breaking news
Paidipalem reservoir
-
చేసిందొకరు..చెప్పుకొనేదొకరు
పులివెందుల ప్రాంత రైతులను కరువు బారి నుంచి తప్పించడానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన పైడిపాలెం ప్రాజెక్టు పనులు 95శాతం అప్పట్లోనే పూర్తయ్యాయి. కేవలం 5శాతం పనులు చేపట్టి, రూ.23కోట్లు మాత్రమే ఖర్చుచేసి టీడీపీ నాయకులు అంతా తామే చేశామని ఆర్భాటం చేస్తుండటం చూసి రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. గండికోట ఎత్తిపోతల పథకం నుంచి 10కి.మీ పైపులైన్ ద్వారా పైడిపాలెం ప్రాజెక్టులోకి నీరు చేరనుంది. ఈ పైపులైన్ పనులు కూడా వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయి. అలాగే రిజర్వాయర్ నుంచి అంతే నీటితో సూక్ష్మనీటి సేద్యం ద్వారా సింహాద్రిపురం మండలంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందనుంది. వైఎస్సార్ ఉంటే కృష్ణాజలాలు ఎప్పుడో పరుగులు తీసి ఉండేవని ప్రతిఒక్కరి మాట. పులివెందుల/సింహాద్రిపురం : ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసి పనులను ప్రారంభించి దాదాపు పూర్తిచేసిందొకరు..చివర్లో కొద్దిపాటి పనులు చేసి అంతా తామే నిర్మించామని ఆర్భాటం చేసేదొకరు. వాస్తవ విరుద్ధంగా, ఆర్భాటామే లక్ష్యంగా ఉన్న ఈ వ్యవహారం పైడిపాలెం ప్రాజెక్టు విషయంలో నడుస్తోంది. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో సాధ్యంకాదంటూ ఎత్తిపొడుపు మాటలు మాట్లాడిన వారే ఇప్పుడు అంతా తామే చేశాం, నీరిచ్చామంటూ చెప్పుకోవడం విడ్డూరమని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 11న ఎట్టకేలకు కృష్ణాజలాలు గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా పైడిపాలెంకు చేరాయి. పైడిపాలెం వద్ద 6 టీఎంసీలు నిల్వ ఉండేలా 2005 మే 23న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. రెండు కొండల మధ్య అనుసంధానంగా 42.5 మీటర్ల ఎత్తు, 43.68కి.మీ పొడవుతో రాతికట్ట నిర్మాణం చేపట్టారు. రూ.712 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. కొండాపురం, గడ్డంవారిపల్లె, చెర్లోపల్లె గ్రామాల మధ్య పంప్ హౌస్లు నిర్మించారు. వైఎస్సార్ హయాంలో రూ.690కోట్ల వ్యయంతో పైడిపాలెం ప్రాజెక్టు పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. ఆయన మరణం తర్వాత నత్తనడకన సాగాయి. రోశయ్య హయాంలో ప్రాజెక్టు పనులు కొంచెం కూడా ముందుకు సాగలేదు. మిగిలిన 5 శాతం మాత్రమే కిరణ్, టీడీపీ ప్రభుత్వాలు చేపట్టాయి. పైడిపాలెం ప్రాజెక్టుకు నీరు ఇలా.. : పీబీసీకి నీరందించడమే లక్ష్యం. ప్రాజెక్టు కింద 47,500ఎకరాల ఆయకట్టుగా స్థిరీకరించారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, వేంపల్లె, పులివెందుల మండలాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ మరణానంతరం పనులు పూర్తి కావడానికి తొమ్మిదేళ్లు గడిచాయి. వరద నీటితోపాటు శ్రీశైలం మిగులు జలాల ఆధారంగా గండికోట రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా పైడిపాలెం రిజర్వాయర్కు నీటిని పంపింగ్ చేసి అటు నుంచి ప్రత్యేక కాలువల ద్వారా పీబీసీకి విడుదల చేయాల్సి ఉంది. శ్రీశైలం మిగులు జలాలను కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడుకు, అటు నుంచి ఓర్వకల్లు ఆ తర్వాత అవుకు తదనంతరం జిల్లాలోని గండికోటకు, అక్కడనుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా పైడిపాలెం ప్రాజెక్టుకు అందించేలా ప్రణాళిక రూపకల్పన చేశారు. మండలంలోని హిమకుంట్ల చెరువు నుంచి 3 టీఎంసీల నీటిని పీబీసీకి తరలించడం పైడిపాలెం ప్రాజెక్టు లక్ష్యం. ప్రసుతం గం డికోట ఎత్తిపోతల పథకాల నుంచి ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు కొన్ని గ్రామాలకు తాగునీటిని కూడా అందిస్తున్నారు. వైఎస్సార్ చలువతోనే కృష్ణాజలాలు : పైడిపాలెం ప్రాజెక్టుకు కృష్ణాజలాలు రావడం వెనుక వైఎస్సార్ కృషి ఎంతో ఉందని ఈ ప్రాంత ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ ముందుచూపుతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోతే ప్రస్తుతం కృష్ణాజలాలు ఈ ప్రాంతానికి చేరి ఉండేవి కావనేది జగమెరగని సత్యం. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 6టీఎంసీలు కాగా.. లీకేజీ కారణంగా నిపుణుల ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రాజెక్టుకు నీరు నిలుపుదల చేశారు. టీడీపీ ఆర్భాట ప్రచారం: దివంగత వైఎస్సార్ హయాంలో 95శాతం పనులు పూర్తి చేసుకున్న ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో కేవలం రూ.23కోట్లు మాత్రమే ఖర్చుచేసి ప్రాజెక్టుకు తామే నీరు తీసుకొస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టుకు తెలుగుదేశం నాయకులు నీటిని విడుదల చేసి కేవలం లష్కర్ల పాత్రను పోషిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ పుణ్యమే.. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణాజలాలు పైడిపాలెంకు చేరుకుని ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందుతోందంటే అది వైఎస్సార్ పుణ్యమే. కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతు బాంధవుడు ముందుచూపుతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. – ఎన్.రాజేశ్వరరెడ్డి(రైతు), సింహాద్రిపురం జీవితాంతం రుణపడి ఉంటాం పైడిపాలెం ప్రాజెక్టును ఈ ప్రాంతంలో నిర్మించిన వైఎస్సార్కు ఈ ప్రాంత రైతులు జీవితాంతం రుణపడి ఉంటాం. కృష్ణాజలాలు తీసుకరావడమంటే మాటల్లో సాధ్యం కాదని, టీడీపీ నాయకులు అప్పట్లో ఎత్తిపొడిచారు. కానీ చివరకు వైఎస్సార్ కృషితో ఈ ప్రాంతానికి కృష్ణాజలాలు వచ్చి చేరాయి. – ఎం.రమాదేవి, మహిళా రైతు -
చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే : వైఎస్ జగన్
-
చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే : వైఎస్ జగన్
వైఎస్ఆర్ జిల్లా : పైడిపాలెం రిజర్వాయర్ను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పరిశీలించారు. పైడిపాలెం రిజర్వాయర్లో 80 శాతం పనులు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేస్తే, అంతా తానే చేశానంటూ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. రూ.300 కోట్లు ఖర్చు పెడితే ఈ పాటికి రాయలసీమ సస్యశ్యామలమయ్యేదని తెలిపారు. చంద్రబాబుకు ప్రాజెక్టులపై కంటే.. కాంట్రాక్టుల మీద వచ్చే కమీషన్ల మీదే ఆసక్తి ఎక్కువని మండిపడ్డారు. ప్రాజెక్టులపై చంద్రబాబుది ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు పనులపై విచారణ జరిపేందుకు కానిస్టేబుల్ చాలు అని వైఎస్ జగన్ సూచించారు. రూ.120 కోట్ల పరిహారం చెల్లిస్తే పులిచింతలలో 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటూ, ప్రకాశం బ్యారేజీ నుంచి వృధాగా సముద్రంలో కలిసే 55 టీఎంసీల నీటిని కాపాడునే వాళ్లమని పేర్కొన్నారు. -
ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది వైఎస్
-
‘ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం ఉంది’
-
‘ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం ఉంది’
కడప : పైడిపాలెం రిజర్వాయర్ వద్దకు వెళుతున్న వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తదితర నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పైడిపాలెం జలాశయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. కోవరంగట్టుపల్లి వద్ద అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని గృహనిర్భంధం చేసేందుకు ప్రయత్నించారు. రిజర్వాయర్ వద్దకు వెళ్లకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ప్రొటోకాల్ ప్రకారం సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు తమకు ఆహ్వానం ఉందని వైఎస్ఆర్ సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ పైడిపాలెం జలాశయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తమను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం తమకు ఆహ్వానం ఉందని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. కాగా అంతకు ముందు పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు సింహాద్రిపురం మండలం కోవనగుంటపల్లి చేరుకుని అక్కడ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. -
వైఎస్ఆర్కు పైడిపాలెం రిజర్వాయర్ అంకితం
-
వైఎస్ఆర్కు పైడిపాలెం రిజర్వాయర్ అంకితం
కడప : రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం పైడిపాలెం రిజర్వాయర్ను రైతులతో కలిసి వైఎస్ఆర్కు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ 90శాతం పనులను వైఎస్ఆరే పూర్తి చేశారన్నారు. కేవలం రూ.24 కోట్లు ఖర్చు చేసి... అంతా తామే చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరు ఎత్తితేనే రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ గుర్తుకు రావడం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు 80 శాతం పనులు చేసిన ఘనత వైఎస్ఆర్దేనన్నారు. గండికోట నుంచి పైడిపాలెం ట్రయల్ రన్ చేసి నీరు ఇచ్చామంటే ఇచ్చినట్లు చెప్పుకోవడానికి టీడీపీ ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తోందన్నారు.