breaking news
one-day strike
-
ఉద్యోగాలు భర్తీ చేయాలని దీక్ష
ఆదిలాబాద్ అర్బన్ : ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివాజీ, మసిఉల్లా ఖాన్, నాయకులు రాజు, విశాల్, సమీద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సాదనలో ముందుండి పోరాటాలు చేసిన విద్యార్థులకు పలు హామీలు ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతున్న ఇంకా విద్యార్థులు, యువకులు, ప్రజలు ఆశలపల్లకిలో ఊరేగిస్తున్నారని ఎద్దేవా చేశారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. టీఎస్పీఎస్సీ ఇయర్ క్యాలెండర్ను విడుదల చేయాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
రేపే బ్యాంకు యూనియన్ల సమ్మె
న్యూఢిల్లీ: తొమ్మిది బ్యాంకుల సంఘాల ఆధ్వర్యంలో రేపే భారీ ఎత్తున సమ్మె నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా, ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్సీబీసీ, ఏబబీఓఏ,బీఈఎఫ్ఐ, ఐఎన్బీఈ ఎఫ్, ఐఎన్ బీఓసీ, ఎన్ఓబీడబ్ల్యు, ఎన్ఓబీఓ యూనిమయన్ల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28 న ఒక రోజు సమ్మె చేపట్టనున్నారు. బ్యాంకుయూనియన్లతో కేంద్ర ప్రభుత్వ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వరంలో జరిగిన సమావేశంలో విఫలం కావడంతో ఈ సమ్మె అనివార్యమైంది. యూనియన్ల డిమాండ్లను బ్యాంకుల మేనేజ్ మెంట్ బాడీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తిరస్కరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, పాత తరం ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులుఈ సమ్మెలో పాల్గొననున్నాయి. మొండి బకాయిలను రాబట్టడంలో బ్యాంకు ఉన్నతాధికారులు జవాబుదారీగా ఉండాలి, అన్ని స్థాయిల్లో ఖాళీల భర్తీ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు కఠిన శిక్షలు వంటి పలు డిమాండ్లతో సమ్మెకు దిగనున్నట్లు బ్యాంకు సంఘాల ఐక్య వేదిక(యుఎఫ్బియు) నేతృత్వంలోని బ్యాంకు సంఘాలు తెలిపాయి. అయితే జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం, జాతీయ బ్యాంకు అధికారుల సంఘాలు మాత్రం సమ్మెలో పాల్గొనట్లేదు. ఫిబ్రవరి 21న భారత బ్యాంకుల సమాఖ్య(ఐబిఎ)తో జరిపిన చర్చలు విఫలమైనట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య(ఎఐబిఇఎ) ప్రకటించింది. సమ్మె యథావిధిగా కొనసాగుతందని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం ఆదివారం మీడియాకు చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక సంస్కరణలపై కూడా బ్యాంకు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. బ్యాంకింగ్ రంగంలో శాశ్వత ఉద్యోగాలను తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ సంఘాలు ప్రభుత్వం ప్రజావ్యతిరేక బ్యాంకింగ్ సంస్కరణలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టనున్నాయి. ముఖ్యంగ గత ఏడాది నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీమానిటైజేషన్ కాలంలో అదనంగా పనిచేసిన ఉద్యోగులకు పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మంగళవారం వివిధ యూనియన్ల ఆద్వర్యంలో సమ్మెను చేపట్టనున్న నేపథ్యంలో ప్రముఖ బ్యాంకులు కొన్ని ఇప్పటికే వినియోగదారులకు సమాచారాన్ని అందించాయి. ముఖ్యంగా సమ్మె కారణంగా తమ బ్యాంక్ కార్యకలాపాలకు, సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్న ముందస్తు సూచనలను అందించాయి. -
రేపే బ్యాంకుల సమ్మె
చెన్నై : ప్రభుత్వం, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రవేశపెడుతున్న పాలసీలను, సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు రేపు సమ్మెకు దిగనున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ), మంగళవారం ప్రభుత్వ అధికారులతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో, గతంలో సమ్మెకు పిలుపునిచ్చిన మాదిరిగానే శుక్రవారం ఒక్కరోజు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు బంద్ కానున్నట్టు బ్యాంకు యూనియన్ల ఫోరం ప్రకటించింది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీ.హెచ్ వెంకటచలం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు, ఆఫీసర్లు ఈ బంద్ పాల్గొనబోతున్నారని తెలిపారు. 80 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు శుక్రవారం క్లోజ్ కానున్నాయి. అసమంజసమైన బ్యాంకింగ్ సంస్కరణ నేపథ్యంలో బ్యాంకులు వన్ డే బంద్ను చేపడుతున్నాయి.