breaking news
kuppam voters list
-
కుప్పంలో బోగస్ ఓట్లు.. బయటపడ్డ చంద్రబాబు గుట్టు
-
అజిష్ట గుట్టు పెరుమాళ్లకెరుక
కుప్పం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాను. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా. శాంతిపురం మండలానికి అజిష్ట పరిశ్రమను తీసుకువచ్చాను’ అని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రెండు నెలల క్రితం పరిశ్రమకు శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పటి వరకు పరిశ్రమ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందం, ఇచ్చిన అనుమతులపై సమాధానం లేని అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. సాక్షి శాంతిపురం: మండలంలోని అమ్మవారిపేట రెవెన్యూ పరిధిలో అజిష్ట ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వం భూములు కేటాయించిం ది. సంస్థ ఆరు నెలల క్రితమే 21.20 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. భూములను కూడా చదు ను చేసింది. జనవరి 3న చంద్రబాబునాయుడు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రూ 21.18 కోట్ల పెట్టుబడితో వచ్చే పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహకంగా రూ.5 కోట్లను ఇస్తున్నట్టు ప్రకటించారు. కూరగాయలు, పండ్లను డిహైడ్రేట్ చేసి ప్రాసెసిం గ్ చేస్తారని పేర్కొన్నారు. అధికారికంగా 18.16 ఎకరాల భూమిని అజిష్టకు ఇస్తున్నట్టు తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం 21.20 ఎకరాలను అప్పగించారు. శంకుస్థాపన చేసి రెండు నెలలు అవుతున్నా పనులు ప్రారంభం కాలేదు. 25 ఉద్యోగాలు మాత్రమే.. రూ.5 కోట్ల ప్రభుత్వ రాయితీ, 21.20 ఎకరాల భూమి పొందిన ప్రైవేటు సంస్థ కల్పించే ఉద్యోగాలు మాత్రం 25 మాత్రమే. సాధారణంగా పరిశ్రమల్లో ప్రతి రూ.5 లక్షల పెట్టుబడికి ఒక ఉద్యోగం జనరేట్ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమ పేరుతో ఇస్తున్న రూ.5 కోట్ల రాయితీని పది మందికి ఉద్యోగాలు కల్పిం చే చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు కేటాయిం చినా 500 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. రోజుకు 69 వేల లీటర్ల నీరు కుప్పం ప్రాంతంలో భూగర్భ జలాలు అంతంత మాత్రమే ఉన్నాయి. 1,500 అడుగుల లోతుతో బోర్లు తవ్వినా నీరు వస్తుందనే నమ్మకం లేదు. మార్చి నెలకే తాగునీటి బోర్లు ఎండిపోయి అనేక గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువైంది. ఇవేవీ పట్టని ప్రభుత్వం అజిష్ట పరిశ్రమ రోజుకు 69 వేల లీటర్ల నీటిని తోడుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఇదే జరిగితే రామకుప్పం–శాంతిపురం మండలాల్లోని అనేక బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. తద్వారా గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయక తప్పని పరిస్థితి వస్తుంది. పరిశ్రమ వచ్చేనా? అమ్మవారిపేట వద్ద అజిష్ట పరిశ్రమ ఏర్పాటుపై స్థానికుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2004 సంవత్సరానికి ముందు సీఎంగా ఇదే భూముల్లో లీఫ్ టూ క్లాత్ పరిశ్రమ పేరుతో హడావుడి చేసినా ఒరిగింది ఏమీ లేదంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనం చెవిలో పూలు పెట్టే ప్రయత్నంలో భాగంగానే పరిశ్రమ ఏర్పాటును తెరపైకి తెచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. -
బోగస్బాబు అనాలా.. దొంగబాబు అనాలా?
-
బోగస్బాబు అనాలా.. దొంగబాబు అనాలా?
సాక్షి, హైదరాబాద్: కుప్పం శాసనసభ నియోజకవర్గంలో 43 వేలకుపైగా బోగస్ ఓట్లను నమోదు చేయించుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును బోగస్బాబు అనాలా... లేక దొంగబాబు అనాలా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 1989లో కుప్పం నుంచి చంద్రబాబు తొలిసారి పోటీ చేసినపుడు 6 వేలు మెజారిటీ మాత్రమే వచ్చిందని, ఆ తరువాత రెండు ఎన్నికలలో అది వరుసగా 44 వేలు, 50 వేలకు పెరిగిందని చెప్పారు. ఈ భారీ మెజారిటీ బోగస్ ఓట్ల మహిమేనన్నారు. ఆయన విజయరహస్యం అచ్చంగా అవేనని విమర్శించారు. కుప్పంలోని మొత్తం 1.96 లక్షల ఓట్లలో 43 వేలు బోగస్వి ఉన్నాయని స్వయంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారే నిర్ధారించారని గుర్తు చేశారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన సరిహద్దు ఓటర్లను చంద్రబాబు చేర్పించుకున్నారని చెప్పారు. ఆయనకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే తిరుమల వేంకటేశ్వరస్వామిపై గానీ, కాణిపాకం వినాయకునిపై గానీ ప్రమాణం చేసి బోగస్ ఓట్లు చేర్పించలేదని చెప్పగలరా? అని సవాలు విసిరారు. రాజకీయాల్లో కూడా బోగస్ నీతిని అనుసరించి, వాటిని దిగజార్చిన ఘనత కూడా బాబుదేనని విమర్శించారు. కుప్పంలో తేలిన బోగస్ ఓటర్ల విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా దర్యాప్తు చేయించాలని, ఇందుకు కారణమైన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఉరవకొండ, ఎల్బీనగర్తో పాటు అనేక నియోజకవర్గాల్లో బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తున్నందున వాటిపై కూడా విచారణ జరపాలన్నారు. అవినీతి గురించి ఇతరులపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు... ముందుగా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలన్నారు. విభజన బిల్లు రావడానికి చాలా ముందుగానే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కోరిందని, అయితే పట్టించుకోకుండా ఇప్పుడు తానే సమైక్య చాంపియన్నని చెప్పుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఓ వైపు విభజనకు కిరణ్ అధిష్టానానికి పూర్తిగా సహకరిస్తోంటే మరోవైపు చంద్రబాబు రెండు నాల్కల సిద్ధాంతంతో వంత పాడుతున్నారన్నారు. అసెంబ్లీలో టీడీపీ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలో స్క్రిప్టులను కూడా ఒకేచోటి నుంచి వస్తున్నాయని శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి పంపిన వర్తమానాన్ని కేంద్రం రాష్ట్రానికి పంపిన తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని శ్రీకాంత్రెడ్డి తెలిపారు. బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారని, వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని బంద్లో పాల్గొన్న వారందరికీ, పార్టీ శ్రేణులకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.