-
ఇప్పటంపై జనసేన మరో కొత్త నాటకం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోవడంతో జనసేన మరో కొత్త నాటకానికి తెర తీసింది. తమ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణకు ఎవరెవరు స్థలాలిచ్చారో అదే రోజు వేదికపైనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు అధికారులు తొలగించిన ఆక్రమణల జాబితాలో వారెవరూ లేకపోవడం గమనార్హం. తొమ్మిది మంది సభకు స్థలాలు ఇచ్చినట్లు నాడు జనసేన ప్రకటించగా అందులో ఒక్కరికి మాత్రమే అధికారులు ఆక్రమణల కింద నోటీసులు జారీ చేశారు. మిగిలిన వారి ఇళ్లు, దుకాణాలు రోడ్డుకు దరిదాపుల్లోనే లేవు. అయితే ఆ ఇంటి యజమాని కూడా ఈ ఏడాది జూన్లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అధికారులు ఆ నివాసాన్ని వదిలేసి మిగిలిన ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇళ్ల కూల్చివేతల ఆరోపణలు బెడిసికొట్టడంతో మార్చిలో నిర్వహించిన జనసేన ప్లీనరీకి 31 మంది భూములిచ్చారని, వారి ఇళ్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. పార్కింగ్కు వాడుకుని.. ఇప్పటంలో ప్రధాన రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులు మార్కింగ్ చేసినప్పుడు మొత్తం 53 ప్రైవేట్ ఆస్తులు, ఒక పంచాయతీ భవనం ఆక్రమణల పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 31 మంది తమ ప్లీనరీకి భూములిచ్చిన సానుభూతిపరులంటూ జనసేన బుకాయిస్తోంది. నిజానికి వీరి భూములు సభ జరిగిన ప్రాంతాన్ని ఆనుకుని ఉండటం, ఆ సమయంలో పొలాల్లో ఎలాంటి పంటలు లేకపోవడంతో ప్లీనరీ వాహనాల పార్కింగ్గా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా వారి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే వాడుకోవడం గమనార్హం. సభకు భూములిచ్చింది 9 మందే.. ఇప్పటంలో జనసేన సభకు భూములిచ్చిన తొమ్మిది మందికి సర్వే నం.167, 167(బి)లో పొలాలున్నాయి. సభ నిర్వహణకు వారు అంగీకరిస్తున్నట్లు స్థానిక తహశీల్దార్కు అర్జీ అందింది. జనసేన నేతలు చెబుతున్న 31 మంది పొలాలు సమీపంలోనే ఉన్నా అనుమతి తీసుకోలేదు. స్థానిక టీడీపీ నాయకుడైన శంకరశెట్టి పిచ్చయ్య గతంలో సర్పంచ్గా పని చేశారు. తర్వాత ఆయన భార్య కూడా సర్పంచ్గా ఉన్నారు. జనసేన సభకు పొలాలు ఇచ్చిన 9 మందిలో ఆయన ఇల్లు మాత్రమే రోడ్డును ఆనుకుని ఉంది. ఆయన ఇంటి ప్రహరీ, మెట్లు ఆక్రమణ పరిధిలోకి రావడంతో అధికారులు నోటీసులిచ్చారు. దీనిపై ఆయన జూన్లో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందడంతో పిచ్చయ్య ఇంటి ప్రహరీని అధికారులు తొలగించలేదు. గతంలోనే విగ్రహ తొలగింపు ప్రక్రియ ఇప్పటంలో ఆర్ అండ్ బీ రోడ్డు విస్తరణ పరిధిలోకి 53 ప్రైవేట్ ఆస్తులు, రెండు దేవాలయాలు, మరో రెండు వైఎస్సార్ విగ్రహాలు వచ్చాయి. వీటిలో ఒక విగ్రహ తొలగింపు ప్రక్రియ గతంలోనే చేపట్టి రెయిలింగ్, దిమ్మె తొలగించారు. మరో ప్రాంతానికి తరలించే లోగా జనసేన రాద్దాంతం సృష్టించింది. ఆ విగ్రహాన్ని సోమవారం తరలించారు. మరో విగ్రహాన్ని రోడ్డు పనులు ప్రారంభించే లోగా తరలించాలని నిర్ణయించారు. జనసేన సభకు భూములిచ్చిన వారి వివరాలు 1. వింటా సాంబిరెడ్డి (సర్వే నం.167(బి): సొంతూరు గన్నవరం సమీపంలోని తేలప్రోలు కాగా తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి వెనుక ఉన్న వజ్ర రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఎండు చేపల వ్యాపారం చేసే ఈయన ఇప్పటంలో ఏడెనిమిదేళ్ల క్రితం పొలం కొనుక్కున్నారు. ఇప్పటంలో ఎలాంటి నివాసం లేదు. 2. లక్కాకుల ఆదినారాయణ: ఈయన నివాసం ఊరు మధ్యలో ఉంది. 3. తిరుమలశెట్టి సామ్రాజ్యం: లక్కాకుల ఆదినారాయణ సోదరి. చీరాలలో ఉంటారు. ఈమెకు ఇప్పటంలో సొంతిల్లు లేదు. 4. గాజుల సాబయ్య: ఈయన ఇల్లు కూడా ఆదినారాయణ ఇంటికి సమీపంలోనే ఊరికి మధ్యన ఉంది. 5. శంకరశెట్టి శ్రీనివాసరావు: (పిచ్చయ్య తమ్ముడు) గుంటూరులో ఉంటారు. వారసత్వంగా వచ్చిన ఇల్లు గ్రామంలో ఉంది. 6. శంకరశెట్టి పిచ్చయ్య: ఈయన ఇల్లు పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉంది. ప్రహరీతో పాటు ఇంటి మెట్లు ఆక్రమణల పరిధిలోకి వచ్చాయి. ఏప్రిల్, మేలో నోటీసులు ఇవ్వడంతో జూన్లో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అధికారులు ఈయన ఆస్తిని ముట్టుకోలేదు. 7. శంకరశెట్టి రాయుడు, 8. శంకరశెట్టి ఉమామహేశ్వరరావు, 9. గాజుల నర్సియ్య: వీరి నివాసాలు గ్రామంలోనే ఉన్నాయి. -
ఎన్డీబీ రీ టెండర్లలో 12 బిడ్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదార్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి గత నెలలో పిలిచిన రీ టెండర్లలో 10 కాంట్రాక్టు సంస్థలు 12 బిడ్లు దాఖలు చేశాయి. తొలిదశలో నాలుగు జిల్లాల్లో పిలిచిన రీ టెండర్ల టెక్నికల్ బిడ్లను ఆర్అండ్బీ అధికారులు సోమవారం తెరిచారు. ఒక్కో జిల్లాలో మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గతంలో మాదిరిగా 13 జిల్లాలకు ఒకేసారి టెండర్లు పిలవకుండా నాలుగు జిల్లాలకు మాత్రమే రీ టెండర్లు పిలిచారు. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టే రహదారుల నిర్మాణానికి సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు మొదట ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. దీనిపై ఆర్అండ్బీ ముఖ్య అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోటీతత్వం పెంచేందుకు ఆ టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో అవి రద్దయిన సంగతి తెలిసిందే. రీ టెండర్లకు తొలివిడతగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాలను ఎంపికచేసిన అధికారులు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీచేశారు. రెండు నిబంధనల్ని సవరించి, నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు సంబంధించి ఈ టెండర్లను పిలిచారు. సోమవారం ఈ టెక్నికల్ బిడ్లు తెరిచిన అధికారులు వాటిని పరిశీలించి అర్హత సాధించిన సంస్థల వివరాలు ప్రకటిస్తారు. అనంతరం రివర్స్ టెండర్లు నిర్వహించనున్నారు. -
నిధులు భారీగా.. పనులు నాసిరకంగా..!
♦ రూ.187 లక్షల నిధులతో రెనివల్ రోడ్డు పనులు ♦ డిప్యూటీ స్పీకర్ సూచనలు పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు ♦ మున్నాళ్ల ముచ్చటగా ‘ముక్టాపూర్-ఎల్గోయి’ వర్క్స్ ♦ కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్న అధికారులు మనూరు : జిల్లాలోనే అతిపెద్ద మండలం మనూరు. అయితే, దశాబ్దాలుగా అభివృద్ధి అంతే మండల ప్రజలకు తెలియని విషయం. ఏ పనులు జరుగుతున్నా.. ఎవరూ చేస్తున్నారో కూడా అర్థం కాదు. ఇక్కడి ప్రజలు, నాయకుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అధికారులు, కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత ఉప-ఎన్నికలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఇక్కడి పరిస్థితులు చూసి ముక్కున వేలేసుకున్నారు. ఉప-ఎన్నికల పుణ్యమా అని ప్రభుత్వం నియోజకవర్గానికి భారీగానే అభివృద్ధి నిధులు కేటాయించింది. అయితే, అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. ఫలితంగా కోట్లలో విడుదలైన నిధులను.. కాంట్రాక్టర్లు నాసిరకం పనులతో స్వాహీ చేవారు. ఇందులో భాగంగానే మనూరు మండలంలోని ముక్టాపూర్ వయా ఎల్గోయి రోడ్డు. కరస్గుత్తి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ముక్టాపూర్, వల్లూర్ తోర్నాల వరకు రోడ్డు రెనివల్ కోసం ప్రభుత్వం రూ.138 లక్షల నిధులు మంజూరుచేసింది. పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని గత ఉప ఎన్నికల కంటే ముందు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ ఆవిష్కరించారు. ఆపై రహదారి వేసి మూడు నెలలు గడవక ముందే వేసిన రోడ్డు బీటీ ధ్వంసమైంది. ఇది గమనించిన ఆర్అండ్బీ అధికారులు పెద్ద మొత్తంలో రోడ్డు వెంట భారీ ప్యాచ్లు వేశారు. కానీ, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు మళ్లీ ధ్వంసమవుతోంది. కనీసం రోడ్డు ఇరువైపులా వేసిన బర్మ్స్ కూడా కనిపించడం లేదు. రహదారి వేయగా మిగిలిన కంకరనే సైడ్బర్మ్కు ఉపయోగించడం కాంట్రాక్టర్ గొప్పతనం. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రోడ్డు పనులు చూసి అవాక్కవుతున్నారు. -
అనుకూలంగా ‘గంట’ కొట్టేస్తున్నారు
ఆర్అండ్బీ అధికారుల నిర్వాకం మంత్రి జిల్లాలోనే నిబంధనలకు తూట్లు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణం ఇక్కడ నిబంధనలు చెల్లవు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగానే అధికారులు నడుచుకోవాలి. స్వయంగా ఆర్అండ్బీ శాఖ మంత్రి సొంత జిల్లా కావడంతో నిబంధనలు కూడా వారికి అనుకూలంగా తిరగ రాసేసుకుంటున్నారు. ప్రశ్నించాల్సిన అధికారులు అమలు చేసేస్తున్నారు. ఆర్అండ్బీ శాఖలో అన్నిచోట్ల నిబంధనలు తుంగలోతొక్కి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో మిగిలిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నా ఫలితం లేకుండా పోతోంది. -సాక్షి ప్రతినిధి, ఒంగోలు నిబంధన ఇలా : ఎక్కడైనా టెండర్లు పిలిస్తే బిడ్ దాఖలు చేసేందుకు కాంట్రాక్టర్కు కనీస గడువు ఉంటుంది. పద్ధతిగా టెండర్లయితే పదిహేను రోజులు, అత్యవసర టెండర్లయితే మూడు నుంచి ఏడు రోజుల వరకూ గడువిస్తారు. అయితే మామూలు మరమ్మతు పనులకు జిల్లా ఆర్అండ్బీ అధికారులు ఇచ్చిన సమయం ఎంతో తెలిస్తే ఓ గంట మాత్రమే. తుంగలో ఇలా: గంటలోనే టెండర్లు వేయాలంటూ కొత్త నిబంధన అధికార పార్టీ రచించింది. లేకపోతే ఆన్లైన్ బిడ్ క్లోజ్ అయిపోతుందని హెచ్చరిస్తోంది. ఇదీ కనిగిరి ఆర్అండ్బీ డివిజన్లో అవలంబిస్తున్న కొత్త ఎత్తుగడ. ముందుగానే ఎమ్మెల్యే మనుషులకు చెప్పి ఫలానా టెండర్కు ఈఎండీ కోసం డీడీలు తీసి సిద్ధం చేయిస్తారు. అకస్మాత్తుగా ఉదయం 10.30 గంటలకు ఆన్లైన్లో టెండర్ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా గంట తర్వాత బిడ్ క్లోజ్ చేస్తారు. ఈలోగానే బిడ్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ముందుగా నిర్ణయించుకున్నవారు మాత్రమే దీనిలో టెండర్లు వేయడానికి వీలవుతుంది. వివరాలు లేకుండానే : లక్ష రూపాయలకు మించిన ఏ పనైనా ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్లు పిలవాల్సి ఉంటుంది. దీని ప్రకారం బుధవారం ఉదయం కనిగిరి డివిజన్కు సంబంధించి రెండు రోడ్లను మరమ్మతులు చేయడానికి రూ.9.41 లక్షలు అంచనా విలువతో టెండర్లు పిలిచారు. దీనికి బిడ్ సెక్యూరిటీగా రూ.9,500 నిర్ణయించారు. కనీసం ఏ రోడ్లు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ మరమ్మతులు చేయాలన్న కనీస వివరాలు కూడా లేకుండానే ఆన్లైన్ టెండర్లు పిలిచారు. మరో టెండర్ కందుకూరు, పామూరు రోడ్డు, దొనకొండ - కనిగిరి - దోర్నాల రోడ్డు మరమ్మతుల కోసం రూ.3.93 లక్షలు పిలిచారు. దీనికి కూడా కేటాయించిన సమయం గంట మాత్రమే. ఇటీవల కాలంలో కనీసం ఎనిమిది టెండర్లను ఇదే పద్ధతిలో పిలిచినట్లు సమాచారం. దీనిపై అధికారుల వివరణ కోరగా తాము నిబంధనల ప్రకారమే చేస్తున్నామని, దీన్ని ఎందుకు వివాదం చేస్తున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం ఉంటే వారికి అనుకూలంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుందని, తమ ఇబ్బందులు అర్థం చేసుకోవాలని ఆ అధికారి చెప్పుకొచ్చారు. -
పంచాయతీ భవనం చూపించి బిల్లు తీసుకున్నారు!
బషీరాబాద్: తవ్విన కొద్ది ‘ఇందిరమ్మ’ ఇళ్ల బాగోతం బయటపడుతోంది. అక్రమార్కులు ఏకంగా బషీరాబాద్ గ్రామ పంచాయతీ భవనాన్ని చూపించి బిల్లును తీసుకున్నారు. బుధవారం సీబీ సీఐడీ డీఎస్పీ ఉపేందర్రెడ్డి, ఎస్సై వేణుమాధవ్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి బషీరాబాద్లో విచారణ జరిపారు. పంచాయతీ భవనంలో రిటైర్ బ్యాంకు ఉద్యోగి కమలమ్మ ఉంటోంది. ఆమె పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినట్లు ఉండటంతో అధికారులు కమలమ్మ ఉండే పంచాయతీ భవనానికి వెళ్లారు. తనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన విషయం తెలియదని ఆమె తెలిపింది. దీంతో అధికారులు నివ్వెరపోయారు. గోసాయి కాలనీలో పాతకాలం నాడు నాపరాతి ముక్కలతో నిర్మించిన ఇంటికి బిల్లు చెల్లించారని అధికారుల విచారణలో తేలింది. శిథిలావస్థకు చేరిన ఇం టికి సైతం అధికారులు బిల్లు చెల్లించారు.పంచాయతీ పరిధిలోని నవాంద్గి గ్రామంలో 4 పాత ఇళ్లకు బిల్లులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఓ ఇంటి అడ్రస్ లభించలేదు.బషీరాబాద్ పంచాయతీ పరిధిలోని సీబీ సీఐడీ అధికారుల ఆధ్వర్యంలో ఆర్అండ్బీ అధికారులు 223 ఇళ్లను పరిశీలించేందుకు వచ్చారు. అందులో 10 ఇళ్ల అడ్రస్ దొరకలేదు. ఇప్పటికీ అడ్రస్ లేని ఇళ్ల సంఖ్య 92కు చేరింది. ఆర్అండ్బీ అధికారుల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ అధికారులు తెలిపారు. ఇళ్ల అడ్రస్ లేకుండా బిల్లులు తీసుకున్న వారి వివరాలు సేకరించేందుకు తమ సిబ్బంది బషీరాబాద్లోనే ఉంటారని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని సీబీ సీడీ డీఎస్పీ ఉపేందర్రెడ్డి వెల్లడించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement