Maduro
-
అమెరికాతో యుద్ధానికి సిద్ధం
మా దేశాన్ని చుట్టుముట్టి నిర్బంధిస్తే అమెరికాతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హెచ్చరించారు. యుద్ధానికి తమ సేనలను సమాయత్తం చేస్తున్నామని ప్రకటించారు. అమెరికా చట్ట వ్యతిరేకమైన బెదిరింపులపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ వెనెజులా వ్యవహారంలో రష్యా, చైనా, ఇరాన్, క్యూబాల జోక్యాన్ని తాము సహించమని, అందుచేతనే ఆ దేశాన్ని దిగ్బంధించే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై మదురో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా బెదిరింపులు చూస్తుంటే ఆ దేశం తీవ్ర నిరాశ, చికాకులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా అమెరికా ఏ సైనిక చర్య తీసుకున్నా తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. ‘నేర సామ్రాజ్యవాద దేశానికి నేనిచ్చే సందేశం ఇదే. ఎవరైనా మమ్మల్ని ముట్టడిస్తే యుద్ధానికి సిద్ధం కావడానికి మేం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వారు మాపై ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా మేం మరింత స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తాం’ అని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే అమెరికా వెనెజులాపై అనేక రకాల ఆంక్షలు విధించింది. దేశాధ్యక్షుడిగా ప్రతిపక్ష నేత యువాన్ గ్వాయిడోను గుర్తిస్తున్నామని అమెరికా దాని మిత్ర పక్షాలు ప్రకటించడమే గాక మదురోను తొలగించడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. దీని ఫలితంగానే గత కొంతకాలంగా అధ్యక్ష కార్యాలయాన్ని గ్వాయిడో అనుచరులు స్వాధీనం చేసుకోవాలని చూస్తుండటంతో ప్రస్తుతం వెనెజులాలో ఘర్షణ వాతావారణం నెలకొంది. -
వెనిజులాలో నోట్ల రద్దు నిర్ణయం వాయిదా
-
వెనిజులాలో ఆందోళనలు, లూటీలు
నోట్ల రద్దు ఎఫెక్ట్ కారకస్: వెనిజులాలో పెద్ద నోట్ల రద్దు, కొత్త నోట్ల సరఫరాలో జాప్యంతో ప్రజల కష్టాలు తారస్థాయికి చేరాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి బతకలేక కన్నబిడ్డలను వదిలేస్తున్న దారుణ పరిస్థితుల్లో నోట్ల రద్దు ప్రజల జీవితాలను మరింత అగాథంలోకి నెట్టింది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తూ వెనిజులా అధ్యక్షుడు మదురో గత ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. అయితే పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు రాక, తినడానికి తిండి లేక ప్రజలు డెలివరీ ట్రక్కులను దోచుకుంటుంటూ పోలీసులతో గొడవలకు దిగుతూ రెచ్చిపోతున్నారు. క్రిస్మస్ వస్తున్న తరుణంలో కనీసం ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి కూడా చేతిలో చిల్లర లేక శుక్రవారం ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. మరకైబో నగరంలో పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లురువ్వారు. (చదవండి: మోదీ బాటలోనే వెనిజులా.. పెద్ద నోట్ల రద్దు) మటురిన్ నగరంలో చికెన్ ట్రక్కును లూటీ చేశారు. పుయెర్టో లా క్రజ్ నగరంలో డబ్బులు తీసుకోడానకి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఆందోళనకు దిగారు. శాంటా బార్బరాలో బ్యాంకు నగదును తీసుకెళ్తున్న ట్రక్కును కొంతమంది దోచుకోవడానికి ప్రయత్నించగా డ్రైవర్లు కాల్పులు జరపడంతో నలుగురికి గాయాలయ్యాయి. వెనిజులా రిజర్వు బ్యాంకులో మాత్రమే 100 బొలివర్ నోట్లను మార్చుకునే వీలుండటంతో బ్యాంకు ముందు వేలమంది క్యూలో నిలబడుతున్నారు. పాతనోట్లను తీసుకొని ’ప్రత్యేక ఓచర్లు’ ఇస్తున్నారే తప్ప కొత్త నోట్లు ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.