breaking news
MLC Kurney Prabhakar
-
ఓటమి భయం పట్టుకున్నది కాంగ్రెస్కే: కర్నె
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయం పట్టుకుంది ముఖ్యమంత్రి కేసీఆర్కు కాదని, కాంగ్రెస్ పార్టీ నేతలకే ఆ భయం పట్టుకుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్వి దిగజారుడు రాజకీయాలని, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తున్నది కడుపు మండి కాదని, కండ్లు మండి ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కాక, కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తున్నందుకు సిగ్గుపడాలని మండిపడ్డారు. వివిధ ప్రాజెక్టులు, ప్రభుత్వ నిర్ణయాలపై కేసులు వేసినందుకు సీఎల్పీ నేత జానారెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ముక్కు నేలకు రాసి లక్ష గుంజీలు తీయాలన్నారు. -
ధర్నాచౌక్ హింసకు ‘లెఫ్ట్’దే బాధ్యత
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ప్రజలు, పోలీసులపై దాడులు చేసి సృష్టించిన హింసాకాండకు కమ్యూనిస్టులే బాధ్యత వహించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే దుర్బుద్ధితో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కమ్యూనిస్టులు పథకం ప్రకారం సృష్టించిన అరాచకాన్ని టీఆర్ఎస్ శాసనసభా పక్షం తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముందస్తుగానే ధర్నాచౌక్ హింసాకాండకు రూపకల్పన జరిగిందని కర్నె ఆరోపించారు. ధర్నాచౌక్ను అక్కడి నుంచి తొలగించాలని కానీ, అక్కడే కొనసాగించాలని కాని ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశం కోర్టులో ఉందని తెలిపారు. ధర్నాచౌక్ వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, దానిని అక్కడి నుంచి తరలించాలని చుట్టుపక్కల బస్తీల ప్రజలు కోరుతున్నారని, కొందరు కోర్టులో పిటిషన్ కూడా వేశారని కర్నె వివరించారు. అసలు ధర్నాలు చేయాల్సిన అవసరమే రాకుండా ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ పోతోందని అన్నారు. ఆందోళనకు మద్దతు ఇచ్చిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీటీడీపీ నేత రేవంత్రెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రజలకు క్షమాపణలు, ఈ సంఘటనకు కారణమైనవారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.