breaking news
prinipal
-
మందలించినందుకు ప్రిన్సిపాల్నే చంపేశాడు
యమునానగర్: స్నేహితుల ముందు మందలించిందన్న కోపంతో 12వ తరగతి విద్యార్థి మహిళా ప్రిన్సిపాల్ను తుపాకీతో కాల్చి హత్య చేశాడు. హరియాణాలోని యమునానగర్లో స్వామి వివేకానంద పాఠశాలలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఆ విద్యార్థి అదే పాఠశాలలో కామర్స్ కోర్సు చదువుతున్నట్లు తెలిసింది. తండ్రి తుపాకీని దొంగిలించి ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని హత్యా నేరం కింద కేసు నమోదుచేశారు. యమునానగర్ ఎస్పీ రాజేశ్ కాలియా వెల్లడించిన వివరాల ప్రకారం...ప్రిన్సిపాల్తో కొద్దిసేపు మాట్లాడి బయటకు వచ్చిన తరువాత విద్యార్థి మళ్లీ లోనికి వెళ్లి ఆమెపై కాల్పులు జరిపాడు. ఛాతీ, పొట్ట, భుజంపై నాలుగు బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్ రీతు చాబ్రా(47)ను వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆమెను కాల్చిన తరువాత విద్యార్థి పారిపోవడానికి ప్రయత్నించినా అక్కడే ఉన్న కొందరు తల్లిదండ్రులు, స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయడంతో స్నేహితుల ముందే ప్రిన్సిపాల్ తనను గతంలో రెండుసార్లు మందలించడం బాధించిందని అతడు పోలీసులకు చెప్పాడు. దాన్ని మనసులో ఉంచుకుని ఆమెపై కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో అల్మారా బద్దలుకొట్టి తన తండ్రి తుపాకీని దొంగిలించి ఆమెపై కాల్పులు జరిపాడు. విచారణలో విద్యార్థి తన నేరాన్ని అంగీకరించాడు. -
ప్రినిపాల్ సస్పెన్షన్
కామారెడ్డి: మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ బషీరొద్దీన్ హైమద్పై సస్పెన్షన్ వేటు వేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సెక్రెటరీ శేషుకుమారి ఆదేశాలు జారీ చేశారు. అద్దె భవనంలో కొనసాగుతున్న పాఠశాలను సొంత భవనంలోకి మార్చాలని పలుమార్లు సూచించినప్పటికీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విద్యార్థులను చితకబాదాడని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పనితీరుపై చేసిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి వేటు వేశారు. వనపర్తి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ జానీమియాకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.