breaking news
Pandit Ravi Shankar
-
జగమంతా రాగమయం..
‘అంతా రామమయం– జగమంతా రామమయం’ అన్నాడు భక్త రామదాసు. తూర్పు పడమరల ఎల్లలు చెరిగిపోతున్న నేటి సంగీత ప్రపంచాన్ని గమనిస్తుంటే ‘అంతా రాగమయం– జగమంతా రాగమయం’ అని తన్మయంగా పాడుకోవచ్చు సంగీతాభిమానులు. ఇటు కర్ణాటక అటు హిందుస్తానీ సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై కూర్చుని జుగల్బందీ కచేరీలతో శ్రోతలను అలరించిన సందర్భాలు నిన్నటితరం సంగీతాభిమానులకు తెలిసిన ముచ్చటే! ఇప్పటికీ తరచుగా జుగల్బందీ కచేరీలు దేశ విదేశాల్లో విరివిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో దేశంలోని భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు మాత్రమే కాదు, విదేశీ విద్వాంసులతో కలసి చేసే ఫ్యూజన్ కచేరీలు కూడా పెరుగుతున్నాయి. ఫ్యూజన్ ఆల్బమ్స్కు అన్ని ప్రాంతాల్లోనూ శ్రోతల ఆదరణ పెరుగుతోంది. ఫ్యూజన్ ప్రయోగాలు సంగీతం విశ్వజనీనమని చాటుతున్నాయి. జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం... మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది. ప్రణవనాదమైన ఓంకారమే అనాదినాదమని పురాణాలు చెబుతాయి. భారతీయ సంప్రదాయ సంగీతానికి మూలాలు సామవేదంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్ది మధ్యకాలంలో భారతీయ సంగీతం శాస్త్రీయతను సంతరించుకుంది. ఆ కాలంలోనే సంస్కృతంలో సంగీతానికి సంబంధించిన పలు గ్రంథాలు వెలువడ్డాయి. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది తర్వాత ఉత్తర భారత, దక్షిణ భారత ప్రాంతాల్లో సంగీత శైలీభేదాలు ప్రస్ఫుటంగా ఏర్పడుతూ వచ్చాయి. ఉత్తరాది సంగీతం హిందుస్తానీ సంగీతంగా, దక్షిణాది సంగీతం కర్ణాటక సంగీతంగా అవతరించాయి. బ్రిటిష్కాలంలో పాశ్చాత్య సంగీతం ఇక్కడి ప్రజలకు చేరువైంది. పలు పాశ్చాత్య వాద్య పరికరాలు మన సంగీతకారులను ఆకట్టుకున్నాయి. క్లారినెట్, వయోలిన్, గిటార్, మాండోలిన్, పియానో వంటి పాశ్చాత్య వాద్య పరికరాలను భారతీయ సంప్రదాయ సంగీతకారులు అక్కున చేర్చుకున్నారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలీ సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడిన తర్వాత చాలాకాలం పాటు సంగీతకారులు ఎవరికి వారు గిరిగీసుకుని, తమ తమ శైలీ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇరవయ్యో శతాబ్దిలో పాశ్చాత్య సంగీతం కూడా పరిచయమయ్యాక సంగీతం విశ్వజనీనమైనదనే ఎరుక కలిగి, వేర్వేరు సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై జుగల్బందీలు నిర్వహించే స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించుకున్నారు. ఇటీవలి కాలంలోనైతే పాశ్చాత్య విద్వాంసులతోనూ కలసి ఫ్యూజన్ కచేరీలతో మన సంగీతకారులు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. నిజానికి ఫ్యూజన్ ప్రయోగాలు నిన్న మొన్నటివి కావు. హిందుస్తానీ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అలీ అక్బర్ఖాన్ 1955లోనే పాశ్చాత్య సంగీతకారులతో కలసి అమెరికాలో తొలి ఫ్యూజన్ కచేరీ చేశారు. ఆ తర్వాత 1960లలో కొందరు భారతీయ విద్వాంసులు రాక్ ఎన్ రోల్ బృందాలతో కలసి ఫ్యూజన్ కచేరీలు చేశారు. సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది. ముత్తుస్వామి దీక్షితార్ శంకరాభరణ రాగంలో రచించిన ‘నోట్టు స్వరాలు’ పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి. ముత్తుస్వామి దీక్షితార్ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి. ఫ్యూజన్ ప్రయోగాలు హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్ రాక్బ్యాండ్ ‘బీటిల్స్’ బృందానికి చెందిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్, అమెరికన్ వయోలినిస్ట్ యెహుది మెనుహిన్ వంటి వారితో కలసి పండిట్ రవిశంకర్ 1960 దశకంలోనే ఫ్యూజన్ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్ హారిసన్ స్వయంగా పండిట్ రవిశంకర్ వద్ద సితార్ నేర్చుకుని, ‘బీటిల్స్’ పాట ‘నార్వేజియన్ వుడ్’లో సితార్ స్వరాలను పలికించాడు. పండిట్ రవిశంకర్ కృషి ఫలితంగా ప్రాక్ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది. తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్లు కలసి ‘కలోనియల్ కజిన్స్’ పేరుతో ఫ్యూజన్ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్ బ్యాండ్స్ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్.సుబ్రమణ్యం, ఎల్.శంకర్, మాండోలిన్ శ్రీనివాస్, రాజేష్ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్ షాహిద్ పర్వేజ్, సితారా దేవి, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం. కూత ఘనం పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్.రెహమాన్, అద్నాన్ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్ రికార్డు సాధించిన తృప్త్రాజ్ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. నాలుగేళ్ల వయసులోనే శాస్త్రీయ సంగీతాభ్యాసం మొదలుపెట్టిన లిడియన్ నాదస్వరం తన పదమూడేళ్ల వయసులోనే ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన శ్రేయా జయదీప్ శాస్త్రీయ సంగీతం అభ్యసించి, రియాలిటీ షోలలోను, సినిమాల్లోనూ రాణిస్తోంది. ఆమె ఇప్పటికే రెండువందలకు పైగా ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది. కేరళలో పుట్టి చెన్నైలో స్థిరపడిన కులదీప్ పాయ్ ఎందరో బాలలను సంగీతంలో తీర్చిదిద్దుతున్నారు. ఆయన వద్ద శిష్యరికం పొందుతున్న వారిలో రాహుల్ వెల్లాల్, సూర్యగాయత్రి, సూర్యనారాయణన్, రఘురామ్ మణికంఠన్, భవ్య గణపతి తదితరులు విశేషంగా రాణిస్తున్నారు. ‘యూట్యూబ్’ను మాధ్యమంగా చేసుకున్న తొలి శాస్త్రీయ సంగీతకారుడైన కులదీప్ పాయ్ తన శిష్యులను కూడా ఇదే మాధ్యమం ద్వారా శ్రోతలకు చేరువ చేస్తున్నారు. పాయ్ శిష్యుల్లో కొందరు అంతర్జాతీయ వేదికలపైనా మెరుపులు మెరిపిస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో సంగీతంలో రాణిస్తున్న బాల కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా, ఏదో ఒకే సంప్రదాయానికి పరిమితమైపోకుండా, వేర్వేరు సంప్రదాయ శైలులనూ ఆకళింపు చేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలతో సంగీతానికి గల విశ్వజనీనతను చాటుతున్నారు. మన సంగీతంలో పాశ్చాత్యవాద్యాలు మన సంగీత కచేరీల్లోకి పాశ్చాత్యవాద్య పరికరాలు బ్రిటిష్ హయాంలోనే ప్రవేశించాయి. కర్ణాటక సంగీత కచేరీలకు క్లారినెట్ను తొలిసారిగా మహాదేవ నట్టువనార్ పరిచయం చేశారు. తర్వాతి కాలంలో ఎ.కె.సి. నటరాజన్ వంటివారు క్లారినెట్ను కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువ చేశారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మహాదేవ నట్టువనార్ తంజావూరు మరాఠా రాజుల ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవారు. అప్పట్లోనే ఆయన పాశ్చాత్య పరికరమైన క్లారినెట్పై ఆయన అద్భుతమైన స్వరవిన్యాసాలు చేసి, పండిత పామరులను అలరించారు. తర్వాతి కాలంలో క్లారినెట్ కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువైంది. తంజావూరు ఆస్థానానికి చెందిన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్ సోదరుడు బాలస్వామి దీక్షితార్ పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో కర్ణాటక సంగీతానికి వయోలిన్ను పరిచయం చేశారు. ద్వారం వెంకటస్వామినాయుడు వయోలిన్ను కర్ణాటక సంగీతంలో అవిభాజ్య వాద్యం స్థాయికి చేర్చారు. ద్వారం వెంకటస్వామినాయుడు ప్రభావంతో కర్ణాటక సంగీత కచేరీలలో వయోలిన్ ఒక తప్పనిసరి పక్కవాద్యం స్థాయికి చేరుకుంది. అంతేకాదు, వయోలిన్తో సోలో కచేరీలిచ్చే ఉద్దండులు కర్ణాటక సంగీతంలో చాలామందే ఉన్నారు. కదిరి గోపాలనాథ్ తొలిసారిగా శాక్సోఫోన్ను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. ఇరవయ్యో శతాబ్దంలో మరికొన్ని పాశ్చాత్య వాద్యపరికరాలు కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలకు పరిచయమయ్యాయి. పాశ్చాత్య వాద్యపరికరమైన శాక్సోఫోన్కు కొద్దిపాటి మార్పులు చేసి, దానిని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని గమకాలన్నీ పలికేలా తీర్చిదిద్దారు. మాండోలిన్ను శ్రీనివాస్ బాలుడిగా ఉన్నప్పుడే కర్ణాటక సంగీతానికి పరిచయం చేసి, ‘మాండోలిన్ శ్రీనివాస్’గా ప్రఖ్యాతి పొందారు. సుకుమార్ ప్రసాద్ తొలిసారిగా గిటార్ను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. అనిల్ శ్రీనివాసన్ పియానోను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. పాశ్చాత్య వాద్యపరికరమైన హార్మోనియం పంతొమ్మిదో శతాబ్దం నాటికి మన దేశంలో బాగా జనాదరణ పొందింది. పరిమాణంలో కొన్ని మార్పులకు లోనై, హిందుస్తానీ గాత్ర కచేరీలకు పక్కవాద్యంగా చక్కగా ఇమిడిపోయింది. పాశ్చాత్య వాద్యపరికాలు మన సంప్రదాయ సంగీతంలోని నిశితమైన గమకాలను, సంగతులను పలికించలేవనే విమర్శలు ఉన్నా, వాటిని తమవిగా చేసుకుని కచేరీలు చేసిన కళాకారులు ఆ విమర్శలన్నింటినీ వమ్ము చేశారు. ఆధునిక కాలంలో మన భారతీయ సంగీత విద్వాంసులు పలువురు ప్రపంచ స్థాయిలో మన్ననలు అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై కచేరీలు చేసి, శ్రోతలను ఉర్రూతలూపారు. అంతర్జాతీయ వేదికలపై మెరిసిన వారిలో అటు హిందుస్తానీ, ఇటు కర్ణాటక సంగీత విద్వాంసులు ఉన్నారు. శైలీ సంప్రదాయాలు వేర్వేరు అయినా, సంగీతం అంతా ఒక్కటేననే భావనతో భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు జుగల్బందీ కచేరీలతో భారతీయ సంగీత రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. భీమ్సేన్ జోషి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, పండిట్ జస్రాజ్, ఎల్.సుబ్రమణ్యం తదితరుల జుగల్బందీలు భారతీయ సంగీతానికే వన్నె తెచ్చేవిగా నిలుస్తాయి. హిందుస్తానీ సంగీతకారుల్లో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా, సంతూర్ విద్వాంసుడు శివకుమార్ శర్మ, తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆధునిక కర్ణాటక సంగీతకారుల్లో చెంబై వైద్యనాథ భాగవతార్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మహారాజపురం సంతానం, శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మధురై మణి అయ్యర్, డాక్టర్ శ్రీపాద పినాకపాణి, జి.ఎన్.బాలసుబ్రమణ్యం, టి.ఎన్.శేషగోపాలన్ తదితర గాయకులు చెరగని ముద్ర వేశారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎల్.వసంతకుమారి కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులుగా గుర్తింపు పొందారు. ద్వారంవారి తర్వాత వయొలినిస్టుల్లో లాల్గుడి జయరామన్, కన్నకుడి వైద్యనాథన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, అన్నవరపు రామస్వామి, ఎల్.వైద్యనాథన్, ఎల్.సుబ్రమణ్యం, ఎల్. శంకర్, అవసరాల కన్యాకుమారి, వైణికుల్లో ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, దొరైస్వామి అయ్యంగార్, ఇ.గాయత్రి, జయంతి కుమరేశ్, వేణుగానంలో టి.ఆర్.మహాలింగం, ఎన్.రమణి, ప్రపంచం సీతారాం, నాదస్వరంలో షేక్ చినమౌలానా, టి.ఎన్.రాజరత్నం పిళ్లె తదితరులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించిన వారిలో ప్రముఖులు. ఇప్పటి తరంలో టి.ఎం.కృష్ణ, సిక్కిల్ గురుచరణ్, పాల్ఘాట్ రామ్ప్రసాద్, అక్కారయ్ శుభలక్ష్మి, అమృతా మురళి, విద్యా కళ్యాణరామన్ తదితరులు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రాణిస్తున్నారు. మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది. ప్రణవనాదమైన ఓంకారమే అనాదినాదమని పురాణాలు చెబుతాయి. భారతీయ సంప్రదాయ సంగీతానికి మూలాలు సామవేదంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్ది మధ్యకాలంలో భారతీయ సంగీతం శాస్త్రీయతను సంతరించుకుంది. ఆ కాలంలోనే సంస్కృతంలో సంగీతానికి సంబంధించిన పలు గ్రంథాలు వెలువడ్డాయి. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది తర్వాత ఉత్తర భారత, దక్షిణ భారత ప్రాంతాల్లో సంగీత శైలీభేదాలు ప్రస్ఫుటంగా ఏర్పడుతూ వచ్చాయి. ఉత్తరాది సంగీతం హిందుస్తానీ సంగీతంగా, దక్షిణాది సంగీతం కర్ణాటక సంగీతంగా అవతరించాయి. బ్రిటిష్కాలంలో పాశ్చాత్య సంగీతం ఇక్కడి ప్రజలకు చేరువైంది. పలు పాశ్చాత్య వాద్య పరికరాలు మన సంగీతకారులను ఆకట్టుకున్నాయి. క్లారినెట్, వయోలిన్, గిటార్, మాండోలిన్, పియానో వంటి పాశ్చాత్య వాద్య పరికరాలను భారతీయ సంప్రదాయ సంగీతకారులు అక్కున చేర్చుకున్నారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలీ సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడిన తర్వాత చాలాకాలం పాటు సంగీతకారులు ఎవరికి వారు గిరిగీసుకుని, తమ తమ శైలీ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇరవయ్యో శతాబ్దిలో పాశ్చాత్య సంగీతం కూడా పరిచయమయ్యాక సంగీతం విశ్వజనీనమైనదనే ఎరుక కలిగి, వేర్వేరు సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై జుగల్బందీలు నిర్వహించే స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించుకున్నారు. ఇటీవలి కాలంలోనైతే పాశ్చాత్య విద్వాంసులతోనూ కలసి ఫ్యూజన్ కచేరీలతో మన సంగీతకారులు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. నిజానికి ఫ్యూజన్ ప్రయోగాలు నిన్న మొన్నటివి కావు. హిందుస్తానీ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అలీ అక్బర్ఖాన్ 1955లోనే పాశ్చాత్య సంగీతకారులతో కలసి అమెరికాలో తొలి ఫ్యూజన్ కచేరీ చేశారు. ఆ తర్వాత 1960లలో కొందరు భారతీయ విద్వాంసులు రాక్ ఎన్ రోల్ బృందాలతో కలసి ఫ్యూజన్ కచేరీలు చేశారు. సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది. ముత్తుస్వామి దీక్షితార్ శంకరాభరణ రాగంలో రచించిన ‘నోట్టు స్వరాలు’ పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి. ముత్తుస్వామి దీక్షితార్ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి. ఫ్యూజన్ ప్రయోగాలు హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్ రాక్బ్యాండ్ ‘బీటిల్స్’ బృందానికి చెందిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్, అమెరికన్ వయోలినిస్ట్ యెహుది మెనుహిన్ వంటి వారితో కలసి పండిట్ రవిశంకర్ 1960 దశకంలోనే ఫ్యూజన్ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్ హారిసన్ స్వయంగా పండిట్ రవిశంకర్ వద్ద సితార్ నేర్చుకుని, ‘బీటిల్స్’ పాట ‘నార్వేజియన్ వుడ్’లో సితార్ స్వరాలను పలికించాడు. పండిట్ రవిశంకర్ కృషి ఫలితంగా ప్రాక్ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది. తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్లు కలసి ‘కలోనియల్ కజిన్స్’ పేరుతో ఫ్యూజన్ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్ బ్యాండ్స్ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్.సుబ్రమణ్యం, ఎల్.శంకర్, మాండోలిన్ శ్రీనివాస్, రాజేష్ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్ షాహిద్ పర్వేజ్, సితారా దేవి, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం. కూత ఘనం పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్.రెహమాన్, అద్నాన్ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్ రికార్డు సాధించిన తృప్త్రాజ్ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. నాలుగేళ్ల వయసులోనే శాస్త్రీయ సంగీతాభ్యాసం మొదలుపెట్టిన లిడియన్ నాదస్వరం తన పదమూడేళ్ల వయసులోనే ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన శ్రేయా జయదీప్ శాస్త్రీయ సంగీతం అభ్యసించి, రియాలిటీ షోలలోను, సినిమాల్లోనూ రాణిస్తోంది. ఆమె ఇప్పటికే రెండువందలకు పైగా ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది. కేరళలో పుట్టి చెన్నైలో స్థిరపడిన కులదీప్ పాయ్ ఎందరో బాలలను సంగీతంలో తీర్చిదిద్దుతున్నారు. ఆయన వద్ద శిష్యరికం పొందుతున్న వారిలో రాహుల్ వెల్లాల్, సూర్యగాయత్రి, సూర్యనారాయణన్, రఘురామ్ మణికంఠన్, భవ్య గణపతి తదితరులు విశేషంగా రాణిస్తున్నారు. ‘యూట్యూబ్’ను మాధ్యమంగా చేసుకున్న తొలి శాస్త్రీయ సంగీతకారుడైన కులదీప్ పాయ్ తన శిష్యులను కూడా ఇదే మాధ్యమం ద్వారా శ్రోతలకు చేరువ చేస్తున్నారు. పాయ్ శిష్యుల్లో కొందరు అంతర్జాతీయ వేదికలపైనా మెరుపులు మెరిపిస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో సంగీతంలో రాణిస్తున్న బాల కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా, ఏదో ఒకే సంప్రదాయానికి పరిమితమైపోకుండా, వేర్వేరు సంప్రదాయ శైలులనూ ఆకళింపు చేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలతో సంగీతానికి గల విశ్వజనీనతను చాటుతున్నారు. -
వైరల్: ఆధ్యాత్మిక గురువు రవిశంకర్తో రజనీకాంత్.. ఫోటో వైరల్
Rajinikanth Meets Ravishankar: ఆధ్యాత్మిక గురువు రవిశంకర్తో సూపర్స్టార్ రజనీకాంత్ తన ఇద్దరు కుమార్తెలతో కలసి భేటీ అయ్యారు. రజనీకి ఆధ్యాత్మిక చింతన అధికం. ఆయన ప్రతి చిత్రం షూటింగ్ అనంతరం హిమాలయాలకు వెళ్లి కొన్ని రోజులు గడపడం ఆనవాయితీ. ఇటీవల శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న అన్నాత్తై చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అటుంచితే నటుడు రజనీకాంత్ తన ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య ధనుష్, సౌందర్య రజనీకాంత్ కలిసి ఆధ్యాత్మిక గురువుతో భేటీ అవడం చర్చనీయాంశమైంది. రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ ఆదివారం తన ట్విట్టర్లో ఈ మేరకు చిత్రాలు పోస్ట్ చేశారు. ఇప్పుడవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. Renowned actor @rajinikanth, @soundaryaarajni, @ash_r_dhanush met Gurudev @SriSri Ravi Shankar. https://t.co/Kuxpcesdc4 — Office Of Gurudev (@OfficeOfGurudev) August 29, 2021 చదవండి : విజయకాంత్కు అనార్యోగం? చికిత్స కోసం అమెరికాకు.. Karthikeya 2: హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.. -
పండిట్ రవిశంకర్ (1920–2020) శత వసంతం
కరోనా రాకుండా ఉండివుంటే ప్రపంచానికిది రాగాల రుతువు. స్ప్రింగ్ సీజన్. వసంతం. పువ్వులదొక రాగం. గువ్వలదొక రాగం. పచ్చని ప్రకృతి మువ్వలదొక రాగం. ఈ రాగాలన్నిటితో పండిట్ రవిశంకర్ ‘స్మృతి సితార’ కూడా శృతి కలిపి ఉండేది. ఈరోజు పండిట్ జీ నూరవ జయంతి. ఆయన్ని కృతిస్తూ ఆయన భార్య, కూతురు శత సితార్ మహోత్సవాన్ని ప్లాన్ చేశారు. అయితే లాక్డౌన్తో అదిప్పుడు ఆగిపోయింది! సంగీతానికి ఒక దేశపు పౌరసత్వం అంటూ ఉంటుందా? అలాగే రవిశంకర్, ఆయన సంతానం! ప్రస్తుతం రవిశంకర్ భార్య సుకన్య, కూతురు అనౌష్క లండన్లో ఉన్నారు. ఉండటం కాదు, కరోరా కారణంగా అక్కడి తమ సొంత ఇంట్లో వారు చిక్కుకుపోయారు. వాళ్లతో పాటు రవిశంకర్కు ఎంతో ఇష్టమైన ఆయన సితార్ కూడా! కోల్కతాలో వాద్యపరికరాల తయారీకి ప్రసిద్ధులైన కన్హాయీలాల్.. రవిశంకర్ కోసం ప్రత్యేకంగా మలిచి ఇచ్చిన సితార్ అది. దానిపై ఇష్టంగా వేళ్లు కదుపుతుండేవారు రవిశంకర్. కరోపా వ్యాప్తికి ముందు లండన్లో జరిగిన సంగీత ప్రదర్శనకు ఆ సితార్తోనే వెళ్లారు అనౌష్క. ఇప్పుడు ఇంటి నుంచి కాలు కదపలేని స్థితిలో తండ్రి శతజయంతి స్మృతి గీతికలను ఉన్నచోటు నుంచే వేళ్లతో ఆలపించి, విశ్వాన్ని సమ్మోహనపరచడానికి ఆ సితారే ఆమెకొక దారి చూపించింది. ఇంటి నుంచే..! ఘనమైన సంగీతకారునికి ఘనమైన నివాళి ఇవ్వాలని తల్లీకూతుళ్లిద్దరూ కలిసి కూర్చొని ఇన్ని నెలలుగా వేసుకున్న ప్రణాళికలన్నీ పుస్తకంలో నోట్ చేసుకున్న గమకాల్లా మిగిలి, ఆయన జయంతి రోజు ఇంట్లో చేయబోతున్న చిన్న పూజా కార్యక్రమమే ఇప్పుడు పెద్ద మహోత్సవంగా మిగలబోతోంది. పూజ తర్వాత హిందూస్థానీ సంగీతంలో అనౌష్క పలికించే స్వరాలు ఆన్లైన్లో మాత్రమే ఆమె తండ్రి అభిమానులను ఓలలాడించబోతున్నాయి. అనౌష్క కూడా తండ్రిలాగే సితార్ విద్వాసురాలు. సుకన్య ఆ తండ్రీకూతుళ్ల సంగీతానికి ఒక పిపాసి మాత్రమే. రవిశంకర్ తొలిచూపుతో సుకన్యకు ఏర్పడిన ఆత్మబంధం.. ఆ చూపులోంచి ప్రవహించి హృదయాన్ని సోకిన సంగీతం వల్లనే. భర్త శత జయంతి రోజున భర్తతో తనకున్న అనుబంధాన్ని పంచుకోడానికి ఆమె దగ్గర జలధి తరంగాల్లా ఎన్నటికీ తరగని అంతరంగ భావావేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటికి మాత్రం ఆన్లైన్ వేదిక కాకూడదని సుకన్య భావిస్తున్నారు. అంటే ఒక పెద్ద పుస్తకాన్నే ఆమె త్వరలో రాయడం ప్రారంభించబోతున్నారని. పెళ్లిక్కడే జరిగింది హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్లోనే సుకన్య, రవిశంకర్ల పెళ్లి జరిగింది. 1989లో. అప్పటికి ఆయన వయసు 69. ఆమె వయసు 35. అనౌష్క వయసు 8 ఏళ్లు. డెబ్బైల నుంచీ రవిశంకర్తో సుకన్యకు పరిచయం. ఆ పరిచయం ప్రేమ అయి, ఆ ప్రేమ.. బంధంగా మారి, అనౌష్క పుట్టిన ఎనిమిదేళ్లకు.. పెళ్లితో వాళ్లిద్దరూ ఆలూమగలు, అనురాగాల సరిగమలు అయ్యారు. అన్నపూర్ణాదేవి (మొదటి భార్య), కమలాశాస్త్రి (సన్నిహిత), సూజోన్స్ (సహజీవన సహచరి).. ఒక్కొక్కరు ఒక్కో సంగీతిక అయితే.. సుకన్య ఒక స్వరసమ్మేళనం రవిశంకర్ జీవితానికి. 1920 ఏప్రిల్ 7న బెనారస్లోని పుట్టారు పండిట్ జీ. బెంగాలీ కుటుంబం. హిందూస్తానీ సితార్ విద్వాంసుడిగా గుర్తింపు పొందారు. ఆలిండియా రేడియోలో మ్యూజిక్ డైరెక్టర్గా పని చేశారు. విదేశాల్లో కచేరీలు ఇచ్చారు. ఈ బ్రాహ్మలబ్బాయి మొదటి భార్య ఒక ముస్లిం! పేరు రోషనారా ఖాన్. అన్నపూర్ణాదేవిగా ఆయనే ఆమె పేరు మార్చుకున్నారు. ఆయన సంగీతం ఆయనకు పేరుతో పాటు అనేక మంది సంగీతప్రియులను, ప్రియురాళ్లనూ ఇచ్చింది. మనదేశం ‘భారతరత్న’ ఇచ్చింది. 2012లో కాలిఫోర్నియాలో ఉండగా 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు పండిట్ జీ. నేటికీ జీవించి ఉండుంటే ఈ ఏడాదికి నూరేళ్ల వయసులో ఉండేవారు. సుకన్య, ఇద్దరు మనవళ్లు జుబిన్, మోహన్, అనౌష్క అంతా కలిసి లండన్లో ఉంటున్నప్పటికీ తరచు లండన్–ఢిల్లీ–కోల్కతా మధ్య ప్రయాణాలు సాగిస్తుంటారు. అనౌష్క భర్త జో రైట్ ఆమె జీవితంలో ఒక తెగిపోయిన తీగ. బ్రిటిష్ డైరెక్టర్ ఆయన. రెండేళ్ల క్రితమే విడిపోయారు. రవిశంకర్, స్యూ జోన్స్ల కుమార్తె నోరా జోన్స్ యు.ఎస్.లో ఉంటున్నారు. ‘‘పండిట్ రవిశంకర్ జీవించి ఉంటే ఈ కరోనా పరిస్థితులకు ఎలా స్పందించి ఉండేవారు’’ అనే ప్రశ్నకు సుకన్య చెప్పిన సమాధానంలో కూడా ఆమె హృదయంలో ఆయనకెంత ఘనమైన స్థానం ఉందో వెల్లడించే విధంగా ఉంది. ‘‘ప్రతిదీ జీవితంలో భాగమే. ఇదీ ఎన్నాళ్లో ఉండదు. సాగిపోతుంది అనేవారు నవ్వేస్తూ’’ అన్నారు సుకన్య ఒక ఇంటర్వ్యూలో. రవిశంకర్ భార్య సుకన్య (66), కూతురు అనౌష్క (38) -
‘రామ మందిరం’ మధ్యవర్తిగా రవిశంకర్!
న్యూఢిల్లీ: వివాదాస్పద రామ మందిర నిర్మాణంపై చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించాలని నిర్మోహి అఖాదా, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ధ్రువీకరిస్తూ, తాను కూడా ఇదే విషయమై అక్టోబర్ 20–15 మధ్య రవిశంకర్తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్లో చేపట్టనుంది. చర్చలకు మధ్యవర్తిగా రవిశంకర్నే ఎంచుకోవడం ఎందుకని ప్రశ్నించగా...ఆయన జీవన విధానం, అన్ని మతాల పట్ల ఆయన అనుసరిస్తున్న ప్రేమపూరిత వైఖరే కారణమని స్వామి బదులిచ్చారు. -
ప్రకృతి వ్యవసాయ విప్లవం!
ప్రకృతికి అనుగుణమైన జీవన కళా నైపుణ్యాలను అందించడంలో ప్రసిద్ధిపొందిన బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజుల శిఖరాగ్ర సభకు ఇటీవల వేదికైంది. తొలి జన్యుమార్పిడి ఆహార పంట జీఎం ఆవాలకు ఆమోద ముద్ర వేయడానికి భారత ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా జరిగిన ఈ సభ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆహార అభద్రతకు, పౌష్టికాహార లోపానికి, జన్యుమార్పిడి విత్తనాలకు, అన్నదాతల ఆత్మహత్యలకు తావు లేని సమాజం కోసం ప్రకృతి వ్యవసాయ విప్లవానికి త్రికరణశుద్ధితో నీర్వోసి నార్వెట్టాలని ‘ప్రకృతి వ్యవసాయంపై తొలి శిఖరాగ్రసభ’ పాలకులకు పిలుపునిచ్చింది. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన ప్రకృతి వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, నిపుణులు, మార్కెటింగ్ నిపుణులు ఏకతాటిపైకి రావడం విశేషం. ఆ విశేషాలు కొన్ని ‘సాగుబడి’ పాఠకుల కోసం.. దేశంలో అనేక రాష్ట్రాల్లో స్వల్ప ఖర్చుతో, సొంత వనరులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య తామర తంపరగా విస్తరిస్తున్న కీలక దశలో ‘ప్రకృతి వ్యవసాయంపై తొలి శిఖరాగ్ర సభ’ జరగడం విశేషం. ప్రముఖులను ఆహ్వానించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవసాయ విభాగం ‘శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు (ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి.)’ ఈ శిఖరాగ్ర సభను నిర్వహించింది. ‘అన్నపూర్ణ’ నేలతల్లి ఆరోగ్యంతోపాటు మనుషుల ఆరోగ్యాన్నీ దుంప నాశనం చేస్తున్న రసాయనిక వ్యవసాయాన్ని వీలైనంత తొందరగా వదిలించుకొని.. దేశం యావత్తూ ప్రకృతి వ్యవసాయం వైపు దీక్షగా కదలాలని ‘ప్రకృతి వ్యవసాయంపై తొలి శిఖరాగ్రసభ’లో వక్తలు పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రకృతి వ్యవసాయదారులు, పాలకులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు శిఖరాగ్రసభలో పాల్గొన్నారు. ఉక్రేనియా పార్లమెంటరీ ప్రతినిధివర్గంతోపాటు ఏడు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. మనోబలంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 39 మంది రైతులు, రైతు శాస్త్రవేత్తలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆథ్యాత్మిక గురువు రవిశంకర్ సమక్షంలో ‘కృషి రత్న’ పురస్కారాలతో సత్కరించడం విశేషం. కర్నూల్ జిల్లాకు చెందిన యువ ప్రకృతి వ్యవసాయదారుడు మహమ్మద్ బాషా, ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్తగా కేరళ ప్రభుత్వం ప్రకటించిన 20 ఏళ్ల యువ రైతు సూరజ్ సభికుల దృష్టిని అమితంగా ఆకర్షించారు. నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా.. తనకు 4 ఎకరాల భూమి, ఏడు ఆవులున్నాయని, నాలుగేళ్లుగాప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని కర్నూలు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు మహమ్మద్ బాషా చెప్పారు. తమ ఇంట్లో అందరూ కలసి వ్యవసాయ పనులు చేసుకుంటామని, ఆవులు తెచ్చిన తర్వాత ఇంట్లో ఎవరూ ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాలేదన్నారు. ఒకటిన్నర ఎకరాల్లో 57 టన్నుల పచ్చి మిర్చి దిగుబడి పొందినట్టు చెప్పారు. రెండు రోజుల సభలో సుప్రసిద్ధ శాస్త్రవేత్త డా. వందనా శివ, ఇండోనేసియా ప్రతినిధి ఇబు హెలియంతి హిల్మన్ కీలకోపన్యాసాలు చేశారు. వసంతరావ్ నాయక్ మరట్వాడా కృషి విద్యాపీ (పర్బని) వైస్ ఛాన్సలర్ డా. బి. వెంకటేశ్వర్లు, తెలుగు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఛత్తీస్గఢ్ మంత్రి మహేశ్ గగ్డ, సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ జనరల్ డా. జీవీ రామాంజనేయులు, ప్రకృతి సేద్యంపై ఆం.ప్ర. ప్రభుత్వానికి సలహాదారు టి. విజయకుమార్, హర్యానాకు చెందిన ఐఏఎస్ అధికారిణి రజని సిక్రి సిబల్, రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి, ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయదారుడు దీపక్ సచ్దే, ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. ట్రస్టీ డా. బి. ప్రభాకర్ రావు, సేంద్రియ సేద్యంపై జాతీయ టాస్క్ఫోర్స్ సభ్యుడు కపిల్ షా తదితరులు వేర్వేరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, ఖేతీ విరాసిత్ మంచ్ సారధి ఉమేంద్ర దత్ తదితరులు పాల్గొన్నారు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ప్రజలందరికీ ప్రకృతి ఆహారం అందాలి! ప్రకృతి వ్యవసాయం ఓ విప్లవం. ఇది ప్రపంచం అంతా విస్తరించాలి. ప్రకృతి వ్యవసాయంతోపాటు వాన నీటి సంరక్షణ, దేశీ గోజాతులు, దేశీ విత్తనాల పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, పాలకులు గుర్తెరగాలి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని సమృద్ధిగా పండించడానికి ఉపకరించే సమగ్ర పద్ధతులు మన రైతుల వద్ద ఉన్నాయి. శిఖరాగ్రసభ తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తాం. ఆహారాన్ని పండించే రైతు, ఆహారాన్ని వండి వడ్డించే మహిళలు కూడా సంతోషంగా ఉండాలంటే అందరం కలసి ప్రకృతి సేద్యాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి. రైతులకు రుషి కృషి పద్ధతులపై అనేక రాష్ట్రాల్లో విస్తృతంగా శిక్షణ ఇస్తున్నాం. మా వాలంటీర్ల కృషితో 12 నదులు పునరుజ్జీవం పొందాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పండించే ఆహారంలో సత్తువ గానీ, ఖనిజాలు గానీ తక్కువేనని అందరూ గ్రహించాలి. అమృతాహారాన్ని ప్రజలకు అందించాలన్న సంకల్పంతో దళారుల్లేని మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నాం. దేశంలో ప్రకృతి వ్యవసాయం పూర్తిస్థాయిలో విస్తరిస్తే రసాయన రహిత ఆహారోత్పత్తుల ధర కూడా తగ్గుతుంది. – పండిట్ రవిశంకర్,ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, బెంగళూరు జన్యుమార్పిడి ఆహారంతో ముప్పు! రసాయనాలతో పండించిన ఆహారంలో పోషకాల లోపం తీవ్రంగా ఉన్నందున సమాజం రోగగ్రస్తమవుతున్నదన్న సత్యాన్ని పాశ్చాత్య దేశాలు గుర్తించాయి. జన్యుమార్పిడి విత్తనాలతో పండించే ఆహారంతో పర్యావరణానికి, ప్రజారోగ్యానికి, పంటల జీవవైవిధ్యానికి ముప్పు పొంచి ఉంది. సుసంపన్నమైన సంప్రదాయ వ్యవసాయ సంస్కృతిని, పంటల జీవవైవిధ్య సేద్య రీతులను పరిరక్షించుకుంటూ పురోగమించడమే ఉత్తమం. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, ఆహార భద్రతకు ఇదే మూలం. పండిట్ రవిశంకర్జీ ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయోద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా. – డా. వందనా శివ, సుప్రసిద్ధ శాస్త్రవేత్త, నవధాన్య, డెహ్రాడూన్ మన సంకల్పాన్ని మొక్కలూ గ్రహిస్తాయి! నేలతల్లి అన్నపూర్ణ. పోషకాంశాలన్నీ భూమిలో ఉన్నాయి. వాటిని పంటలకు అందుబాటులోకి తేవడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే చాలు. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. ‘అమృత్మిట్టి’ని పొలంలోనే తయారు చేసి వాడుకోవచ్చు. బయటి నుంచి సేంద్రియ ఎరువు తెచ్చి వేయాల్సిన అవసరం లేదు. రైతుకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. వాస్తవ సమాచారం ఇవ్వాలి. మనందరం కలిసి, గొప్ప చైతన్యంతో చేయాల్సిందల్లా ప్రకృతి వ్యవసాయం ప్రారంభించడం ఒక్కటే. మన ఉక్కు సంకల్పాన్ని మొక్కలూ గ్రహిస్తాయి. ప్రొ. ధబోల్కర్ ‘నేచుఎకో’ సేద్య పద్ధతి పాటిస్తున్న పొలంలో ‘హెక్టారుకు, ప్రతి నెలా రూ. లక్ష చొప్పున ఆదాయం’ వస్తున్నది. మా ప్రాంతంలో 8 వేల హెక్టార్లలో ఈ సాగు జరుగుతోంది. ఆసక్తి ఉన్న వాళ్లు వచ్చి చూడొచ్చు. – దీపక్ సచ్దే (093295 70960), మల్పని ట్రస్టు, బజ్వాడ, మధ్యప్రదేశ్ www.amrutkrushi.com జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకించడం మన బాధ్యత! ప్రకృతి వ్యవసాయం విరాజిల్లాలంటే జన్యుమార్పిడి పంటలను అందరం కలసి అడ్డుకోవాలి. కలుపు మందులను తట్టుకునేలా రూపొందించిన జన్యుమార్పిడి (జీఎం) ఆవాలు పంట అవసరమే మనకు లేదు. దీన్ని అనుమతిస్తే.. మరో 72 జన్యుమార్పిడి ఆహార పంటలకు గేట్లు బార్లా తెరిచినట్టవుతుంది. జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకించడం ప్రజాక్షేమం కోరే మనందరి బాధ్యత. కలుపుమందులను తట్టుకునే జీఎం పంటల వల్ల మనుషులకు కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని రెండేళ్ల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. – కపిల్ షా, సభ్యులు, రసాయన రహిత వ్యవసాయంపై జాతీయ టాస్క్ఫోర్స్ దేశీ విత్తనాలపై పరిశోధనలు! ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి బాగవుతుంది. సూక్ష్మజీవులను భూమికి అందిస్తే చాలు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. రైతులు బజారుకెళ్లి తమ ఉత్పత్తులు అమ్ముకోవాలే గానీ, ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం ఉండకూడదు. లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, జర్మనీలోని మాక్స్ పాంక్ ఇన్స్టిట్యూట్తో కలసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మన దేశంలో దేశీ విత్తనాలపై పరిశోధనలు చేపట్టబోతున్నది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దేశీ విత్తనాల రక్షణకు చేపట్టాల్సిన చట్టాలు, విధానపరమైన చర్యలపై ప్రభుత్వానికి సూచనలివ్వడానికి ఈ పరిశోధనలు ఉపకరిస్తాయి. – డా. బి. ప్రభాకరరావు, ట్రస్టీ,ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి., బెంగళూరు ఆహార, పౌష్టికాహార భద్రత ప్రకృతి సేద్యంతోనే సాధ్యం పౌష్టికాహార భద్రత, ఆహార భద్రత ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యం. వాతావరణ మార్పులను, కరువును, కేన్సర్ వంటి మహమ్మారి వ్యాధులను దీటుగా ఎదుర్కోవడానికి ప్రకృతిlసేద్యం ఒక్కటే మార్గం. – పి. రామకృష్ణారెడ్డి, చైర్మన్, శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ టెక్నాలజీ ట్రస్టు -
పుష్కర హారతి బాగుంది: రవిశంకర్
-
పుష్కర హారతి బాగుంది: పండిట్ రవిశంకర్
విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇస్తున్న పుష్కర హారతి బాగుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్ తెలిపారు. అలాగే పుష్కర ఏర్పాట్లు కూడా బాగున్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం విజయవాడలోని పున్నమిఘాట్లో రవిశంకర్ పుష్కరస్నానమాచరించారు. అనంతరం విలేకర్లతో ఆయన మాట్టాడుతూ.. గోదావరి పుష్కరాలతో పోలిస్తే క్రౌడ్ మేనేజ్మెంట్... చక్కగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. గోదావరి పుష్కరాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని పండిట్ రవిశంకర్ గుర్తు చేశారు.