-
మార్ఫింగ్ ఫొటోలతో అశ్లీల చాటింగ్..!
సాక్షి, వరంగల్: సామాజిక మాధ్యమాల నుంచి యువతుల ఫొటోలను సేకరించాక మార్ఫింగ్ చేసి ఆ ఫొటోలతో ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరుస్తున్నాడు.. ఆ ఖాతా ద్వారా యువతులతో చాటింగ్కు దిగేవాడు.. అయితే, అశ్లీలంగా చాటింగ్ చేయకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు... అలా అంగీకరించని ఓ యువతి ఫొటోలను మిత్రులకు పంపించడంతో విషయం బయటపడగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధ్యుడైన ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్టు చేశారు. ధర్మారం వాసి... వరంగల్ రూరల్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి(మైనర్) ఇన్స్టాగ్రాంలోని యువతల ఫొటోలను సేకరిస్తున్నాడు. ఆ తర్వాత అశ్లీలకరమైన ఫొటోతో మార్ఫింగ్ చేసి ఆ ఫొటో ద్వారా నకిలీ ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరిచేవాడు. ఆ ఖాతా ద్వారా తనతో అశ్లీలకరంగా చాటింగ్ చేయాలని.. లేకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను తన కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు. ఈక్రమంలో ఓ యువతిని బెదిరిస్తూనే మార్ఫింగ్ చేసిన ఆమె ఫొటోను కాలేజీకి సంబంధించిన గ్రూప్లో పోస్ట్ చేశాడు. దీంతో ఖంగుతిన్న సదరు యువతి తల్లిదండ్రులు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించి యువతల ఫొటోలను మార్ఫింగ్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని మట్టెవాడ పోలీసుల సహకారంతో బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన నుంచి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఫిర్యాదు అందుకున్న అతితక్కువ సమయంలోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్దన్రెడ్డి, మట్టెవాడ ఇన్స్పెక్టర్ తౌటం గణేష్తో పాటు ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్లు కిషోర్కుమార్, రాజు, దినేష్, ఆంజనేయులు, రత్నాకర్, నరేష్ను సీపీ రవీందర్ అభినందించారు. -
యువతి ఫేక్ నగ్న చిత్రాలు పోస్ట్ చేయడంతో..
చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని యువకుడు చేసిన చిల్లరపనికి ఓ యువతి బలైంది. ఫేస్బుక్లో ఆమె ఫేస్తో నఖిలీ నగ్న చిత్రాలు పోస్ట్ చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. వాస్తవానికి పోలీసులు వేగంగా స్పందించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేదని ఈ ఘటన చూస్తే అర్థం చేసుకోవచ్చు. సాలెం జిల్లాలోని ఎలంపిల్లాయ్కు చెందిన 21 ఏళ్ల యువతి ఇటీవలె కెమిస్ట్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. గత వారం ఆమె స్నేహితులు ఫోన్ చేసి ఫేస్ బుక్లో మార్పింగ్ చేసిన తన నగ్న చిత్రాలు ఉన్నాయని చెప్పడంతో బాధితురాలు తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేసేందుకు పోలీసుకు తండ్రి ఒక కొత్త ఫోన్ కూడా కొన్నాడు. అయినా పట్టించుకోకపోవడంతో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ అదేశాల మేరకు బాలిక ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో ఓ వ్యక్తిని పిలిచి దర్యాప్తు చేశారు. అతడు కాదని నిర్ధారించారు. దీంతో పదిహేను రోజుల్లోగా అతడిని పట్టుకుంటామని హామీ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే, మరోసారి అదే ఫేస్ బుక్ మరో నగ్న ఫొటోను పోస్ట్ చేయడంతోపాటు ఆమె తండ్రి ఫోన్ నెంబర్ కూడా పెట్టారు. దీంతో భరించలేని ఆ బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ఆమె తండ్రి స్పందిస్తూ పోలీసులు వేగంగా స్పందించి ఉంటే తన కూతురు బతికి ఉండేదని బోరుమన్నాడు. నిందితుడిని అరెస్టు చేసే వరకు తమ కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లబోమని ధర్నాకు దిగారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement