breaking news
March to Parliament
-
‘మార్చ్ టు పార్లమెంట్’ లో టీఎస్యూటీఎఫ్ సభ్యులు
మెదక్ మున్సిపాలిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ‘‘మార్చ్ టు పార్లమెంట్’’ కార్యక్రమంలో తెలంగాణ యూటీఎఫ్ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ఎస్టీఎఫ్ఐ అనుబంధ సంఘాల ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నట్లు యూటీఎఫ్ మెదక్ కోశాధికారి ఎన్.సుధాకర్ తెలిపారు. సీపీఎస్ రద్దుపై తమ నినాదాలన్ని గట్టిగా వినిపించినట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణ వెరుు్య మంది, ఏపీ నుండి 3వేల మంది పాల్గొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి, మెదక్ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్రావు, ప్రధాన కార్యదర్శి పద్మారావు, అజయ్, రాందాస్, మల్లేశం, సుధాకర్, ఫయాజ్, రవీందర్రెడ్డి, బీమ్లా, హరిబాబు, తిరుపతి, కృష్ణ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. -
నేడు ఏఐబీఓసీమార్చ్ టు పార్లమెంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకుల కన్సాలిడేషన్ (ఏకీకరణ), ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) నేడు ‘మార్చ్ టు పార్లమెంట్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగమైన బాం్యకింగ్ వ్యవస్థలో పెట్టుబడిదారులు, ఎఫ్డీఐ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నిరసనను చేపట్టనున్నామని ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ హర్విందర్ సింగ్ చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో 10 వేల మందికిపైగా పాల్గొంటారన్నారు.