-
జీవితకాల గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు బుధవారం ఆరంభ లాభాల్ని కోల్పోయి మిశ్రమంగా ముగిశాయి. అలాగే డెరివేటివ్స్ కాంట్రాక్టులకు ముగింపునకు ముందురోజు ట్రేడర్లు అప్రమత్తత వహించడం ప్రతికూలంగా మారింది. ఇంట్రాడేలో 239 పాయింట్లు పెరిగి 56,198 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 15 పాయింట్ల నష్టంతో 55,944 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్ సూచీ 87 పాయింట్లు ఎగసి 16,712 వద్ద కొత్త ఆల్టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి పది పాయింట్ల స్వల్ప లాభంతో 16,635 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ఈ ముగింపు స్థాయిలు కొత్త గరిష్టాలు కావడం విశేషం. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో 22 షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 298 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్ల పరిధిలో ట్రేడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1072 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.151 కోట్ల షేర్లను అమ్మారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఐదు పైసలు క్షీణించి 74.24 వద్ద స్థిరపడింది. కోవిడ్ వ్యాక్సిన్ అనుమతులు లభించడంతో పాటు జాక్సన్ హోల్ వార్షిక సమావేశం యూఎస్ ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లపై సానుకూల వ్యాఖ్యలు చేయవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. టీసీఎస్ @ రూ.13.50 లక్షల కోట్లు ఐటీ దిగ్గజం టీసీఎస్ కంపెనీ మార్కెట్ విలువ బుధవారం రూ.13.50 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ టీసీఎస్యే. బీఎస్ఈలో ఈ షేరు రూ. 3,613 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా ఇంట్రాడేలో 2.5% లాభపడి రూ.3,697 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి ఒకశాతం లాభంతో రూ.3659 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.13.53 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే మార్కెట్ విలువ పరంగా ఐటీ రంగానికే చెందిన ఇన్ఫోసిస్ మంగళవారం 100 బిలియన్ డాలర్ల(రూ.7.4 లక్షల కోట్లు) క్లబ్లోకి చేరిన సంగతి తెలిసిందే. -
ఆల్ టైం గరిష్టస్థాయికి నిఫ్టీ
ముంబై: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లకు ఊపునిచ్చాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే మార్కెట్లు కదం తొక్కాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంకాగానే బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సరికొత్త శిఖర స్థాయిలను అందుకున్నాయి. సెన్సెక్స్ 21,484 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. 6,415 పాయింట్లతో నిఫ్టీ ఆల్ టైం గరిష్టస్థాయిని చేరుకుంది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాలతో నడుస్తోంది. సెన్సెక్స్ 370 పాయింట్లకు పైగా లాభాలతో దూసుకుపోతోంది. నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడం సెంటిమెంట్కు జోష్నిచ్చిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే అధిక స్థాయిలవద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టే అవకాశమున్నదని తెలిపారు. అటు డాలర్ తో రూపాయి మారక విలువ కూడా నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. 36 పైసలు బలపడి 61.05గా రూపాయి మారక విలువ కొనసాగుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement