breaking news
land pass books
-
పైసలిస్తేనే పాస్బుక్
నర్సంపేట: ఈ సంఘటన మరువకముందే నర్సంపేట డివిజన్ పరిధిలోని ఓ మండల తహసీల్దార్ తతంగం బయట పడింది. ధరణి వెబ్సైట్ ద్వారా రైతులకు పట్టాదార్ పుస్తకాలు ఇవ్వాలంటే పైసలు ముట్టాల్సిందేనని, తనకు ప్రతిరోజు మండల వీఆర్వోలంతా కలసి రోజుకు 10 వేలు ముట్టజెప్పాలని హూకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో బెంబేలెత్తిన వీఆర్వోలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వద్దకు చేరుకుని గోడు వెల్లబోసుకున్నారు. అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. రైతుల భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులందరికీ ఉచితంగా పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల క్రితం బృహత్తర పథకాన్ని తీసుకువచ్చారు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. ఎన్నికలు ముగిశాయి. గ్రామాల్లో ఇంకా చాలా మంది రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించాల్సి ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అందరికి పట్టాలు ఇవ్వడం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి రెండు నెలలవుతోంది. పట్టాలు లేని రైతులంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా భావించి సదరు తహసీల్దార్ రోజువారీగా రూ.10వేలు ఇచ్చి పనులు చేయించుకోండని గత కొన్ని రోజులుగా వీఆర్వోలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అటు రైతులను డబ్బులు అడగలేక.. ఇటూ తహసీల్దార్కు ఇవ్వలేక.. వీఆర్వోలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే మండలంలోని కొన్ని గ్రామాల రైతులు నేరుగా అనేకసార్లు గ్రీవెన్స్లో కలెక్టర్కు విన్నవించారు. కార్యాలయం ఎదుట రాస్తారోకోలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు సైతం ట్విట్టర్ ద్వారా ఓ రైతు పోస్టు చేసినట్లు తెలిసింది. అయినా ఫలితం లేదు.. ఇదిలా ఉండగా సదరు తహసీల్దార్ తన సొంతంగా గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకుని డబ్బులు ఇ చ్చిన వారి ఫైళ్లు మాత్రమే క్లియర్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. రైతులకు ఎలాంటి డబ్బులు లేకుండా పట్టా పుస్తకాలు ఇవ్వాలని ము ఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పినా రెవెన్యూ అధికా రుల తీరులో మార్పు రాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి లంచాలు తీసుకునే అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు సకాలంలో ధరణి వెబ్సైట్ ద్వారా పాస్బుక్లు అందించాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం.. పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నరన్న విషయం ఇప్పటికయితే నా దృష్టికి రాలేదు. రాత పూర్వకంగా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి వెబ్సైట్ ద్వార పట్టా పుస్తకాలు అందించే క్రమంలో ఎలాంటి అవినీతికి తావులేదు. అవినీతి జరిగితే సహించేది లేదు.. – రవి, నర్సంపేట, ఆర్డీఓ -
జాగీరు భూముల పాస్ పుస్తకాలు రద్దు
ఆర్వోఆర్ చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ సిద్ధం - నేటి కేబినెట్ భేటీలో ఆమోదం సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల తరహాలో జాగీరు భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్వోఆర్ (రికార్డ్స్ ఆఫ్ రైట్స్) చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తెచ్చేందుకు రెవెన్యూ శాఖ ముసాయిదా సిద్ధం చేసింది. వీటితోపా టు పలు కీలక ఆర్డినెన్స్లను ఆమోదించేందు కు శనివారం సాయంత్రం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఇదే సమావేశంలో పోలీస్ శాఖలో కొత్తగా పదివేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఏర్పడ్డ కొత్త పోలీస్ స్టేషన్లు, పెరిగిన అవసరాల దృష్ట్యా ఎస్సైలు, కానిస్టేబుళ్లు సహా దాదాపు 18 వేల అదనపు సిబ్బంది కావాలని ఆర్థిక శాఖకు హోంశాఖ ప్రతిపాదనలు పంపింది. అందులో దాదాపు 10 వేల పోస్టులకు ఆమోదం తెలిపే అవకాశా లున్నాయి. ఇదే సందర్భంగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కానీ పదో షెడ్యూల్ సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదు. విభజన చట్టం ప్రకారం మానవ హక్కుల కమిషన్ పదో షెడ్యూల్లో ఉంది. అందుకే దీన్ని కేబినెట్ ముందుంచాలా లేదా అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జాగీరు భూముల మ్యుటేషన్లకు చెక్ నిజాం హయాంలోని జాగీర్దార్లకు సంబంధిం చిన భూములను ప్రభుత్వం అప్పట్లోనే రద్దు చేసింది. వీటిని ప్రభుత్వ భూములుగా గుర్తించింది. అదే సమయంలో ఏడుగురు జాగీర్దార్లకు సంబంధించిన భూములు పెం డింగ్లో పడ్డాయి. నలుగురు ఆచూకీ లేకపోగా మిగతా ముగ్గురికి సంబంధించి దాదాపు 2,200 ఎకరాల భూములు తమకే చెందుతా యని కోర్టులో కేసులు నమోదయ్యాయి. మియాపూర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన అవినీతి భాగోతానికి సంబంధించిన భూములు ఇవే. ఈ భూములను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించిన పైరవీకారుల ప్రయత్నాలకు తలొగ్గి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఈ భూములను వారి పేరిట మ్యుటేషన్ చేయాలని రెండుసార్లు మెమోలు జారీ చేసింది. మియాపూర్ భూము ల భాగోతంతో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి రావటం ఇప్పుడు ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం చట్టాన్ని సవరించి అక్రమాలకు అడ్డుకట్ట వేసే ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ఆర్వోఆర్ చట్టం ప్రకారం... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయరు. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయటం కుదరదు. పట్టాదారు పాసు పుస్తకాలు లేకుంటే మ్యుటేషన్ చేసుకునే అవకాశం లేదు. అందుకే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములతోపాటు జాగీరు భూములను ఆర్వోఆర్ చట్టంలో చేర్చుతూ సవరణ తెచ్చేలా ఆర్డినెన్స్ను ప్రభుత్వం తయారు చేసింది. దీంతో పాసు పుస్తకాలు రద్దు చేసి, తదుపరి ఇవ్వకుండా నిలిపేస్తే గతంలో జారీ చేసిన మ్యుటేషన్ ఆర్డర్లు చెల్లకుండా పోతాయని న్యాయశాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ జారీకి రెవెన్యూ శాఖ ముసాయిదా ను సిద్ధం చేసింది. సబ్ రిజిస్ట్రార్లకున్న అధికారాలకు కత్తెర వేయనున్నారు. రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చేర్పులు చేస్తూ ఆర్డినెన్స్ విడుదల చేయనున్నారు. పీడీ యాక్ట్ విస్తరణ నకిలీలు, మోసాలపై ఉక్కుపాదం మోపేందు కు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టులో మరిన్ని అంశాలను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మరో ఆర్డినెన్స్ను రూపొందించారు. ప్రధానంగా నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ నోట్లు, నకిలీ డాక్యుమెంట్లు, అక్రమంగా చెట్ల నరికివేత, గ్యాంబ్లింగ్, మట్కా, జూదం, గుడుంబా అమ్మకాలన్నీ ఇందులో చేర్చనున్నారు. నకిలీ విత్తన నిరోధక చట్టం నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు నకిలీ విత్తన నిరోధక చట్టం తీసుకు వస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇప్పటికే ప్రకటించారు. ఈ ఖరీఫ్ నుంచే అమలయ్యేలా ఈ ఆర్డినెన్స్ జారీ చేయాలని భావిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే జైలు శిక్షతోపాటు రైతులకు నష్టపరిహారం చెల్లించేలా ఆర్డినెన్స్ సిద్ధం చేశారు. గవర్నర్తో సీఎం భేటీ కేబినెట్ భేటీ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్తో భేటీ అయ్యారు. రాజ్భవన్కు వెళ్లి దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. ప్రధానంగా కొత్తగా రూపొందించిన ఆర్డినెన్స్లను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ఇప్పట్లో లేనందున ఆర్డినెన్స్లు జారీ చేయాల్సిన అవసరాన్ని సీఎం నివేదించినట్లు సమాచారం. -
పాసు పుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు
హైదరాబాద్: ఇక మీద రైతులు పట్టాదారు పాసుపుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులకు 13 వేల ట్యాబ్లు ఇస్తున్నామని తెలియజేశారు. వాటి ద్వారానే రైతుల భూములు అప్లోడ్ చేస్తామన్నారు. భూ యజమానుల వివరాలతో పాటు పంటల వివరాలు కూడా ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు. రైతుల భూమి రికార్డుల సమస్యలన్నింటినీ గ్రామసభల్లో పరిష్కరిస్తామన్నారు. అందుకోసం ఆగస్టు నెల 10 నుంచి 30 వరకు రాష్ట్రంలో రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ తెలిపారు.