breaking news
love reject
-
ప్రేమ.. పెళ్లికి తల్లి అడ్డు చెప్పిందని..
దహెగాం: ప్రేమ..పెళ్లి వద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఒక బాలిక ఆత్మహత్య చేసు కుంది. కుమురంభీం జిల్లా దహె గాం మండలం రాళ్లగూడ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ సనత్కుమార్ కథనం ప్రకారం.. రాళ్ల గూడ కు చెందిన నాగపురి స్వరూపకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. భర్త మోహన్ చనిపోయాడు. చిన్నకూతురు శిరీష(16) ఇంటర్ ఫెయిల్ కావడంతో ఇంటివద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన యువకుడిని 8 నెలలుగా ప్రేమిస్తోంది. ఈ విషయం తల్లికి తెలియడంతో ఇప్పుడే ప్రేమ, పెళ్లి ఏంటని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష బుధవారం వేకువజామున ఇంటి వెనకాల పురుగు మందు తాగింది. వెంటనే శిరీషను తల్లి కాగజ్నగర్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. మృతు రాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ప్రేమించలేదని యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిని కారుతో ఢీకొట్టి..
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. భాస్కర్ అనే యువకుడు కొంతకాలంగా మైథిలి అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే వరుసకు అన్న కావడంతో భాస్కర్ ప్రేమను యువతి నిరాకరించింది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో స్కూటీపై వెళుతున్న మైథిలిని కారుతో ఢీకొట్టాడు భాస్కర్. కంబదూరు మండలం బోయలపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో యువతి మైథిలికి తీవ్ర గాయాలవ్వగా అసుపత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఓ వైపు భర్త చావు బతుకుల మధ్య.. మరోవైపు రోడ్డు ప్రమాదంలో భార్య మృతి -
నడిరోడ్డుపై విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది
-
విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
సాయంత్రం.. సమయం.. 5 గంటలు.. కళాశాల విడిచిపెట్టారు.. మిగిలిన విద్యార్థులతోపాటు ఆ అమ్మాయి కళాశాల నుంచి బయటకు వచ్చి ఇంటివైపు అడుగులు వేస్తోంది. ఇంతలో హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువకుడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. అంతే ఆ ఆమ్మాయి రోడ్డుపైనే కుప్పకూలింది. పట్టణ నడిబొడ్డున.. సినిమాహాలు, పెట్రోల్ బంక్, కళాశాల.. అన్నీ ఉన్న రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారి అలజడి రేగింది. అరుపులు, ఆర్తానాదాలతో దద్దిరిల్లింది. ఈ దారుణం ప్రశాంతతకు మారుపేరైన అనకాపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. సాక్షి, విశాఖపట్నం : అనకాపల్లిలోని రైల్వేస్టేషన్కు సమీపంలో ఉన్న భీమునిగుమ్మానికి చెందిన కె.సాయి పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అదే ప్రాంతానికి చెందిన పి.యశోధభార్గవి పట్టణంలోని డీవీఎన్ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. భార్గవిని సాయి గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి విషయం పెద్దలకు తెలియడంతో రెండు కుటుంబాలకు చెందిన వారు పెద్దల సమక్షంలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. భార్గవి మైనర్ కావడంతో పెళ్లిని వాయిదా వేసినట్లుగా అక్కడివారు చెబుతున్నారు. ఈలోగా గత ఆరునెలలు నుంచి సాయి తాను ప్రేమించిన భార్గవితో ఘర్షణకు దిగేవాడని తెలిసింది. దీనికి ప్రధాన కారణం భార్గవి మరో వ్యక్తితో చనువుగా ఉండడమే. ఇదే విషయమై ఆమెను తరచూ నిలదీసేవాడు. అయినప్పటికీ మూడో వ్యక్తితో ఆమె చనువుగా ఉండడాన్ని తట్టుకోలేని సాయి ఉన్మాదిగా మారాడు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కళాశాల నుంచి వస్తున్న భార్గవిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. కూరగాయల కోసే కత్తి పట్టుకొని భార్గవి మెడపైన, పక్కటెములకులపైన పొడవడంతో కుప్పకూలిపోయింది. ఈ సంఘటన స్వయంగా భార్గవి తాతకు సంబంధించిన పాన్షాపు ఎదురుగా జరగడంతో ఆయన షాక్కు గురయ్యాడు. సంఘటన జరిగిన కొద్ది క్షణాలకే అక్కడ గుమిగూడిన జనమంతా సాయిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ ఎస్సై చక్రధర్, స్వీటీ, సావిత్రి, ట్రాఫిక్ ఎస్సై స్వామినాయుడు సంఘటనా స్థలానికి వచ్చి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. అంతేకాకుండా భార్గవిపై సాయి దాడి చేసిన సమయంలో రెండు కుటుంబాలకు చెందిన కొందరు అదే దుకాణం వద్ద ఉండడం గమనార్హం. సాయిని అనకాపల్లి పోలీస్స్టేషన్కు తరలించి ఎస్సై చక్రధర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును ప్రారంభించారు. భార్గవిని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. ఈ దాడితో తీవ్రశోకంలోకి మునిగిపోయిన భార్గవి తల్లి నూకరత్నం కన్నీరుమున్నీరవుతూ పడిపోయింది. ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దల సమక్షంలో నిర్ణయించామని, ముక్కపచ్చలారని తన కుమార్తెపై దాడి చేసిన సాయిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఒక్కసారిగా ఈ ఘటనతో అనకాపల్లి ప్రాంతం ఉలిక్కిపడింది. ఈ సమాచారం జిల్లా మొత్తం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రశాంతమైన అనకాపల్లి పట్టణంలో ఈతరహా సంఘటన ఎప్పుడూ చూడలేదని పురపెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. సాయి తండ్రి శ్రీను అనకాపల్లి శారదానదికి ఆనుకొని ఉన్న శ్మశానవాటిక కాపరిగా పని చేస్తున్నాడు. యశోధ భార్గవి తండ్రి కృష్ణ కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి ఉమా నూకరత్నం గృహిణి. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరి మధ్య జరిగిన ప్రేమాయణం ఇంతటి విషాదఘటనకు దారితీయడం పట్ల భీమునిగుమ్మం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు మహిళా సంఘాలు ఈ ఘటనను ఖండిస్తూ సాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన భార్గవికి ప్రథమచికిత్స చేసిన అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలించారు. నివేదిక కోరిన ఏయూ వీసీ ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): విద్యార్థినిపై అనకాపల్లిలో జరిగిన దాడి ఘటనపై ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నివేదిక కోరారు. డీవీఎన్ కళాశాల విద్యార్థినిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జరిగిన సంఘటనపై సత్వరమే తనకు నివేదిక అందించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. విద్యార్థినుల రక్షణకు, భద్రతకు ప్రాధాన్యమిస్తామన్నారు. త్వరలో వర్సిటీ అనుబంధ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి తగిన మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. మరోవైపు వీసీ ఆదేశాల మేరకు వర్సిటీ రెక్టార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ డీవీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రమేష్తో మాట్లాడారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కళాశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో సంఘటన జరిగిందని, విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడిందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్కు రిజిస్ట్రార్ సూచించారు. పెళ్లికి నిరాకరించడంతోనే ఈ దుశ్చర్య? ఒకే ప్రాంతం, ఒకే సామాజికవర్గానికి చెందిన సాయి, భార్గవిలకు పెద్దల సమక్షంలో పెళ్లి చేయాలని కొద్ది నెలలు క్రితం నిర్ణయించారు. నెల క్రితం సాయి సోదరికి వివాహం కూడా జరిగింది. అయితే భార్గవి అదే ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తితో చనువుగా ఉంటుందని భావించి అనుమానంతో సాయి గాయాలపాలైన భార్గవిని నిలదీసేవాడు. ఇలా వీరిద్దరి మధ్య తరచూ వివాదం జరగడంతో నెలరోజుల క్రితం భార్గవి కుటుంబీకులు సాయి ఇంటికి వెళ్లి మీ అబ్బాయి మా అమ్మాయిని వేధిస్తున్నందున పెళ్లి వాయిదా వెద్దామని చెప్పినట్లుగా సమాచారం. దీంతో మరింత మానసిక ఉన్మాదానికి గురైన సాయి గత కొద్దిరోజుల నుంచి భార్గవితో వాదులాటకు దిగేవాడు. ఇక మానసికమైన ఉద్వేగానికి గురై ప్రేమోన్మాదిగా మారిన సాయి తట్టుకోలేక భార్గవిపై కత్తితో దాడి చేశాడు. సాయిపై 307, 506, 509 సెక్షన్లు నమోదు యువతి భార్గవిపై హత్యాయత్నానికి పాల్పడిన సాయిపై 307, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై చక్రధరరావు పేర్కొన్నారు. కేజీహెచ్కు భార్గవి భార్గవికి మెడపై, పక్కటెముకుల్లో కత్తిపోట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించాం. ప్రాణానికి ఎటువంటి హానీ లేదు. – జగన్మోహనరావు, ఎన్టీఆర్ వైద్యాలయం సూపరింటెండెంట్ ఎంతటి వారైనా కఠిన చర్యలు ప్రశాంతమైన అనకాపల్లి పట్టణంలో ఎప్పుడు ఇటువంటి దారుణ ఘటనలు జరగలేదు. ఈ హత్యాయత్నం కేసులో నిందితుడు ఎంతటివారైనా కఠిన శిక్ష తప్పదు. గాయపడిన బాలికకు తగిన వైద్య చికిత్స అందిస్తాం. భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. –గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే ఎంత ఘోరం చేశాడు మా కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న సాయి ఇంత ఘోరానికి పాల్ప డతాడని అనుకోలేదు. వీరిద్దరికీ పెళ్లి చేద్దామని రెండు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో నిర్ణయించాం. ఇంతలోనే దాడికి తెగబడిన సాయిని కఠినంగా శిక్షించాలి. సాయిపై 307, 506, 509 సెక్షన్లు నమోదు యువతి భార్గవిపై హత్యాయత్నానికి పాల్పడిన సాయిపై 307, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై చక్రధరరావు పేర్కొన్నారు. కేజీహెచ్కు భార్గవి భార్గవికి మెడపై, పక్కటెముకుల్లో కత్తిపోట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించాం. ప్రాణానికి ఎటువంటి హానీ లేదు. – జగన్మోహనరావు, ఎన్టీఆర్ వైద్యాలయం సూపరింటెండెంట్ -
ప్రేమించలేదని.. బావిలో నెట్టేశాడు!
శృంగవరపుకోట :తన ను ప్రేమించకుంటే చంపేస్తానం టూ యువతిని ఓవ్యక్తి బావిలో తోసి పరారయ్యూడు. స్థానికుల అప్రమత్తం కావడంతో బయటపడిన ఆమె.. ఎస్.కోట పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆమె ఫిర్యాదు లో పేర్కొన్న మేరకు వివరాలిలా ఉన్నాయి. లక్కవరపుకోట మండలంకొట్యాడగ్రామానికి చెందిన యువతి కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం మధ్యాహ్నం అదేగ్రామంలో కోటమ్మ అమ్మవారిఆలయానికి వెళ్లిం ది. అదే సమయంలోకొట్యాడ గ్రామానికే చెందిన రొం గలి కృష్ణ అక్కడకువచ్చాడు. యువతితో కాసేపు మా ట్లాడాడు. ఇద్దరూ ఒకేఊరి వారుకావడంతో ఎవరూ ఆ విషయూన్ని పెద్దగా పట్టించుకోలేదు. కుటుంబ సభ్యు లు కూడాచూసిఊరుకున్నారు. అప్పటి వరకూ కుటుం బసభ్యులఎదుటే మాట్లాడినకృష్ణ.. ఒక్కసారిగా యువ తిని సమీపంలోని బావిలోకి నెట్టి, పారిపోయూడు. ఊహించని పరిణామంతో నివ్వెరపోయిన కుటుంబ సభ్యులు.. పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి యువతిని బయటకు తీశారు. బావిలో నీరు లేకపోవటంతో యువతి స్వల్ప గాయూలతో బయటపడింది. మంగళవారం రాత్రి ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొట్యాడ గ్రామానికి చెందిన రొంగలి కృష్ణ.. కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు పెళ్లి సంబంధం కుదిరిందని, తన వెంట పడొద్దని ప్రాధేయపడినా వినిపించుకోలేదని తెలిపింది. తన అంతు చూస్తానంటూ నూతిలో తోసేశాడని పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు ఎస్.కోట ఎస్సై ఎస్.కె.ఎస్.ఘనీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.