్నాడు. గమ్యస్థానానికి మరికొద్ది నిమిషాల్లో చేరుకుంటామనగా ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. టిప్పర్లోనే స్పృహ తప్పిపోయాను. పోలీసులు నన్ను బయటికి తీసి వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. నేను కానీ, ఆకాశ్ కాంబ్లే కానీ మద్యం సేవించలేదు. – లక్ష్మణ్ నాయక్, టిప్పర్ యజమానిప్రాణం పోవడం ఖాయమనుకున్నా నిమ్స్లో చికిత్స పొందుతున్న జయసుధ లక్డీకాపూల్/ధారూరు: ‘బస్సులో కంకరలో కూరుకుపోయి ప్రాణాలపై ఆశ వదులుకున్నా.. సీటు దొరక్కపోవడంతో కండక్టర్తో మాట్లాతుండగా టిప్పర్ ఢీకొట్టింది.. క్షణాల్లో అంతా జరిగిపోయింది. నా ప్రాణం పోవడం ఖాయమనుకున్నా. బస్సు మొత్తం కంకరతో నిండిపోయింది. చేతుల వరకు కూరుకుపోయా, కాపాడాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు ఒకరి వద్ద ఫోన్ అడుక్కొని తమ్ముడికి కాల్ చేశా. గంటలోపు తమ్ముడు, భర్త వచ్చారు. అప్పటి వరకు అలాగే ఉన్నా. నా ఎడమ కాలుపై ఇద్దరు పడ్డారు. కుడి కాలు బస్సు సీటులో ఇరుక్కుపోయి విరిగిపోయింది.నా కాలుపై పడిన ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. భర్త, తమ్ముడు రాగానే చేతులతో కంకర తీయడం మొదలుపెట్టారు. వాళ్ల చేతులు రక్తమయంగా మారాయి. చివరకు బయటపడ్డా’అని ధారూరు మండలం కేరెళ్లికి చెందిన జయసుధ తెలిపారు. చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో పార్ట్టైమ్ టీచర్గా పనిచేస్తూ రోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మీర్జాగూడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడింది. ఎడమ కాలు పక్క ఎముకలు విరిగ్గా, కుడి కాలుకు కూడా గాయాలయ్యాయి. జయసుధ కాలుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె నిమ్స్ చికిత్స పొందుతున్నారు. -
నాన్నగారు కోలుకుంటున్నారు, వదంతులు నమ్మవద్దు: కైకాల సత్యనారాయణ కుమార్తె
ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సత్యనారాయణ ఆరోగ్యం గురించి సోషల్మీడియాలో వదంతులు ప్రచారమయ్యాయి. దీంతో ఆయన కుమార్తె కైకాల రమాదేవి ఈ విషయంపై మంగళవారం ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. ‘‘సత్యనారాయణగారి పరిస్థితి బాగానే ఉంది. నాన్నగారు కోలుకుంటున్నారు. బాగానే స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. నిన్న (సోమవారం) డాక్టర్ మాదాల రవిగారు కూడా వచ్చారు. ఆయనతో నాన్నగారు మాట్లాడి థంబ్స్ అప్ కూడా చూపించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారం ఇచ్చి ఎవర్నీ ఆందోళనకి గురిచేయొద్దు’’ అన్నారు రమాదేవి. -
నెల్లూరులో కొలుకున్న కరోనా సోకిన వ్యక్తి
-
ఆ దుండగులు దొరికారు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగురోజుల క్రితం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగమ్మాయి లావణ్య చెన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణానికి చెందిన లావణ్య (26) చెన్నై నావలూరులోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఈనెల 13న తెల్లవారుజామున విధులు ముగించుకుని నుంగంపాళయంలోని సోదరి ఇంటికి బైక్పై బయలుదేరారు. అరసన్కళని రోడ్డులో వెళుతుండగా దారిదోపిడీ ముఠా ఆమె తలపై ఇనుపరాడ్తో మోదడంతో కిందపడిపోయారు. ఈ సమయంలో ఆమె తల రోడ్డుపై ఉన్న ఒక బండరాయికి తగలడంతో తీవ్రంగా గాయపడి స్పృహకోల్పోయారు. దుండగలు ఆమె మెడలోని నగలు, డబ్బు, సెల్ఫోన్, బైక్ దోచుకెళ్లారు. స్పృహలేని స్థితిలో పడిఉన్న లావణ్యను కొందరు స్థానికులు గుర్తించి పల్లికరణై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆమెను ప్రయివేటు ఆస్పత్రి చేర్పించి విచారణ చేపట్టారు. ఈనెల 14న సెంమ్మంజేరీలోని ఒక మద్యం దుకాణం ముందు లావణ్య బైక్ను స్వాధీనం చేసుకున్నారు. సెమ్మంజేరీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు మద్యం తాగేందుకు వచ్చి మోపెడ్ అక్కడే వదిలివెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించగా ప్రధాన నిందితుడు సూర్య సహా నలుగురు పట్టుబడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య బుధవారం సాయంత్రం స్పృహలోకి వచ్చింది. అయితే ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో పోలీస్ సహాయ కమిషనర్ ముత్తుస్వామి గురువారం సాయంత్రం మరోసారి లావణ్యను కలుసుకోగా తనను కాపాడినందుకు కృతజ్ఞతలు అన్నట్లుగా తన రెండుచేతులూ జోడించి పోలీసులకు నమస్కరించింది. సంఘటన జరిగిన రోజున ఐదు కిలోమీటర్లు తనను వెంబడించి దాడిచేసిన నిందితులను గుర్తుపట్టే ఆనవాళ్లను పోలీసులకు వివరించినట్లు సమాచారం. తలపై శస్త్రచికిత్స చేసినందున ఎక్కువసేపు మాట్లాడరాదని వైద్యులు అభ్యంతరం చెప్పపడంతో పోలీసుల తిరిగి వెళ్లిపోయారని సమాచారం. -
కుదుటపడిన ఇళయరాజా ఆరోగ్యం
సంగీత ప్రపంచ రారాజు ఇళయరాజా ఆరోగ్యం కుదుటపడిందని ఆయన మేనల్లుడు, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇళయరాజాకు స్వల్పంగా గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. 70 ఏళ్ల ఇళయరాజాకు గుండెలో కొద్దిగా నొప్పి అనిపించడంతో వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అంతా బాగానే ఉందని చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. ''మా మామయ్య, ఇసైజ్ఞాని ఇళయారాజా బాగున్నారు. ఆయన కోసం ప్రార్థనలు చేసినవారికి, ప్రేమను అందించిన వారికి అందరికీ కృతజ్ఞతలు'' అని వెంకట్ ప్రభు తన ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఇళయరాజాను త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. పలు భాషల్లో ఇళయరాజా ఇప్పటికి 900కు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తాజాగా తలైమురైగల్ చిత్రంలో ఆయన అందించిన సంగీతం ప్రేక్షకుల మదిని దోచుకుంది. దళపతి, క్షత్రియపుత్రుడు, దేవరాగం, నాయకుడు.. ఇలా అనేక చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. త్వరలో ఆయన మలేసియాలో లైవ్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. My uncle!! our isaignani!! Is absolutely fine!! Thanks for the love and prayers!! — venkat prabhu (@dirvenkatprabhu) December 23, 2013


