breaking news
punyaseela
-
ఈ వీడియో మీ ఇంట్లో చూపిస్తే.. నీ దవడలు వాయించేస్తారు
-
చంద్రబాబు నీ హోం మంత్రి పదవిని తీసేస్తాడని భయమా..?
-
అధికార మదంతో పిచ్చి కూతలు కూస్తే.. పళ్లు రాలగొడతా..!
-
నారా బ్రాహ్మణి మైండ్ గేమ్: బండి పుణ్యశీల
సాక్షి, విజయవాడ: నారా బ్రాహ్మణి ఆదేశాలతో ఐ టీడీపీ పనిచేస్తోందని, బ్రాహ్మణి మహిళ అయ్యి ఉండి సీఎం జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యకర ప్రచారానికి తెరలేపిందని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల మండిపడ్డారు. సోషల్ మీడియాలో సీఎం సభ్యులపై ఐ టీడీపీ పెడుతున్న అసభ్యకర పోస్టింగ్లపై జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు ఆమె ఫిర్యాదు చేశారు. విజయవాడ సీపీ కాంతి రానా టాటాకు ఫిర్యాదు బదిలీ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను పుణ్యశీల కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని, బ్రాహ్మణి మైండ్ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు జైల్లో, లోకేష్ ఢిల్లీలో ఉండగా బ్రాహ్మణి చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తోంది. మామను మించిన కోడలిగా బ్రాహ్మణి తన తండ్రిని దూరం పెట్టింది. చంద్రబాబు జైలుకు వెళ్లాక బాలకృష్ణ ఎక్కడ పార్టీని నడిపిస్తారో అని బ్రాహ్మణి ముందుకు వచ్చింది. సీఎం జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై పోరాడతాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది’’ అని పుణ్యశీల పేర్కొన్నారు. చదవండి: పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్.. బీజేపీ లొంగుతుందా? -
పార్టీని నమ్ముకున్న వారికీ న్యాయం జరిగింది : పుణ్యశీల
-
ఒక్కరోజులో 1,074 మంది రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో గత 24 గంటల్లో 1,074 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. ఇప్పటిదాకా ఒక్కరోజులో కోలుకున్న వారిలో ఇదే అత్యధికం. రికవరీ రేటు ప్రస్తుతం 27.52 శాతానికి పెరిగిందన్నారు. ఇప్పటికే 11,706 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా నిర్ధారణకు టెస్టింగ్ కిట్ల కొరత లేదన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యం పెంచుతున్నామన్నారు. దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో 83 మంది కరోనా కాటుతో ప్రాణాలు విడిచారు. అలాగే కొత్తగా 2,573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం. దీంతో మొత్తం మరణాలు 1,389కు, పాజిటివ్ కేసులు 42,836కు చేరాయి. సరుకు రవాణాలో సమస్యలుండొద్దు్ద దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య సరుకు రవాణా విషయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉత్పన్నతమైతే ట్రక్కు డ్రైవర్లు కంట్రోల్ రూమ్ నంబర్ ‘1930’కు ఫోన్ చేయాలని పేర్కొంది. ఈ కంట్రోల్ రూమ్ రోజంతా పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ సోమవారం చెప్పారు. డ్రైవర్లు ‘1930’కు ఫోన్ చేసి సాయం పొందవచ్చు. -
ఒక్క రోజులో.. 918 కేసులు.. 31 మరణాలు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. శనివారం నుంచి ఆదివారం వరకు.. 24 గంటల్లో దేశంలో కొత్తగా 918 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే 31 మంది కరోనా కాటుతో మృతి చెందారని వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసులు 8,447కు, మొత్తం మరణాలు 273కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆదివారం మీడియాతో చెప్పారు. యాక్టివ్ కరోనా కేసులు 7,367 కాగా, 715 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. గత 24 గంటల్లో 74 మంది కోలుకున్నారని వివరించారు. కేసులు, మరణాల్లో మహారాష్ట్రదే అగ్రస్థానం కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 127 మంది బలయ్యారు. మధ్యప్రదేశ్లో 36 మంది, గుజరాత్లో 22 మంది, ఢిల్లీలో 19, పంజాబ్లో 11 మంది, తమిళనాడులో 10 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1,761 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,069, తమిళనాడులో 969, రాజస్తాన్లో 700, మధ్యప్రదేశ్లో 532, ఉత్తరప్రదేశ్లో 452, కేరళలో 364, గుజరాత్లో 432, కర్ణాటకలో 214, జమ్మూకశ్మీర్లో 207, పంజాబ్లో 151, పశ్చిమబెంగాల్లో 124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అభివృద్ధి దశలో 40కిపైగా వ్యాక్సిన్లు కరోనాను అంతం చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్ తయారీ పరిశోధనలు కొనసాగుతున్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం 40కిపైగా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి 20 వేల రైల్వే కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చనున్నట్లు ఉద్ఘాటించారు. తొలి దశలో ఇప్పటికే 5 వేల కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చినట్లు తెలిపారు. రోజుకు సగటున 584 పాజిటివ్ కేసులు దేశంలో ఇప్పటిదాకా 1,86,906 కరోనా నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలియజేసింది. వీటిలో 7,953 నమూనాలు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. ఐదు రోజులుగా రోజుకు సగటున 15,747 నమూనాలను పరీక్షిస్తున్నామని, అందులో సగటున 584 నమూనాలు కరోనా పాజిటివ్గా తేలుతున్నాయని స్పష్టం చేసింది. ఆ డాక్టర్ల సేవలను వాడుకోండి కరోనా వైరస్పై పోరాటంలో చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ) డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల సేవలను సైతం ఉపయోగించుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ప్రజల నుంచి నమూనాలను సేకరించడానికి వీరిని వాడుకోవాలంది. హాట్స్పాట్లలో ఇళ్ల వద్దకే సరుకులు కోవిడ్–19 హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇళ్ల వద్దకే నిత్యావసరాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య, స్థానికంగానూ అన్ని రకాలైన సరుకు రవాణా వాహనాలను ఎటువంటి ఆటంకం లేకుండా అనుమతించాలని రాష్ట్రాలను తమ శాఖ కోరినట్లు హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ ఆదివారం మీడియాకు తెలిపారు. ‘హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లోని ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావాల్సిన అవసరం లేకుండా అత్యవసర వస్తువులను వారి ఇళ్ల వద్దకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకు వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నాయి’ అని వివరించారు. సైబర్ నేరాలపై తమ శాఖ అందుబాటు లోకి తెచ్చిన ‘సైబర్దోస్ట్’ అనే ట్విట్టర్ హ్యాండిల్కు ఫిర్యాదు చేయాలన్నారు. కీలక రంగాలకు కొన్ని మినహాయింపులు! కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న దేశవ్యాప్త లాక్డౌన్ను మరో రెండు వారాలైనా పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. కరోనా తీవ్రత అంతగా లేని ప్రాంతాల్లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కార్యకలాపాలు పున:ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో టెక్స్టైల్స్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో ఉత్పత్తికి షరతులతో అనుమతివ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. కీలక రంగాలకు ఆంక్షల నుంచి కొన్ని మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. జాతీయ రహదారుల నిర్మాణ పనులను పున:ప్రారంభించాలని యోచిస్తున్నా మని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పట్టణాలు, నగరాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను ఈ పనుల్లో ఉపయోగించుకుంటామన్నారు. -
'ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించండి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్షకు ఆటంకాలు కల్పిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ విజయవాడలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మహాత్ముడికి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మాట్లాడే వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేయాలని జరుగుతున్న ఆందోళనలపై తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.