breaking news
mathura rally
-
మన దేశం చెత్తగా ఉండాలా?
మన దేశం శుభ్రంగా ఉండాలా.. చెత్తగా ఉండాలా మీరే చెప్పండి అని ప్రధాని నరేంద్రమోదీ మథుర వాసులను ప్రశ్నించారు. తన ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా మథురలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి విశేషంగా చెప్పారు. ఆయనేమన్నారంటే.. మన దేశం శుభ్రంగా ఉండాలా.. చెత్తగా ఉండాలా? ఇంటి చుట్టూ చెత్త ఉండటం వల్లే రోగాలు వస్తాయి. దాంతో పిల్లాడు చనిపోతే.. కుటుంబం మొత్తం బాధపడుతుంది ప్రతియేటా ఒక్కో కుటుంబానికి చెత్త వల్ల 7వేలరూపాయల వైద్యఖర్చులు అవుతున్నాయని ప్రపంచబ్యాంకు చెప్పింది అందుకే మనం చెత్తను మన పరిసరాల నుంచి దూరం చేయాలి. 125 కోట్ల మంది దేశవాసులు ఈ ప్రతిజ్ఞ చేయాలి ఈ పని కష్టమే గానీ, ప్రతి ఒక్కరూ చేయాలి. మన భారతమాత చెత్తమయం అయిపోకూడదు. మన గంగామాత, యమునా మాత చెత్తతో నిండిపోకూడదు ఈ పనులన్నీ చేయడానికే వచ్చాం.. చేసి తీరుతాం. అందుకు మీ సహకారం కావాలి, మీ ఆశీస్సులు కావాలి. మా ఆశీస్సులు ఉంటే అన్ని పనులూ చేస్తాం. పేదలకు నివసించడానికి పక్కా ఇళ్లు కావాలా.. వద్దా? వాటిలో కరెంటు, సెప్టిక్ లెట్రిన్లు ఉండాలా.. అక్కర్లేదా? రాబోయే ఏడేళ్లలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇలాంటి సౌకర్యాలతో కూడిన సొంత ఇల్లు ఉండాలని సంకల్పం పెట్టుకున్నాను. -
నేను ప్రధానమంత్రిని కాను.. ప్రధాన సెంట్రీని
-
నేను ప్రధానమంత్రిని కాను.. ప్రధాన సెంట్రీని
తాను ప్రధానమంత్రిని కానని, ఈ దేశానికి ప్రధాన సెంట్రీనని నరేంద్ర మోదీ చెప్పారు. తన ఏడాది పాలన ముగిసిన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని మథురలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.. గడిచిన ఏడాదికాలంలో ఒక్క స్కాం కూడా జరగలేదు 29 బొగ్గు క్షేత్రాలను వేలం వేయడం వల్ల రూ. 3 లక్షల కోట్లువచ్చాయి. గత ప్రభుత్వంలో రూ. 2 లక్షల కోట్ల మేర బొగ్గు స్కాం జరిగింది ఇంతకుముందు బొగ్గు క్షేత్రాలను కారు చవగ్గా ఇచ్చేశారు మా ప్రభుత్వం పేదల కోసమే అంకితం మహాత్మా గాంధీ, రాం మనోహర్ లోహియా, దీనదయాళ్ ఉపాధ్యాయ.. ఈ ముగ్గురే భారత రాజకీయాలను ప్రభావితం చేశారు విచ్చలవిడిగా సాగుతున్న దోపిడీకి నేను అడ్డుకట్ట వేశాను యూపీఏ పాలనాకాలంలో ప్రతిరోజూ ఒక స్కాం జరగలేదా? అవి చెడ్డ రోజులు కావా.. వాళ్లు చేసినవి చెడ్డపనులు కావా? గతంలో దేశాన్ని దోచుకున్నవాళ్లకు ఇక రోజులు మూడాయి. 2014లో ఎన్నికలు జరగకపోతే భారతదేశం మొత్తం దోపిడీకి గురయ్యేది యూపీఏ ప్రభుత్వం అంతా 'రిమోట్ కంట్రోల్' ప్రభుత్వం 12కోట్ల మందికి వాళ్ల బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ అందుతోంది. ఇంతకుముందు కోట్లాది సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముడయ్యేవి.. ఇప్పుడు దానికి అడ్డుకట్ట పడింది. ప్రభుత్వ ఖజానాను దోచుకునే దొంగలకు కాలం చెల్లింది స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా రైతులకు ఆందోళన తప్పడంలేదు వాల్ల భూముల నుంచి రావల్సినంత ఉత్పాదకత రావట్లేదు దాంతో సాయిల్ హెల్త్ కార్డులు ప్రవేశపెట్టి, రాబోయే మూడేళ్లలో దేశంలో ప్రతి ఒక్క రైతుకు వాటిని అందిస్తాం. వాళ్ల భూమికి ఏ సమస్య ఉంది.. ఏ మందు వేయాలన్న విషయాలన్నీ తెలియజేస్తాం. పిల్లలకు ఏమందులు వేయాలి, ఏవి వద్దో డాక్టర్లు చెప్పినట్లే.. భూముల ఆరోగ్యం గురించి కూడా అలాగే చెప్పిస్తాం రాబోయే ఏడేళ్లలో నదుల అనుసంధానం లాంటి ప్రధాన కార్యక్రమాలన్నీ పూర్తిచేస్తాం.