-
ఎల్టీసీతో ఇక విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) సదుపాయాన్ని ఇకపై విదేశీ పర్యటనలకు కూడా వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సిబ్బంది, శిక్షణా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. దీనిపై అభిప్రాయం తెలపాలని హోం, పర్యాటక, పౌర విమానయాన తదితర మంత్రిత్వ శాఖలను కోరింది. విదేశాంగ శాఖ రూపొందించిన ఈ ప్రణాళికలో భాగంగా కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉబ్జెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ దేశాల్లో పర్యటించే ఉద్యోగులు ఎల్టీసీ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వ్యూహాత్మకంగా కీలకమైన తూర్పు ఆసియాలో భారత పర్యాటకుల సంఖ్యను పెంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎల్టీసీ కింద సెలవు ఇవ్వడంతో పాటు విమాన ప్రయాణ చార్జీలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. సార్క్ దేశాల్లో పర్యటించే ఉద్యోగులకు ఎల్టీసీని వర్తింపజేసే ప్రతిపాదనను కేంద్రం మార్చిలో వాయిదావేసిన సంగతి తెలిసిందే. -
ఊరు దాటకుండానే ఊడ్చేశారు!
కాగజ్నగర్ రూరల్ : విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడుతున్నారు. వచ్చే వేతనం సరిపోవడం లేదో.. ప్రభుత్వ సొమ్మేకదా పోయేదేముంది అనుకున్నారో.. కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడ్డారు. 2010-11 సంవత్సరంలో జిల్లాలోని 38 మండలాలకు చెందిన 2,525మంది ఉపాధ్యాయులు ప్రయాణాలు చేయకుండానే లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ), హోం టౌన్ పేరిట సుమారు రూ.2,02,23,127 స్వాహా చేశారు. ఈ విషయాన్ని గతంలో సాక్షి ప్రచురించిన విషయం తెలిసిందే. సమాచార హక్కు చట్టం ద్వారా 2010-11 హోంటౌన్ నిధులు పొందిన ఉపాధ్యాయుల వివరాలను కోరుతూ పట్టణానికి చెందిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు అశ్రాఫ్ దరఖాస్తు చేసుకోగా వివరాలు వెల్లడయ్యాయి. గతంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి నివేది క అందించారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు సంబంధిత ఉపాధ్యాయుల నుంచి నిధులు రికవరీ చేయాలని నోటీసులు జారీ చేసింది. తాజాగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఉపాధ్యాయుల జూలై మాసం వేతనాల నుంచి నిధులు రికవరీ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణం చేయకుండానే బోగస్ బిల్లులు సమర్పించి అక్రమంగా పొందిన భత్యాన్ని ఉపాధ్యాయుల వేతనాల నుంచి 10 శాతం వడ్డీతో కోత, ఇంక్రిమెంట్ల నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు జిల్లా విద్యాధికారి నుంచి ఆయా మండలాల ఎంఈవోలకు ఉత్వర్వుల కాపీలు అందాయి. ఉపాధ్యాయుల నిర్వాకం ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ సొంత ఊళ్లకు కుటుంబీ కులతో కలిసి వెళ్లేందుకు లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ)ని మంజూరు చేస్తారు. జీవో నంబర్ 40ప్రకారం ఎల్టీసీ కింద నాలుగేళ్లకోమారు విహారయాత్రలకు, రెండేళ్లకోమారు హోంటౌన్ కింద ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లివచ్చేందుకు వెసులుబాటు ఉంది. దీనిపై పూర్తిస్థాయి అధికారాలు ఎంఈవో, ప్రధానోపాధ్యాలకు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకు న్న ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు బోగస్ ప్రయాణ భత్యానికి తెరలేపారు. నిబంధనల ప్రకారం ప్రయాణానికి వెళ్లే ముందు 80 శాతం అడ్వాన్స్గా అందించాల్సి ఉంటుంది. బిల్లులు సమర్పించిన అనంతరం 20 శాతం మంజూరు చేయాల్సి ఉంటుంది. విద్యాశాఖ కల్పించిన ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని కొందరు ఎంఈవోలు, ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడ్డారు. అందరిదీ ఇచ్చాపురమేనా? సిర్పూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల ఉపాధ్యాయులందరి పూర్వికులదీ శ్రీకాకులం జిల్లా ఇచ్చాపురమేనట. ఇది వినడానికి వింతగానే ఉన్నా ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇది వాస్తవం. ఎందుకంటే హోంటౌన్ పేరిట నియోజకవర్గంలోని సుమారు 200 మంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురమే వెళ్లి వచ్చారట. తమ పూర్వీకుల గ్రామం ఇచ్చాపురం అని చూపెడుతూ వారు బస్సు టికెట్లను కూడా పొందుపరిచి నిధులను స్వాహా చేశారు. ఇందులో మరో వింత ఏంటంటే ఈజ్గాం బెంగాళీ క్యాంపులోని ఉపాధ్యాయులంతా బెంగాళీలే. వీరు కూడా ఇచ్చాపురం తమ పూర్వీకుల గ్రామం అంటూ బిల్లులు పొందారు. బెంగాళీ క్యాంపులోని బెంగాళీలు 1972లో పశ్చిమబెంగాల్ నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వీరి కోసం అప్పట్లోనే ప్రభుత్వం ప్రత్యే క రాయితీల ద్వారా బెంగాళీ మీడియం పాఠశాలలను నెలకొల్పి బెంగాళీలనే ఉపాధ్యాయులుగా నియమిం చింది. వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వీకులు ఉండే అవకాశం లేదు. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోశిస్తూ, ఉపాధ్యాయ సంఘాల పేరు చెప్పుకునే పలువురు ఉపాధ్యాయులు తాము తెలంగాణ వాళ్లం కాదు.. ఆంధ్రావాళ్లం అంటూ ఇచ్చాపురం మా పూర్వీకుల గ్రా మం అని బిల్లులు పొందారు. ఈ విషయం కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తెలిసినా బిల్లుల మం జూరు ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోని అనేక మంది ఉపాధ్యాయులు అనేక ప్రదేశాలకు వెళ్లి వచ్చినట్లు బిల్లులు పొందారు. అక్రమాలకు పాల్పడినందుకు విద్యాశాఖ నిధులు రికవరీ చేస్తోంది. -
ఉపాధ్యాయుల్లో ‘ఎల్టీసీ’ గుబులు
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్లైన్ : ప్రభుత్వం కల్పించిన ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్షెషన్) సుదుపాయాన్ని దుర్వినియోగపరచి జేబులు నింపుకున్న ఉపాధ్యాయుల నుంచి సొమ్ము రికవరీకి గడువు సమీపిస్తుండడంతో అటు అధికారుల్లో, ఇటు ఉపాధ్యాయుల్లోనూ టెన్షన్ మొదలైంది. జిల్లాలో 2008 సంతవ్సరంలో ఎల్టీసీ కింద జిల్లాలో 1900 మంది ఉపాధ్యాయులు దొంగ బిల్లులు పెట్టి ఏకంగా రూ. కోటి 33 లక్షలు దండుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం వెలుగుచూడడంతో ఆడిట్ జనరల్ జిల్లా వ్యాప్తంగా విచారణ చేయించింది. 2012 డిసెంబరు నుంచి బోగస్ టికెట్లతో ఎల్టీసీ లబ్ధిపొందిన ఉపాధ్యాయుల వివరాలను పంపి, వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని ఏజీ నేరుగా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. ఇప్పటిదాకా సుమారు 600 మంది ఉపాధ్యాయుల నుంచి రికవరీ చేశారు. స్వాహా చేసిన డబ్బు తిరిగి చెల్లించారంటే తప్పుచేసినట్లు అంగీకరించినట్టేనని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. బిల్లులు మంజూరు చేసిన ఎంఈఓలపై కూడా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు రెండు నెలల గడువు ఇస్తూ రికవరితోపాటు బాధ్యులపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారో వివరించాలని విద్యాశాఖను ఆదేశించింది. ఇప్పటికే దాదాపు నెల గడిచింది. కేవలం నెల రోజులు మాత్రమే ఉండడంతో విద్యాశాఖ అధికారులు ఆఘమేఘాలపై సమావేశాలు నిర్వహిస్తూ సొమ్ము రికవరీ చేయిస్తున్నారు. అప్పట్లో ఎల్టీసీ మంజూరుకు బిల్లులో సుమారు 25 శాతం దాకా ఖర్చు చేసుకున్న ఉపాధ్యాయులు ప్రస్తుతం మొత్తం బిల్లు వెనక్కు చెల్లిస్తుండడం గమనార్హం. పైగా రికవరీ తర్వాత ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారోనని ఉపాధ్యాయుల్లో టెన్షన్ మొదలైంది. ఈ భాగోతంలో ఉపాధ్యాయులతోపాటు కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement