breaking news
Ramalingareddy
-
కరెన్సీ కహానీ
అనంతపురం సెంట్రల్ : కేంద్రం నూతనంగా విడుదల చేసిన రూ.2వేల కరెన్సీ నోట్లను కలర్ జిరాక్స్ తీసుకుని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అతన్ని అనంతపురం నాల్గవ పట్టణ ఎస్ఐ శ్రీరామ్ అదుపులోకి తీసుకున్నారు. రాప్తాడు మండల కేంద్రానికి చెందిన రామలింగారెడ్డి శుక్రవారం రూ. 2వేల నోటును కలర్ జిరాక్స్ తీసి కొన్ని తన వద్ద ఉంచుకున్నాడు. నకిలీ నోట్లు వస్తే ఇలా ఉంటాయంటూ అందరికీ చూపిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ శ్రీరామ్ జాతీయ రహదారిలోని ఎస్వీ బార్లో ఉన్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని జిరాక్స్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటివి తయారు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
అందరి దృష్టి దుబ్బాకపైనే
దుబ్బాక,న్యూస్లైన్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో అందరి దృష్టి దుబ్బాక నియోజకవర్గంపైనే ఉంది. నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యన నువ్వా..నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి చెరుకు ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రవణ్కుమార్ గుప్తా పోటీ చేశారు. వీరితో పాటు బీఎస్పీ నుంచి రాచకట్ల లక్ష్మి, ఎంఎస్పీ నుంచి గడ్డం మోహన్రెడ్డితో పాటు మరో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు చాపకింద నీరులా ప్రచారం నిర్వహించి ఓటు బ్యాంకునుపెంచుకున్నారు. అయితే కాంగ్రెస్తో పాటు టీఆర్ఎస్ ఓట్లను బీజేపీ భారీగానే చీల్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రవణ్కుమార్కు దివంగత నేత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మేలు చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటి వరకు ఆ ఇద్దరే .. నియోజకవర్గంలో (గతంలో దొమ్మటగా ఉన్న సమయంలో నుంచి) చెరుకు ముత్యంరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో టీడీపీ నుంచి చెరుకు ముత్యంరెడ్డి తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆనంతరం 1994లో, 1999లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యట్రిక్ సాధించారు. అదేవిధంగా ముత్యంరెడ్డి (దుబ్బాకలో 2004 సార్వత్రిక, 2008 ఉప ఎన్నిక, 2005లో సిద్దిపేట ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.) ఐదేళ్లలో వరుసగా మూడుసార్లు ఓటమి చెంది రికార్డుకెక్కారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 2004 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తొలిసారిగా పోటీ చేసి ప్రత్యర్థి ముత్యంరెడ్డిపై విజయం సాధించారు. ఆనంతరం 2008 ఉప ఎన్నికలో కూడా చెరుకు ముత్యంరెడ్డిపై రామలింగారెడ్డి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటుతో ముత్యంరెడ్డికి టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ నుంచి ముత్యంరెడ్డికి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో ముత్యంరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డిపై 2640 ఓట్లతో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా ముత్యంరెడ్డి, రామలింగారెడ్డి మధ్యనే తీవ్ర పోటీ ఉంది. 2004 నుంచి 2014 ఎన్నికల వరకు అంటే మూడు సార్వత్రిక, ఒక ఉప ఎన్నిక జరిగింది. ఈ నాలుగు ఎన్నికల్లో కూడా ముత్యంరెడ్డి, రామలింగారెడ్డి మధ్యే పోటీ ఉండడం విశేషం. ఇప్పటి వరకు 2004 సార్వత్రిక ఎన్నికల్లో, 2008 ఎన్నికల్లో ప్రత్యర్థి ముత్యంరెడ్డిపై రామలింగారెడ్డి గెలుపొందారు. 2009లో రామలింగారెడ్డిపై ముత్యంరెడ్డి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు ఆ ఇద్దరిలో ఎవరికి విజయాన్ని అందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఆ రెండు పార్టీల అభ్యర్థుల ఓట్లను చీల్చి తనకంటూ ప్రత్యేకత సాదించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రైవేట్ బస్సుల్లో అత్యవసర ద్వారాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రైవేట్ బస్సుల్లో మూడు నెలల్లోగా విధిగా అత్యవసర ద్వారాలను అమర్చుకోవాలని ఆపరేటర్లను ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. బెల్గాంలో శాసన సభ సమావేశాల చివరి రోజు ఎగువ సభలో బీజేపీ సభ్యుడు రఘునాథ రావు మల్కాపురె అడిగిన ప్రశ్నకు రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి సమాధానమిస్తూ, టూరిస్టు బస్సుల్లో నిర్ణీత గడువులోగా అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయకపోతే రవాణా పర్మిట్లను ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గత నెలలో జరిగిన రెండు ఘోర దుర్ఘటనల్లో 58 మంది మరణించారంటూ, దీనికి వోల్వో బస్సుల నిర్మాణంలోనే ఏదో లోపం ఉందని మల్కాపురెతో పాటు ఇతర సభ్యులు సందేహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలు, వాణిజ్య సరుకులు ప్రధాన కారణాలని మంత్రి చెబుతూ, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని చెప్పారు. ఢిల్లీకి చెందిన నేషనల్ ఆటోమేటివ్ టెస్టింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు దర్యాప్తు బాధ్యతను అప్పగించామని, త్వరలో నివేదిక అందుతుందని తెలిపారు. నెల రోజులుగా రవాణా శాఖ క్రమం తప్పకుండా బస్సుల తనిఖీలను నిర్వహిస్తోందని, ప్రయాణికుల వాహనాల్లో వాణిజ్య సరుకులను భర్తీ చేసినందుకు జరిమానాలు విధించిందని వివరించారు. బస్సు బయలుదేరడానికి ముందు భద్రతా మార్గదర్శకాలు, అత్యవసర ద్వారాల గురించి ప్రయాణికులకు వివరించాల్సిందిగా డ్రైవర్లు, కండక్టర్లకు సూచించినట్లు తెలిపారు. విమానాల్లో మాదిరే ఈ భద్రతా సూచనలు చెప్పే పద్ధతిని పాటించాలని ఆదేశించామన్నారు. ట్రిప్ షీట్లను నిర్వహించాల్సిందిగా ఆపరేటర్లకు సూచించామని, డ్రైవర్ల డ్యూటీ ఎనిమిది గంటలకు మించరాదని, ప్రథమ చికిత్స కిట్, నిప్పునార్పే యంత్రాలు విధిగా బస్సుల్లో ఉండేట్లు చూడాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు.