breaking news
patroling
-
దక్షిణా చైనా సముద్రంపై చైనా బాంబర్ పెట్రోలింగ్
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా సైన్యం ఆదివారం తొలిసారిగా బాంబర్ పెట్రోలింగ్ నిర్వహించింది. ఇందుకోసం ఏకంగా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఫైటర్ జెట్లు సముద్రంపై గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ఫిలిప్పైన్స్కు హెచ్చరికగానే బాంబర్ పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఫిలిప్పైన్స్ నావికాదళం ఇటీవల అమెరికా, జపాన్ సైన్యంతో కలిసి దక్షిణ చైనా సముద్రంలో ఉమ్మడిగా సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ పరిణామం చైనాకు రుచించడం లేదు. దక్షిణా చైనా సముద్రం మొత్తం తమదేనని చైనా ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై ఫిలిప్పైన్స్, వి యత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. చైనా ఆధిపత్య ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
జయహో జకీయుద్దీన్..! సైకిల్పై ట్రాఫిక్ పోలీసు విధులు
అతనో ట్రాఫిక్ కానిస్టేబుల్.. ప్రభుత్వం కేటాయించిన బ్యాటరీ సైకిల్పై విధులు నిర్వహిస్తూ సికింద్రాబాద్ ప్రజల మన్ననలు పొందుతున్నాడు.. సంధులు, గల్లీల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయనే సికింద్రాబాద్ మహంకాళి ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఎండీ జకీయుద్దీన్. 2014 బ్యాచ్కు చెందిన జకీయుద్దీన్ ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు..స్టేషన్ పరిధిలోని మోండా మార్కెట్, పాట్ మార్కెట్, ఓల్డ్గాస్ మండీ తదితర ప్రాంతాల్లో సైకిల్పై విధులు నిర్వహిస్తున్నాడు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వం బ్యాటరీ సైకిళ్లను అందజేసింది. అయితే చాలా స్టేషన్లలో వీటిని మూలనపడేశారు. విధుల కోసం డిపార్టుమెంట్ ప్రతి నెలా ఇచ్చే 25 లీటర్ల పెట్రోల్తో బైక్స్ వినియోగిస్తుంటారు.. అయితే ఇంధనం ఆదా చేయడంతో పాటు వాహన కాలుష్యాన్ని తగ్గించడానికే తాను బ్యాటరీ సైకిల్ వినియోగిస్తున్నానని జకీయుద్దీన్ చెబుతున్నాడు. తాను క్రీడాకారుడిని కాబట్టి సైకిల్ వినియోగం ఆరోగ్యానికీ ఉపయుక్తమవుతుందని, పర్యావరణానికీ మేలు కలుగుతుందని సాక్షితో పంచుకున్నాడు. (చదవండి: ఈ బామ్మ రూటే సెపరేటు..! వందో పుట్టినరోజుని అందరిలా కాకుండా..) -
Lockdown: డ్రోన్తో బందోబస్తు పర్యవేక్షణ
డ్రోన్ కెమెరాతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ అమలులో భాగంగా పోలీసులు ఇలా ప్రత్యేకంగా ఏర్పాటుచేసి సైరన్ కలిగిన డ్రోన్తో గల్లీల్లో సైతం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మీ కోసం పోలీసులు ఉన్నారు అని భరోసా కల్పిసూ్తనే, లాక్డౌన్ నిబంధనలు పాటించేలా చూస్తున్నారు. - సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట -
హైదరాబాద్లో పోకిరీలకు ఇక ముచ్చెమటలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పోకిరీలకు బ్యాడ్ టైమ్ మొదలైపోయింది. ఇంతకాలం పోలీస్ పెట్రోలింగ్ మగ పోలీసులే నిర్వహించటం చూస్తున్నాం. ఇందుకోసం ఇప్పుడు మహిళా పోలీసులను కూడా రంగంలోకి దించేసింది తెలంగాణ పోలీస్ శాఖ. మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్, అత్యాచార యత్నం వంటి ఘటనల్ని నివారించేందుకు ఈ మహిళా పోలీస్ పెట్రోలింగ్ను వినియోగించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో తొలిసారిగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పెట్రో కారులోనే ఇక మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తారు. వారికి సహాయకంగా కొందరు సిబ్బంది(మగ) కూడా ఉంటారు. రోడ్లపై ఆకతాయిలు, తాగుబోతుల వీరంగం... ఇలా ఏది కనిపించినా రంగంలోకి దిగి తాట తీస్తారు. దేశంలో మహిళా పోలీసు స్టేషన్లు ఉన్నప్పటికీ చిన్న చిన్న కేసుల్లో ఆ స్టేషన్ల గడప తొక్కేవారు అరుదు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడో, బస్టాప్ లో నిల్చున్నప్పుడో, స్కూలుకు వెళుతున్నప్పుడో.. పోకిరీలు పిచ్చి చేష్టలు చేస్తే... పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి అమ్మాయిలు కాస్త తటపటాయిస్తుంటారు. అదే మహిళా పోలీసులు అయితే గనుక నిరభ్యరంతంగా వెళ్లి చెప్పేయొచ్చు. వాళ్లు తమ ఎదుట ఉన్నారన్న భరోసా మహిళల్లో మరికాస్త ధైర్యాన్ని ఇస్తుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచదేశాలన్నీ మహిళా పోలీసు వ్యవవస్థను పటిష్టపరుస్తున్నాయి. ఇప్పటికే ఇటలీ, చైనా వంటి దేశాలు ఈ దిశగా అడుగులువేసి మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నూరిపోశాయి. ఇక తొలిసారి ‘షీ టీమ్స్’ను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజా నిర్ణయంతో మరో అడుగు ఇప్పుడు ముందుకు వేసినట్లయ్యింది. కాగా, రాజస్థాన్ దేశంలోనే తొలి మహిళా పోలీసు పెట్రోలింగ్ బృందాన్ని నియమించగా.. ఢిల్లీ కూడా ఆ జాబితాలో నిలిచింది. -
రాజస్థాన్లో ప్రత్యేక బలగాల మోహరింపు
జైపూర్: గణతంత్ర వేడుకల దృష్ట్యా రాజస్థాన్లో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలు మోహరించారు. ఇటీవల కాలంలో సరిహద్దు గుండా శత్రువుల చొరబాట్లు, సున్నిత ప్రాంతాల్లో అల్లర్లు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ చర్యలు తీసుకున్నారు. మరోపక్క, భద్రతను కట్టుదిట్టం చేసి ఇప్పటికే పలు హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు ప్రారంభించారు. ఈ విషయాన్ని రాష్ట్ర అడిషనల్ డీజీ ఎన్ఆర్కే రెడ్డి పేర్కొన్నారు. సున్నితమైన అదనపు దృష్టిని సారించినట్లు ఆయన వెల్లడించారు. -
బీట్ తప్పితే.. బీప్..బీప్
- రాత్రి గస్తీ మరింత కట్టుదిట్టం - బీట్ సిబ్బందికి జీపీఎస్ ట్యాబ్ల అందజేత - కేటాయించిన స్థలానికి వెళ్లకపోతే కంట్రోల్రూమ్కు సమాచారం - బీప్..బీప్ మంటూ శబ్దం - నేర నియంత్రణకు ఈ - గస్తీ - పి–క్యాట్స్ అప్లికేషన్ ద్వారా పర్యవేక్షణ - కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు పూర్తి - వారంలోగా జిల్లా అంతటా అమలు జిల్లాలో పోలీస్స్టేషన్లు – 65 పోలీస్ సర్కిళ్లతో కలసి ఉన్నవి – 18 పోలీస్ సబ్ డివిజన్లు – 6 సిబ్బంది (సివిల్) – 3,082 ఏఆర్ సిబ్బంది – 894 హోంగార్డులు – 890 పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో ముందడుగు వేస్తోంది. ‘ఈ–గస్తీ’. పౌరులకు రక్షణ కల్పించేందుకు రాత్రిపూట నిర్వహిస్తున్న పోలీసు గస్తీ వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటి వరకు సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న గస్తీ, పెట్రోలింగ్ విధానాలకు సాంకేతికను జోడించి నేర నియంత్రణ చేపట్టాలని పోలీసు శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా కర్నూలు జిల్లాలో పి–క్యాట్స్ అప్లికేషన్ ద్వారా ఈ–గస్తీ (ఎలక్ట్రానిక్ గస్తీ) వ్యవస్థ అమలు చేయనున్నారు. ఈ–గస్తీ విధానం అందుబాటులోకి రానుండటంతో జిల్లా పోలీసులు మరింత అప్రమత్తంగా పనిచేసే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలో ఉన్న కంట్రోల్ రూమ్కు పోలీసు సిబ్బందికి కేటాయించే పరికరాలను అనుసంధానం చేయనుండటంతో ప్రతి కదలిక ఇక్కడ నమోదవుతోంది. కర్నూలు: జిల్లా వ్యాప్తంగా 491 ట్యాబ్లు సబ్ డివిజన్లకు అందజేశారు. రాత్రివేళల్లో కాపలా(బీట్స్) తిరిగే కానిస్టేబుళ్లకు వాటిని అందజేస్తారు. పెట్రోలింగ్ వాహనాల్లో కూడా జీపీఎస్ ప్యాకింగ్ యంత్రాలు అమలు చేస్తారు. ఈ యంత్రాల్లో ఆ బీట్ ప్రాంతం పరిసర ప్రాంతాల్లోని నేరగాళ్ల వివరాలతో పాటు గత రెండు నెలల వ్యవధిలో ఆ ప్రాంతంలో జరిగిన నేరాలు, వాటి సరళి తదితర అంశాలను పొందుపరుస్తారు. ఆ పరికరాలను జిల్లా కేంద్రంలోని కంట్రోల్రూమ్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. ఈ విధానం ఆధారంగా సంబంధిత పెట్రోలింగ్ వాహనాలు, గస్తీ సిబ్బంది కదలికలు ప్రతి 20 సెకండ్లకొకసారి కంట్రోల్ రూమ్లో నమోదవుతాయి. దీనివల్ల ఏదైనా ప్రాంతంలో నేరం, చోరీ జరిగితే సమీపంలోని వారందరినీ ఒకేసారి అప్రమత్తం చేసి సంబంధిత సంఘటన స్థలానికి చేరుకునేలా చేస్తారు. గస్తీ సిబ్బందికి కేటాయించిన ప్రాంతాల్లో ఉన్నారా లేదా అనే విషయం కూడా ఇంటర్నెట్లో తెలుసుకునే వీలు కలుగుతుంది. గస్తీ కానిస్టేబుల్ తనకు కేటాయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలోకి వెళ్తే కంట్రోల్ రూమ్కు బీప్... బీప్... అంటూ శబ్దం వస్తుంది. ఈ పరికరంతోనే ఫొటోలు తీసుకునే వెసులుబాటు ఉంది. బీట్ కాసే సమయంలో అనుమానితులు, ఇతరత్రా నేర నియంత్రణకు ఉపయోగపడే చిత్రాలు ఉంటే వాటిని ఫొటో తీసి నేరుగా కంట్రోల్ రూమ్కు పంపించవచ్చు. అత్యవసర సమాచారాన్ని క్లుప్తంగా ట్యాబ్ల ద్వారా కంట్రోల్రూమ్కు చేరవేయవచ్చు. ఇప్పటివరకు ఇలా... రాత్రిపూట జిల్లా వ్యాప్తంగా తిరిగే పోలీసులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో తిరిగి సంబంధిత వివరాలను బీట్ పుస్తకంలో ఆయా ప్రాంతాల్లో అనుమానితులు, రౌడీలు, కేడీలు, దొంగలు, నిందితుల వివరాలు ఉంటాయి. బీట్ కానిస్టేబుల్ ఆయా ప్రాంతాల్లో రాత్రివేళ కాపలాకు వెళ్లినప్పుడు సంబంధిత పుస్తకంలో నమోదైనవారి ఇళ్లకు వెళ్లి వారు ఉన్నారో లేదో పరిశీలించడం, ఉంటే ప్రెజెంట్ లేకుంటే ఆబ్సెంట్ మార్కు చేస్తారు. ఇది భవిష్యత్తులో పోలీసుల పరిశోధనలో ఎంతో కీలకం కానుంది. వాస్తవానికి ఎక్కడైనా దొంగతనం జరిగితే సంబంధిత తేదీన తన ప్రాంతంలో ఉన్న దొంగలు, అనుమానితుల జాబితాల్లో వ్యక్తి ఇంట్లో ఉన్నారో లేదో పరిశీలిస్తారు. ఆబ్సెంట్ మార్కు ఉంటే వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. ఇదంతా చేతి రాతతోనే ఇప్పటి వరకు జరుగుతోంది. ఈ–గస్తీ అమలుతో పాత పద్ధతికి ఇక స్వస్తి పలకనున్నారు. జవాబుదారీతనం పెరుగుతుంది : ఆకే రవికృష్ణ, ఎస్పీ కర్నూలు నగరంలో వారం రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనానికి ఈ–గస్తీ విధానం అమలు కానుంది. మరో వారం రోజుల్లో జిల్లా అంతటా అమలులోకి వస్తుంది. రాత్రివేళల్లో గస్తీ తిరుగుతున్న సిబ్బంది విధి నిర్వహణ ఎలా పనిచేస్తున్నారో గమనించి వారిని అప్రమత్తం చేయడానికి వీలుంటుంది. గస్తీ సమయంలో ఎక్కడైనా అనుమానితులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే తక్షణమే కంట్రోల్ రూమ్కు తెలియజేయడానికి వీలు ఉంటుంది. ప్రతి రోజు గస్తీ అనంతరం సంబంధిత సిబ్బంది ఇంటర్నెట్ ద్వారా మదర్ సర్వర్కు అనుసంధానం చేస్తారు. దీన్ని బట్టి ఆ రోజు బీట్ కానిస్టేబుల్ ఏ సమయంలో ఎక్కడ విధులు నిర్వహించారో సమగ్ర వివరాలు నమోదు అవుతాయి. దీనిని పరిశీలించడం ద్వారా గస్తీ సిబ్బంది పనితీరు పరిశీలించడానికి, అత్యవసర పరిస్థితి ఎదురైతే సమర్థంగా ఎదుర్కొని నేరం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.


