-
అమరావతికి రైల్వే లైన్ ఎప్పుడో?
సాక్షి, అమరావతి: రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి రైలు మార్గం ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. సర్క్యులర్ సబర్బన్ లైన్గా అమరావతి రైల్వే లైన్ను గతేడాది బడ్జెట్లో ఈ మార్గానికి అనుమతి ఇచ్చి కేంద్రం రూ. 2,680 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రైల్వే బోర్డు నుంచి అనుమతులు రాలేదు. అమరావతి రైల్వే లైన్ కోసం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ఆర్నెల్ల క్రితమే సర్వే చేసింది. 3 మార్గాల్లో ప్రతిపాదిత అలైన్మెంట్ ఖరారు చేసింది. అమరావతికి వెళ్లాలంటే గుంటూరు, విజయవాడ వరకు మాత్రమే రైలు మార్గం ఉంది. అక్కడ నుంచి సచివాలయం, రాజధాని ప్రాంతం అమరావతికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సిందే. అమరావతికి రైల్వే లైన్కు మొత్తం 106 కిలోమీటర్ల ట్రాక్ వేయాలి. అనుమతులు వచ్చి టెండర్లు పిలిచి రైల్వే లైన్ ప్రారంభిస్తే నాలుగేళ్లలో ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ సర్వే విషయంలో ఇంతవరకు రైల్వే బోర్డు నుంచి అనుమతులు రాకపోవడం, జాయింట్ వెంచర్ కంపెనీ కింద ఈ రైల్వే ప్రాజెక్టును చేర్చినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ మార్గం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని రైల్వే వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రతిపాదించిన మూడు రైల్వే లైన్లు నంబూరు–అమరావతి–ఎర్రుపాలెం రైల్వే లైన్ 56.8 కిలోమీటర్లు. డబుల్ లైన్ ట్రాక్ వేయాలంటే రూ. 2,063 కోట్లు అవసరం. ఈ రైల్వే లైన్ నిర్మిస్తే విజయవాడ–గుంటూరు మధ్యలో ఉన్న నంబూరు నుంచి రాజధాని గ్రామాలైన వడ్డమాను, తుళ్లూరు, అమరావతి వరకు ట్రాక్ వేయాలి. అటు విజయవాడ నుంచి కృష్ణా కెనాల్ మీదుగా ఉండవల్లి, వెంకటపాలెం, మందడం, వెలగపూడి, అమరావతి వరకు ట్రాక్ నిర్మించాలి. అమరావతి–పెదకూరపాడు రైల్వే లైన్ నిర్మాణం 24.5 కిలోమీటర్లు ఉంటుంది. సింగిల్ లైన్ ట్రాక్తో వేయాలంటే రూ. 300 కోట్లు అవసరం. సత్తెనపల్లి–నరసరావుపేట మార్గానికి 25 కి.మీ. మేర సింగిల్ లైన్ వేయాలంటే రూ. 310 కోట్లు ఖర్చవుతుంది. భూ సేకరణపై నాన్చివేత వైఖరి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి భూ సేకరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ రైల్వే లైన్ వేయాలంటే ముందుగా భూమిని రైల్వే శాఖకు అప్పగించాలి. కానీ ఇంతవరకు భూ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చివేత వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్వే జోన్ సాధించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి అయినా రైలు మార్గం సాధిస్తుందో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మెదక్ రైలు మార్గం.. సాధించి తీరుతాం
మెదక్: మెదక్కు రైలు మార్గం సాధించి తీరుతామని, ఇది తమకు ప్రతిష్టాత్మకమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా మెదక్ పట్టణానికి వచ్చిన ఆయనకు టీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి, డిప్యూటీ స్పీకర్ కు, మంత్రికి, ఇద్దరు ఎంపీలకు సొంత జిల్లా కావడంతో రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. మెదక్ ప్రజల చిరకాల స్వప్నమైన రైలు మార్గాన్ని సాధించితీరుమన్నారు. మెదక్-అక్కన్నపేట రైల్వే లైను, మనోహరాబాద్-కొత్తపల్లి మార్గాలు పూర్తయ్యేందుకు కేంద్రం నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా చెల్లించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకళ తెస్తామన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటూ, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాను అభివృద్ధి చేసేందుకు సైనికునిలా పనిచేస్తాన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి దేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు, ఎంపీకి వారధిగా పనిచేసి మెదక్ను కడిగిన ముత్యంలా మారుస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యారెడ్డితో పాటు కార్యకర్తలు ఎంపీ ప్రభాకర్రెడ్డిని, దేవేందర్రెడ్డిని ఘనంగా సత్కరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement