breaking news
pshyco hulchal
-
బ్యాంకులో సైకో వీరంగం
సాక్షి, నిడమనూరు: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం ఆంధ్రాబ్యాంకులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బ్యాంకులోకి వచ్చిన అతను సిబ్బందిని తిట్టి.. దాడి చేశాడు. సైకో దాడిలో పలువురు గాయపడ్డారు. అంతటితో ఆగకుండా మేనేజర్ చాంబర్ అద్దాలు పగులగొట్టాడు. ఇతను మండలంలోని మెగ్యా తండాకు చెందిన కేతావత్ కృష్ణ అని తెలిసింది. -
సైకో వీరంగం :15 మందిపై దాడి
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ రింగు రోడ్డులో మంగళవారం సైకో వీరంగం సృష్టించాడు. స్థానికంగా చిరువ్యాపారం చేసుకుంటున్నవారిపై, మహిళలు, విద్యార్థినిలపై దాడి చేసి బండబూతులు తిట్టాడు. దీంతో నానా హంగామా చేస్తున్న సైకోను స్థానికులు కర్రలతో చితకబాది పోలీసులకు అప్పగించారు. స్టేషన్కు వెళ్లిన తర్వాత మహిళా పోలీసుల పట్ల కూడా అసభ్యపదజాలంతో దూషించడంతో పోలీసులు సైకోను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మొత్తం 15 మందిపై సైకో దాడి చేసినట్లు స్తానికులు తెలిపారు.