-
ప్రజా సమస్యలకు ‘ఎఫ్’ గ్రేడ్
న్యూఢిల్లీ: గత నాలుగేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రేడ్లు కేటాయించారు. ఎన్డీఏ పాలనను ట్విట్టలో ఆయన ఎగతాళి చేస్తూ అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యవసాయం, విదేశాంగ విధానం, ఉద్యోగ కల్పనలో ‘ఎఫ్ ’ గ్రేడ్, నినాదాల రూపకల్పన, సొంత ప్రచారంలో రాహుల్ ‘ఏ+’ గ్రేడ్ ఇచ్చారు. ‘ఇది ఎన్డీఏ సర్కారు నాలుగేళ్ల రిపోర్టు కార్డు. వ్యవసాయం ‘ఎఫ్’, విదేశాంగ విధానం ‘ఎఫ్’, పెట్రో ధరలు ‘ఎఫ్’, ఉద్యోగ కల్పన ‘ఎఫ్’, నినాదాల రూపకల్పన ‘ఏ+’, సొంత ప్రచారం ‘ఎ+’, యోగా ‘బీ–’ అని గ్రేడ్లు ఇచ్చారు. అనర్గళంగా మాట్లాడటంలో దిట్ట, వ్యక్తిత్వ సమస్యలతో బాధపడే వ్యక్తి, ఏకాగ్రత లేని మనస్తత్వం అని మోదీ అంటూ రిమార్క్స్ ఇచ్చారు. మోదీ–షా ద్వయం ప్రమాదకరం మోదీ– అమిత్ షా ద్వయం దేశానికి ప్రమాదకరమని ప్రజలు గ్రహించారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ‘భారత్ మోసపోయింది’ పేరిట బుక్లెట్ను విడుదల చేస్తూ.. ఈ నాలుగేళ్లు నమ్మకద్రోహం, మోసం, ప్రతీకారం, అసత్యాలతో కూడిన పాలన కొనసాగిందని అందులో పేర్కొంది. ఇంగ్లిష్, హిందీలో విడుదల చేసిన ఈ పుస్తకంలో ప్రధాని మోదీకి 40 ప్రశ్నల్ని సంధించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల పేరిట లఘు చిత్రాన్ని కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, సూర్జేవాలాలు శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్డీఏ హాయంలో దేశంలో భయం, విద్వేషపూరిత వాతావరణం సృష్టించారని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్ పేర్కొన్నారు. సాధించిందేమీ లేదు: వామపక్షాలు న్యూఢిల్లీ: అపజయాలు, అబద్ధాలు, ఒట్టి ప్రచారాలు తప్ప నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించినవి మరేమీ లేవని వామపక్షాలు విమర్శించాయి. దేశ సామాజిక వ్యవస్థలు, ప్రజల జీవనాధారాలపై గతంలో ఎన్నడూ లేనంతగా ఈ నాలుగేళ్లలో దాడులు జరిగాయనీ, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజలకు రక్షణ ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వెళ్తోందనీ, ప్రజలు భయంతో, అభద్రతా భావంతో జీవిస్తుండగా వారి రాజ్యాంగ బద్ధమైన, ప్రజాస్వామ్య హక్కులు ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థలను మోదీ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. -
‘చుక్..చుక్’ కలలకు గ్రీన్ సిగ్నలేనా!
సాక్షి, కాకినాడ : నాటి ఎన్డీఏ హయాంలో పునాదిరాయి పడిన రైల్వేప్రాజెక్టులకు నేటి ఎన్డీఏ ప్రభుత్వంలోనైనా మోక్షం లభించకపోతుందా, రైల్వే మంత్రి సదానందగౌడ్ మంగళవారం ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్ అయినా తమ ఆకాంక్షలను సాకారం చేయకపోతుందా అని జిల్లావాసులు ఆశపడుతున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించడంతో పాటు రాష్ర్ట విభజన నేపథ్యంలో మరికొన్ని ప్రాజెక్టులు, రైళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ- చెన్నైల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో కాకినాడ-బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ను పట్టాలెక్కించడంతో పాటు నర్సాపురం నుంచి మచిలీపట్నం-రేపల్లె-నిజాంపట్నంల మీదుగా బాపట్ల వరకు పొడిగిస్తూ, కాకినాడ-మచిలీపట్నం-నిజాంపట్నం ఓడరేవులను కలుపుతూ కొత్తలైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వందలకోట్లు ఇస్తున్నా చిన్నచూపే.. దక్షిణ మధ్య రైల్వేకి రూ.900 కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న మన జిల్లా పట్ల కేంద్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతూనే ఉన్నాయి. దశాబ్ద కాలంగా యూపీఏ- 1, 2 హయాంలో ప్రతి రైల్వే బడ్జెట్లో మొండిచేయే మిగిలేది. ఈఏడాది ఫిబ్రవరి 12న అప్పటి రైల్వేమంత్రి మల్లిఖార్జునఖార్గే ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లా మీదుగా కొత్తగా సికింద్రాబాద్-విశాఖపట్నం ఏసీ ఎక్స్ప్రెస్ మినహా ఒరిగిందేమీ లేదు. జిల్లా కేంద్రమైన కాకినాడను మెయిన్లైన్కు అనుసంధానించాలన్నది దశాబ్దాల కల. అనుసంధానానికి కాకినాడ-పిఠాపురంల మధ్య 21 కిలోమీటర్ల బ్రాడ్గ్రేజ్ లైన్ వేయాలి. రూ.126 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు 2012 బడ్జెట్లో రూ.5 కోట్లు కేటాయిస్తే 2013లో రూ.కోటి మాత్రమే విదిల్చారు. ఈ బడ్జెట్లోనైనా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తారని కాకినాడ వాసులు ఆశిస్తున్నారు. కోనసీమకు రైల్వేకూత వినిపించేనా? కోటిపల్లి-నర్సాపురం రైల్వేప్రాజెక్టుకు దివంగత లోక్సభాపతి జీఎంసీ బాలయోగి కృషితో 2000 నవంబరు 16న నాటి ఎన్డీఏ హయాంలో పునాదిరాయి పడింది. 55 కిలో మీటర్ల ఈ లైన్ నిర్మాణ వ్యయం 2000లో రూ.329 కోట్లు కాగా ప్రస్తుతం రూ.1100 కోట్లకు చేరింది. ట్రాక్, స్టేషన్ నిర్మాణాలకు 161.43 ఎకరాలు సేకరించగా,ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంట్లో అధిక మొత్తం పరిహారానికి, మిగిలింది సర్వేలకు ఖర్చుచేశారు. నిర్మాణ వ్యయంలో 25 శాతం నిధులు ఇచ్చేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చినా కేంద్రం పట్టించుకోనేలేదు. ఎంపీలు హామీలు నిలుపుకోవాలి.. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ సర్వేకు 2012 బడ్జెట్లో ఆమోదం తెలిపినా నేటికీ నిధులు కేటాయించలేదు. కాకినాడ నుంచి ఢిల్లీ, కోల్కతా, వారణాసిలకు కొత్త రైళ్లు, కాకినాడ రాజమండ్రిల మీదుగా హైదరాబాద్, తిరుపతిలకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లను నడపాలని, సర్కార్ ఎక్స్ప్రెస్ను పుదుచ్చేరి వరకు పొడిగించాలన్న డిమాండ్లు ఈసారైనా కార్యరూపం దాలుస్తాయని ఆశిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న కాకినాడ- కోటిపల్లి లైన్లో రాయగడ వరకు పాసింజర్ రైలును కొత్తగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మెయిన్లైన్, కోనసీమ రైల్వేలైన్ సాధిస్తామని కాకినాడ, అమలాపురం ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు ఎన్నికల్లో హామీలిచ్చారు. తోట లోక్సభలో టీడీపీ పక్ష నేతగా ఉన్నందున పెండింగ్ రైల్వేప్రాజెక్టులను పట్టాలెక్కిస్తారని ఆశిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement