breaking news
M S Narayana
-
అంపశయ్యపై MS నారాయణ.. చివరి క్షణాల్లో ఏం జరిగిందంటే?: బ్రహ్మానందం
కమెడియన్స్ చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకుంటాం. అయితే కొందరు హాస్యనటులు సినిమా తర్వాత కూడా మనల్ని వెంటాడుతూ ఉంటారు. వారి డైలాగులు, అవాక్కులు-చవాక్కులు, హావభావాలు గుర్తు చేసుకుని మనలో మనం కాసేపు నవ్వుకుంటూ ఉంటాం. అలా తెలుగువారి మనసులో చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ హాస్యనటుల్లో ఎమ్మెస్ నారాయణ (MS Narayana) ఒకరు. ఈయనకు హాస్య బ్రహ్మ, మీమ్ గాడ్ బ్రహ్మానందానికి మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది.చివరి స్టేజీలో నాకోసం పరితపించాడుతాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం (Brahmanandam).. ఎమ్మెస్ నారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎమ్మెస్ నారాయణ మంచానపడి అంతిమ ఘడియలకు దగ్గరవుతున్నప్పుడు ఆయన మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తనకు ఎంతోమంది తెలుసు. రక్తసంబంధాలు, స్నేహసంబంధాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే చివరి స్టేజీలో ఉన్నప్పుడు నన్ను చూడాలనుకున్నాడు. నన్నెలాగైనా కలుసుకోవాలనుకున్నాడు.చెప్పాపెట్టకుండా వెళ్లిపోయా..మాట్లాడలేని స్థితిలో ఉన్న నారాయణ.. అతడి కూతుర్ని పిలిచి తెల్లకాగితం అడిగాడు. దానిపై బ్రహ్మానందం అన్నయ్యను చూడాలనుంది అని రాశాడు. అది చదివిన అమ్మాయి నాకు వెంటనే ఫోన్ చేసింది. అప్పుడు నేను గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' సినిమా షూటింగ్లో ఉన్నాను. శంషాబాద్లో షూటింగ్.. సడన్గా నేను వెళ్లాలి అని చెప్తే దర్శకుడు ఒప్పుకోకపోతే? ఎలా అన్న సంకోచం.. అందుకే ఎవరికి చెప్పకుండా నేరుగా కారెక్కి వెళ్లిపోయాను.అదే ఆఖరి రోజునన్ను చూడగానే అంపశయ్యపై పడుకున్న ఎమ్మెస్ నారాయణ కళ్ల వెంట నీళ్లు కారాయి. అది ఎన్నటికీ మర్చిపోలేను. నన్ను చూసి నా చేయి గట్టిగా పట్టుకుని వదిలేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి మళ్లీ కళ్లు తెరిచాడు. డబ్బు గురించి ఆలోచించొద్దని, ఎంతైనా పర్వాలేదు, నా మిత్రుడిని బతికించండని డాక్టర్స్ను కోరాను. ఇప్పటికీ మింగుడుపడదుషూటింగ్ మధ్యలో వచ్చేశానని, మళ్లీ వీలు చూసుకుని వస్తానని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాను. తిరిగి షూటింగ్కు వెళ్తుండగా మార్గమధ్యలోనే ఆయన మరణించారన్న వార్త వచ్చింది. అంతటి మేధావి తక్కువ వయసులో మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం నాకిప్పటికీ మింగుడుపడదు అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఎమ్మెస్ నారాయణ (63).. 2015 జనవరి 23న అనారోగ్యంతో మరణించారు.చదవండి: 'ఛావా' ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే? -
బ్రేక్ ఫాస్ట్ షో : నవ్వుల నారాయణ
-
జగన్నాయకుడు మూవీ స్టిల్స్
-
క్రేజీవాలాగా ఎమ్మెస్ నారాయణ
అనుకరించడంలో ఎమ్మెస్ నారాయణ కింగ్. ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోలందర్నీ అనుకరించేశారాయన. ఇప్పుడు ఎమ్మెస్ కన్ను రాజకీయ నాయకులపై పడ్డట్టుంది. సంచలన రాజకీయ నాయకుడు క్రేజీవాలాను గుర్తు చేస్తూ ‘క్రేజీవాలా’గా కనిపించబోతున్నారు. ఎమ్మెస్ ఫస్ట్టైమ్ హీరోగా నటిస్తున్న ‘క్రేజీవాలా’ చిత్రం ద్వారా మోహనప్రసాద్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జి.విజయకుమార్ గౌడ్ నిర్మాత. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి పరుచూరి గోపాలకృష్ణ దంపతులు కెమెరా స్విచాన్ చేయగా, డా.డి.రామానాయుడు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రాజ్యాంగం అంటే ఏంటి? అది ఏ ఉద్దేశంతో ఉంది? దాన్ని ఎలా ఉపయోగిస్తే పాలన సక్రమంగా ఉంటుంది? ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎలాంటి మార్పు రావాలి? అనే అంశాలను ఇందులో చర్చించనున్నాం. నిజాయితీతో చేస్తున్న దేశభక్తి సినిమా ఇది. ఇందులో విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు ఉండవు’’ అని చెప్పారు. ఎమ్మెస్ మాట్లాడుతూ -‘‘వర్తమాన సమస్యలతో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. సమస్య, పరిష్కారం.. రెండూ ఇందులో ఉంటాయి’’ అన్నారు. క్రేజీ థాట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నిర్మాతకు కాసుల వర్షం కురిపించాలని పరుచూరి గోపాలకృష్ణ ఆకాంక్షించారు. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని, ఏప్రిల్ మూడోవారంలో సినిమా విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: భరణి కె.ధరణ్, సంగీతం: సునిల్ కశ్యప్, కళ: కృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాలాజీ శ్రీను.