breaking news
love rejected
-
కృష్ణాజిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లి, ముగ్గురు కూతుళ్లపై కత్తితో దాడి..
కృష్ణా: తన ప్రేమని తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపైనా విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా మొవ్వ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్ఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. మొవ్వ అంబేద్కర్ నగర్కు చెందిన బల్లారపు నాగరాజ్యంకు ముగ్గురు కుమార్తెలు. భర్త నాగేశ్వరరావు 2013లో మృతి చెందాడు. 22 ఏళ్ల పెద్ద కుమార్తెను అదే కాలనీకి చెందిన నాగదేసి జోయల్ సంవత్సర కాలంగా ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఆమె తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో గురువారం రాత్రి కత్తి తీసుకుని యువతి ఇంటికి వచ్చాడు. ముందుగా ఇంటి బయట ఉన్న ఆమె చిన్న సోదరిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లోకి చొరబడి తల్లి, మరో సోదరిపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితుల కేకలు విని ఇరుగుపొరుగు రావడంతో జోయల్ పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాధిత కుటుంబాన్ని స్థానికులు హుటాహుటిన మొవ్వ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడు అరెస్టు పామర్రు: తనను ప్రేమించలేదనే కక్షతో యువతిని ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసిన నిందితుడు జోయల్ను అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచామని గుడివాడ డీఎస్పీ సత్యానంద్ పేర్కొన్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిపై కూచిపూడి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. కూచిపూడి ఎస్ఐ కె.దుర్గాప్రసాద్ బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వారి స్టేట్మెంట్ రికార్డు చేశారని చెప్పారు. మొవ్వ జేఎఫ్సీఎం, కోర్టు వారి వద్ద రిమాండ్ నిమిత్తం హాజరు పరిరామన్నారు. -
నడిరోడ్డుపై విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది
-
ప్రేమించలేదని బాలికపై గ్యాంగ్ రేప్!
హైదరాబాద్: పాతబస్తీలో 14ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్ జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన మహబూబ్ అనే యువకుడు హఫీజ్బాబానగర్లోని తన ఇంట్లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితులైన షకీల్, ఇక్బాల్, బషీర్లతో కలిసి వారంరోజులపాటు అత్యాచారం చేసి బాలికను శారీరకంగా హింసించారు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. అనంతరం బాలికను బాలానగర్లోని ఆమె బంధువుల ఇంటి దగ్గర వదిలి పరారయ్యారు. బాలిక ఇంట్లోకి వెళ్లకముందే షాద్నగర్కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యం చేశారు. కూతురు ఆచూకీ తెలియక కంగారుపడిన తల్లిదండ్రులు.. విషయం తెలుసుకుని చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వైద్యచికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.