breaking news
otuku kotlu
-
‘ఓటుకు కోట్లు 2.0’ ప్రకంపనలు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ఓటుకు కోట్లు 2.0 కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. తననూ టీడీపీ నేతలు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని సోమవారం గుంటూరు (పశ్చిమ) ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ కూడా వెల్లడించడం సంచలనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలని.. టీడీపీ అగ్రనేతతో మాట్లాడిస్తామంటూ స్థానిక నేతలు తనను సంప్రదించారని మద్దాళి గిరిధర్ చెప్పారు. స్థానిక నేతలకు తాను స్పందించకపోవడంతో మాజీ ఎమ్మెల్సీ, చంద్రబాబు సన్నిహితుడు టీడీ జనార్దన్ ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించారని.. కానీ, తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. కుట్రలు, కుతంత్రాలు, విలువల్లేని రాజకీయాలు చేసే చంద్రబాబు వైఖరి నచ్చక.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన చూసి టీడీపీ వీడానని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ అగ్రనేతల నుంచి తనకు వచ్చిన ఫోన్కాల్ లిస్ట్ను ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ బహిర్గతం చేయడంతో టీడీపీ ప్రలోభాల పర్వం మరోసారి బట్టబయలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే రూ.పది కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభపెట్టేందుకు ఉండి ఎమ్మెల్యే రామరాజు ప్రయత్నించారని ఎమ్మెల్యే రాపాక ఇప్పటికే వెల్లడించడం.. ఓటును అమ్ముకుంటే వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లేనని భావించి ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్పష్టంచేసిన విషయం విదితమే. టీడీపీ ప్రలోభాలకు లొంగే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు చేశారన్నది స్పష్టమవుతోంది. గెలిచే బలం లేకున్నప్పటికీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించడాన్ని బట్టి చూస్తుంటే.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే ఓటుకు రూ.కోట్లు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చంద్రబాబు వ్యూహం రచించారని ఆదిలోనే వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ నేతలు చెప్పారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు రావడాన్ని బట్టి చూస్తే.. ఆ పార్టీకి ఉన్న 19 మంది ఎమ్మెల్యేల కంటే అదనంగా నలుగురు ఓట్లేసినట్లు స్పష్టమవుతోంది. ఆ నలుగురికి ఒక్కొక్కరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసినట్లు సజ్జల ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రలోభాల పర్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలు బాబు నైజం.. ప్రజలకు మంచి చేసి.. వారి ఆశీస్సులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించరని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రలోభాల పర్వాన్నే ఆయన ఎంచుకున్నారని గుర్తుచేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాల ద్వారానే అధికారంలోకి రావడంపైనే చంద్రబాబు ఆలోచన చేస్తారని వారు స్పష్టంచేస్తున్నారు. తెలంగాణలో 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఎరవేసి ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ.. ఆడియో వీడియో టేపులతో ఆ రాష్ట్ర ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చంద్రబాబు దొరికిపోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. -
ఓటుకు కోట్లు కేసును... ‘సీబీఐతో విచారణ చేయించాలి’
– కేసీఆర్కు చంద్రబాబు రూ.500 కోట్ల ముడుపులు..!! – ఈ కేసులో అనుబంధ చార్జిషీటు వేయకపోవడం దీన్ని బలపరుస్తుంది – సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా అవసరం – అప్పీలుకు వెళ్లకుండా చంద్రబాబు తన సచ్ఛీలతను చాటుకోవాలి – వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన డిమాండ్ సాక్షిప్రతినిధి, తిరుపతి : ఓటుకు కోట్లు కేసును కేంద్రం సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల మ«ధ్య చోటుచేసుకున్నట్లు వినిపిస్తోన్న రూ.500 కోట్ల ఆర్థిక లావాదేవీల అంశాన్ని బయటకు తీసేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమన ఓటుకు కోట్లు కేసును ప్రస్తావించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు విషయంలో రెండు రాష్ట్రాల సీఎంల మధ్య పెద్ద తతంగమే నడిచిందన్నారు. బ్రహ్మదేవుడు దిగొచ్చినా బాబు రక్షించలేడన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడాది దాటినప్పటికీ ఈ కేసులో అనుబంధ చార్జిషీటు వేయలేదని ఆరోపించారు. కేంద్రం దగ్గర సాగిలపడి, కేసీఆర్ కాళ్లుపట్టుకుని ఊగిన చంద్రబాబు నాయుడు రాష్ట్రప్రయోజనాలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్కు రూ.500 కోట్ల ముడుపులు అందాయని తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపించాయని భూమన పేర్కొన్నారు. శాస్త్రీయంగా, పరిశోధన చేసి బయట పెట్టిన ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన ఏసీబీ కోర్టు కేసు పునర్విచారణకు ఆదేశించడంతో చంద్రబాబులో మళ్లీ వణుకు మొదలైందన్నారు. తిరుపతిలో జరిగే జాతీయస్థాయి వైద్యసదస్సుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ హఠాత్తుగా తిరుపతి పర్యటన వాయిదా వేసుకుని ఆయన బెంగళూర్ వెళ్లారన్నారు. అడుగడుగునా కుట్ర రాజకీయాలే... చంద్రబాబువి అడుగడుగునా కుట్ర రాజకీయాలేనని భూమన ధ్వజమెత్తారు. పదేపదే తాను సచ్ఛీలుడనని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అప్పీలుకు వెళ్లకుండా తన సచ్చీలతను నిరూపించుకోవాలని భూమన సవాల్ విసిరారు. అవినీతిపరుడైన నాయకుడు రాష్ట్రానికి సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు అపారమైన నమ్మకం ఉందనీ, అందుకే సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా తానెవ్వరికీ భయపడనన్న సీఎం మాటలను ప్రస్తావించిన భూమన ..ఎవరినైనా కొనగలన నీ, మేనేజ్ చేయగలనన్న ధైర్యం ఉండటం వల్లనే సీఎం చంద్రబాబు ఎవ్వరికీ భయపడరన్నారు.ప్రత్యేక హోదా సాధన విషయంలో ఎవ్వరితోనైనా వైఎస్సార్సీపీ కలిసి పోరాడుతుందని భూమన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.