breaking news
oil field
-
నష్టపోతున్న రైతులు ఈ సాగు చేస్తే డబ్బులే డబ్బులు
-
Russia-Ukraine war: రష్యా ధ్వంస రచన
కీవ్/మారియూపోల్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులకు దిగుతోంది. దేశంలో మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తోంది. తూర్పు ప్రాంతంలోని రైల్వే కార్యాలయాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం సోమవారం క్షిపణుల వర్షం కురిపించింది. పశ్చిమ ప్రాంతంలోనూ రెండు చమురు కేంద్రాలపై దాడికి దిగింది. మధ్య, పశ్చిమ ఉక్రెయిన్లో ఐదు రైల్వే కార్యాలయాలపై దాడులు చేసింది. క్రెమెన్చుక్లోని చమురు శుద్ధి కర్మాగారాన్ని ధ్వంసం చేశాయి. రష్యా యుద్ధ విమానాలు ఆదివారం రాత్రి 56 చోట్ల దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ చెప్పింది. రష్యా ఆయిల్ డిపోలో మంటలు ఉక్రెయిన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రష్యా నగరం బ్రియాన్స్క్లో ఆయిల్ డిపోలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దానికి కారణాలు తెలియరాలేదు. ఈ అయిల్ డిపో నుంచి యూరప్కు పైప్లైన్ ద్వారా ముడి చమురు సరఫరా అవుతూంటుంది. పశ్చిమ దేశాల కుట్రలు సాగవు: పుతిన్ తమ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు కుట్ర పన్నుతున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ఆరోపించారు. రష్యాను అంతర్గతంగా ధ్వంసం చేసేందుకు పశ్చిమ దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు. యుద్ధ పరిస్థితిపై సోమవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఆ బాలలకు ఈస్టర్ బహుమతులు మారియూపోల్లోని అజోవ్స్టల్ స్టీల్ప్లాంట్ బంకర్లో క్షణమొక యుగంలా గడుతుపున్న ఉక్రెయిన్ బాలల ముఖాల్లో ఈస్టర్ బహుమతులు వెలుగులు నింపాయి. ఉక్రెయిన్ సైన్యం వారికి బహుమతులు అందించింది. మరోవైపు నాటో సభ్యత్వం కోసం స్వీడన్, ఫిన్లాండ్ మే 22 తర్వాత దరఖాస్తు సమర్పించనున్నాయి. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సోమవారం టర్కీలో పర్యటించారు. ఆయన మంగళవారం రష్యా వెళ్లి పుతిన్తో సమావేశమవుతారు. 28న ఉక్రెయిన్కు వెళ్తారు. రష్యా ప్రభుత్వం 40 మంది జర్మనీ దౌత్య అధికారులను తమ దేశం నుంచి బహిష్కరించింది. -
అసోం ఓఎన్జిసీ గ్యాస్ బావిలో పేలుడు
-
సంక్షోభంలో గల్ఫ్
మారణాయుధాల వినియోగంలో, ధ్వంస రచనలో ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదని యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదార్లు నిరూపించారు. సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆరామ్కో ఆధ్వర్యంలో తూర్పు ప్రాంతంలో ఉన్న రెండు చమురు క్షేత్రాలపై శనివారం ద్రోన్లతో దాడులు జరిపి ఆ దేశానికి భారీ నష్టం కలగజేశారు. ప్రపంచంలో ప్రధాన ముడి చమురు ఉత్పత్తి దేశంగా ఉన్న సౌదీ అరేబియా ఈ ఉదంతంతో ఒక్కసారిగా తన ఉత్పత్తిని సగానికి తగ్గించుకోవాల్సి వచ్చిందంటే నష్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. సౌదీ సరిహద్దుల్లోకి తిరుగుబాటుదార్లు చొరబడి తమ సైనికుల్ని చంపేశారని ఆరోపిస్తూ నాలుగేళ్లక్రితం ఈజిప్టు, బహ్రైన్, కువైట్, జోర్డాన్, సుడాన్ తదితర పది దేశాలతో సౌదీ అరేబియా కూటమి కట్టి హౌతీ తిరుగుబాటుదార్లపై యుద్ధం ప్రారంభించింది. యుద్ధాలెప్పుడూ అనుద్దేశిత పర్యవసానాలకు దారితీస్తాయి. యెమెన్ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించి ఉత్తర యెమెన్లో షియా మైనారిటీ తెగ జైదీలకు చెందిన హౌతీ తిరుగుబాటుదార్ల పని పట్టాలని సంకల్పించిన సౌదీ అరేబియా చివరికిప్పుడు తన గగనతలాన్నే రక్షించుకోలేక అందరిలో నగుబాటుపాలైంది. యెమెన్లో అధ్యక్షుడు హదిని పదవినుంచి తప్పించాలని సంకల్పించిన హౌతీ తిరుగుబాటుదార్ల వెనక ఇరాన్ హస్తమున్నదని సౌదీ అరేబియా శంకించి ఈ పోరు ప్రారంభించింది. అసలే యెమెన్ అంతక్రితం మూడేళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతుంటే సౌదీ తగుదునమ్మా అని తలదూర్చి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇంతవరకూ ప్రపంచ దేశాలన్నీ హౌతీ తిరుగుబాటుదార్లను తేలిగ్గా తీసుకున్నాయి. నాలుగేళ్లుగా సౌదీ దాడులను తట్టుకుని నిలబ డినా వారిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజా దాడులతో వారి శక్తిసామర్థ్యాలపై అందరిలో పున రాలోచన బయల్దేరింది. ఎందుకంటే వారు పది ద్రోన్లను సౌదీపై గురిపెడితే అరేబియా ద్వీపకల్పం పొడవునా ఎవరి నిఘాకూ చిక్కకుండా ఆ ద్రోన్లు లక్ష్యాన్ని ఛేదించాయి. ఇరాన్ హస్తం లేకపోతే హౌతీలకు ఇది అసాధ్యమని సౌదీతోపాటు అమెరికా కూడా విశ్వసిస్తోంది. ఏం జరిగిందో సౌదీ స్పష్టంగా చెబితే తాము యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ద్రోన్లు ఇరాన్ భూభాగం నుంచి వచ్చాయా, ఇరాక్లో షియా ఆధిపత్యం ఉన్న ప్రాంతం నుంచి వచ్చాయా అన్నది అమెరికా ఇంకా తేల్చుకోలేదు. ఇలాంటి బెదిరింపుల వల్ల ఇరాన్ పాదాక్రాంతమవుతుందని, పశ్చిమాసియాపై పూర్తి పట్టు సాధించవచ్చునని అమెరికా అంచనా వేస్తే అది ఘోర తప్పిదమే అవుతుంది. ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ పోరును మరింత ఉగ్రరూపం దాల్చ కుండా ఎలా చల్లార్చడమన్నదే అందరి ధ్యేయం కావాలి. పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధమే సంభవిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయో తాజా పరిణామాలను చూస్తేనే అర్ధమవుతుంది. ద్రోన్ దాడుల తర్వాత సౌదీ అరేబియా ఒక్కసారిగా తన దినసరి చమురు ఉత్పత్తిలో 57 లక్షల బ్యారెళ్ల కోత పెట్టాల్సివచ్చింది. ఇది ప్రపంచ చమురు సరఫరాలో 5 శాతం కన్నా ఎక్కువే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారి పైపైకి ఎగబాకాయి. 55 డాలర్లున్న బ్యారెల్ చమురు ధర 67 డాలర్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పల్టీ కొట్టాయి. కరెన్సీ విలువలు పతనమయ్యాయి. బంగారం ధర మరోసారి భగ్గు మంది. మన దేశంపై కూడా పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు బాగా పెరిగి అసలే అంతంతమాత్రంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ విపత్కర స్థితిలో చిక్కుకుంటుంది. ఇప్పటికే 5శాతంగా ఉన్న వృద్ధి రేటులో మరింత కుంగుబాటు ఉంటుంది. మన చమురు అవసరాల్లో 83 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. ఈ దిగుమతుల్లో సౌదీ వాటాయే అధికం. తమ నుంచి వచ్చే చమురులో కోత విధించబోమని సౌదీ అరేబియా మన దేశానికి ఇప్పటికే హామీ ఇచ్చింది. వారం రోజుల్లో చమురు ఉత్పత్తి మళ్లీ యధా స్థితికి చేరుతుందని తెలిపింది. అయితే తనకు వచ్చి పడిన నష్టాలను పూడ్చుకోవడానికి ముందూ, మునుపూ ధరలు పెంచే ప్రమాదం లేక పోలేదు. అదే జరిగితే మన కష్టాలు మరింతగా పెరుగుతాయి. ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదాల గురించి ఇన్నాళ్లూ అందరిలోనూ ఉంటున్న అంచనాలు వేరు. సిరియా సంక్షోభం సకాలంలో చల్లారకపోతే అగ్రరాజ్యాల మధ్య ఘర్షణ తలెత్తు తుందని, అది ప్రపంచ దేశాలన్నిటినీ ఆర్థికంగా కుంగదీస్తుందని అనుకున్నారు. అక్కడ సంక్షోభం యథాతథంగానే ఉన్నా అగ్రరాజ్యాలు సంయమనం పాటించాయి. అయితే అమెరికా–చైనాల టారిఫ్ల యుద్ధం ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాల్చి ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ఊబిలోకి నెడుతుందని ఈమధ్యకాలంలో అందరూ ఆందోళనపడ్డారు. అది కూడా ఎంతో కొంత చల్లారింది. కానీ ఊహిం చనివిధంగా తాజా ద్రోన్ దాడులు పశ్చిమాసియాలో కయ్యానికి ఆజ్యం పోశాయి. అటు సిరియా సంక్షోభమైనా, ఇటు యెమెన్ రగడైనా సౌదీ అరేబియా పుణ్యమే. 2011లో జరిగిన అరబ్ విప్లవంలో ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ఊహించనివిధంగా పతనం కావడంతో ఇరాన్ ప్రాబల్యం పెరుగుతుందని భయపడ్డ సౌదీ... అందుకు సిరియాలో నిప్పు రాజేయడమే విరుగుడుగా భావిం చింది. అక్కడ పాలకుణ్ణి మారిస్తే అది తన చెప్పుచేతల్లోకి వస్తుందని అంచనా వేసింది. కానీ 2015లో రష్యా రంగప్రవేశంతో అది బెడిసికొట్టింది. ఆ తర్వాత సౌదీ అరేబియా యెమెన్లో వేలుపెట్టింది. ఈ నాలుగేళ్లలో అక్కడి ఘర్షణల్లో లక్షమంది మరణించగా, లక్షలాదిమంది శరణార్ధులుగా మారారు. ఇప్పుడు అమెరికా ఇరాన్పై దాడికి దిగితే అది పశ్చిమాసియాకు మాత్రమే కాదు...ప్రపంచానికే పెను ముప్పు కలిగిస్తుంది. అందుకే ప్రపంచ దేశాలూ, ఐక్యరాజ్యసమితి మొదలుకొని అన్ని ప్రపంచ సంస్థలూ పశ్చిమాసియాలో శాంతికి కృషి చేయాలి. ఏదో ఒక సాకుతో ఇరాన్పై ఒంటికాలిపై లేస్తున్న అమెరికాను అదుపు చేయాలి. -
కువైట్లో ఏడుగురు భారతీయుల మృతి
కువైట్ సిటీ: కువైట్లోని బుర్గాన్ ఆయిల్ క్షేత్రం సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో వాటిలో ప్రయాణిస్తున్న ఏడుగురు భారతీయులు సహా 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఐదుగురు ఈజిప్షియన్లు, ముగ్గురు పాకిస్తానీలు ఉన్నట్లు కువైట్ అత్యవసర విభాగం అధికార ప్రతినిధి కల్నర్ ఖలీల్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ కువైట్ పౌరుడితో పాటు ఇద్దరు భారతీయులు గాయపడ్డారన్నారు. వీరిలో ఓ భారతీయుడి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వాహనాలు నుజ్జునుజ్జు కావడంతో అందులో మరో నలుగురు సిబ్బంది చిక్కుకున్నారనీ, వారందరినీ రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చనిపోయినవారంతా బుర్గాన్ డ్రిల్లింగ్ సంస్థకు చెందిన ఉద్యోగులేనని పేర్కొన్నారు. -
వాంకోర్నెఫ్ట్లో ఓవీఎల్ వాటా కొనుగోలు పూర్తి
♦ 15% వాటాను 127కోట్ల డాలర్లకు కొనుగోలు ♦ మరో 11 శాతం వాటా కొనుగోలు! న్యూఢిల్లీ: రష్యాలో రెండో అతి పెద్ద చమురు క్షేత్రం వాంకోర్లో 15 శాతం వాటా కొనుగోలును ఓఎన్జీసీ విదేశ్ పూర్తి చేసింది. వాంకోర్ చమురు క్షేత్రాన్ని నిర్వహించే జేఎస్సీ వాంకోర్నెఫ్ట్ కంపెనీలో ఈ 15% వాటాను ఓఎన్జీసీ విదేశ్ 126.8 కోట్ల డాలర్లకు రష్యా జాతీయ చమురు సంస్థ రాస్నెఫ్ట్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఓఎన్జీసీ విదేశ్కు ఇది నాలుగో అతి పెద్ద కొనుగోలు లావాదేవీ. వాంకోర్నెఫ్ట్ డెరైక్టర్ల బోర్డ్లో రెండు డెరైక్టర్ల పదవులు ఓఎన్జీసీ విదేశ్కు లభిస్తాయి. 250 కోట్ల బ్యారె ళ్ల రికవరబుల్ రిజర్వ్లు ఉన్న ఈ చమురు క్షేత్రం నుంచి ఓవీఎల్ వాటా కింద ఏడాదికి 33 లక్షల టన్నుల చమురు వస్తుందని అంచనా. ఈ చమురు క్షేత్రంలో రోజుకు 4.42,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోందని, దీంట్లో ఓవీఎల్ వాటా రోజుకు 66 వేల బ్యారెళ్లుగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ వాటా కొనుగోలుతో రష్యాలో ఓవీఎల్ స్థితి మరింతగా పటిష్టమవుతుందని, భారత ఇంధన భద్రత మరింత మెరుగుపడుతుందని, అంతేకాకుండా ఇరు దేశాల మధ్య సహకారం మరింతగా బలపడుతుందని ఓవీఎల్ పేర్కొంది. మరో 11% వాటాను కూడా విక్రయించడానికి రాస్నెఫ్ట్ అంగీకరించింది. దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారు కావలసి ఉంది. -
చమురు క్షేత్రంలో అగ్ని ప్రమాదం, 30 మంది గల్లంతు
బాకు: కాస్పియన్ సముద్రంలోని అజర్బైజాన్ దేశ చమురు సంస్థ సోకార్కు చెందిన చమురు క్షేత్రంలో అగ్ని ప్రమాదం జిరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా మరో 30 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో గునెష్లీ ఆయిల్ ఫీల్డ్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదం జరిగిన అనంతరం సహాయక సింబ్బంది 33 మందిని కాపాడారు. కాగా మిగిలిన వారి ఆచూకీ లభించడం లేదు. అంతర్గత గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడం ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కాగా గల్లంతైన వారికోసం సహాయక సింబ్బంది చేపడుతున్న గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.