breaking news
MkIII
-
సుఖోయ్లో ప్రయాణించిన సీతారామన్
జోధ్పూర్: రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(57) బుధవారం రెండు సీటర్ల సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధవిమానంలో ప్రయాణించారు. ఆలివ్ రంగు యాంటీ గ్రావిటీ సూట్ ధరించిన సీతారామన్.. రాజస్తాన్లోని జోధ్పూర్ ఎయిర్బేస్లో ఐఏఎఫ్ పైలెట్తో కలిసి 45 నిమిషాల సేపు ఆకాశంలో విహరించారు. దీంతో సుఖోయ్లో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. సుఖోయ్లో ప్రయాణించిన తర్వాత సీతారామన్ మాట్లాడుతూ ఈ ప్రయాణం చిరస్మరణీయమైన అనుభవమని వ్యాఖ్యానించారు. ఈ ప్రయాణానికి ముందు ఐఏఎఫ్ ఎయిర్బేస్ నిర్వహణ, యుద్ధ సన్నద్ధతపై ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం సుఖోయ్ ప్రయాణంతో పాటు కాక్పిట్ పరిస్థితులపై అధికారులు మంత్రికి వివరించారు. సీతారామన్ కంటే ముందు మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలామ్ 2003లో, ప్రతిభా పాటిల్ 2009లో సుఖోయ్లో ప్రయాణించారు. సీతారామన్ కంటే ముందు 2003లో అప్పటి రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ సుఖోయ్–30 విమానంలో చక్కర్లు కొట్టారు. రక్షణమంత్రి ప్రయాణించిన విమానం 8 వేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ధ్వని వేగాన్ని అధిగమించిందని ఓ ఐఏఎఫ్ అధికారి తెలిపారు. ‘ ఈ ప్రయాణంలో ఎవరెస్ట్ శిఖరమంత(8,848 మీటర్ల) ఎత్తుకు చేరుకోవడంతో పాటు ధ్వని వేగాన్ని అధిగమించడం మన పైలెట్లకున్న సామర్థ్యాన్ని తెలియజేస్తోంది’ అని సీతారామన్ వ్యాఖ్యానించారు. -
విజయవంతంగా క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశో ధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది ఏప్రిల్లో ప్రయోగిం చబోయే జీఎస్ఎల్వీ మార్క్–3లో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజిన్ (సీ–25) పరీక్షను ఇస్రో శాస్త్రవే త్తలు శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. తమిళనా డులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో వున్న ఇస్రో ప్రపొల్షన్ సెంటర్లో క్రయోజనిక్ ఇంజి న్ను రూపొందించి చేసిన పరీక్ష సక్సెస్ కావడంతో ఇక ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. జీఎస్ఎల్వీ మార్క్ 3 భారీ రాకెట్ ద్వారా సుమారు 4 టన్నుల బరువు కలిగిన జీశాట్–19 అనే సమాచారం ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. షార్కు చేరుకున్న ఎల్–40: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి మార్చి నెలాఖరులోపు ప్రయోగించాలనుకున్న జీఎస్ఎల్వీ ఎఫ్–09 రాకెట్కు సంబంధించిన ఎల్–40 దశ శనివారం షార్కు చేరుకుంది. ఈ దశను జీఎస్ఎల్వీ ఎఫ్–09 కోర్అలోన్ దశలో ఉపయోగిస్తారు.