breaking news
Kudligi
-
కాంగ్రెస్ గూటికి కూడ్లిగి ఎమ్మెల్యే నాగేంద్ర?
సాక్షి, బళ్లారి: కూడ్లిగి ఎమ్మెల్యే బి.నాగేంద్ర కాంగ్రెస్లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నాగేంద్ర కూడ్లిగిలో ఇండిపెండెంట్గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందిన నాగేంద్ర శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డి వర్గంలో కీలక నేతగా ఎదిగారు. 2013 ఎన్నికల ముందు శ్రీరాములు బీఎస్ఆర్ పార్టీ స్థాపించడంతో నాగేంద్ర అనివార్యంగా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినప్పటికీ శ్రీరాములు వర్గానికే మద్దతు కొనసాగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి పరోక్షంగా సహకరిస్తూ మళ్లీ బీజేపీలోకి చేరతారనే సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోవడంతో ఆయన ఏ పార్టీలోకి చేరకుండా తటస్థుడిగా ఉంటూనే బీజేపీకి మద్దతిస్తూ వచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఒక దశలో నాగేంద్ర మళ్లీ బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది. అయితే అనూహ్య పరిణామాలతో నాగేంద్ర కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ దిశగా ఇప్పటికే మంత్రి డీకే శివకుమార్, కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్ గుండూరావు తదితరులు ఆయనతో మంతనాలు జరిపారు. త్వరలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధమైనట్లు భోగట్టా. కాగా ఈనెల 4న బళ్లారి జిల్లాలో బీజేపీ పరివర్తన సమావేశం జరగనున్న నేపథ్యంలో కూడ్లిగికి కూడా మాజీ సీఎం యడ్యూరప్ప రానున్నారు. అక్కడ బీజేపీ పరివర్తన సమావేశాన్ని విజయవంతం చేయడానికి నాగేంద్ర హాజరుకాకపోవడం కూడా ఆయన కాంగ్రెస్లో చేరతారనే ఊహాగానాలకు ఊతమిస్తోంది. 2008 నుంచి కూడ్లిగి అంటే నాగేంద్ర అనే స్థాయిలో ముద్ర ఉంది. ప్రస్తుతం బీజేపీ పరివర్తన సమావేశానికి ఆయన దూరం కావడంతో సమావేశాన్ని విజయవంతం చేయడానికి బళ్లారి లోక్సభ సభ్యుడు శ్రీరాములు రంగంలోకి దిగారు. సోమవారం శ్రీరాములు జిల్లా బీజేపీ నాయకులతో కలిసి కూడ్లిగిలో జరిగే బీజేపీ పరివర్తన సమావేశం ఏర్పాట్లను సమీక్షించారు. నాగేంద్రకు కూడ్లిగిలో మంచి పట్టు ఉండటంతో ఎలాగైనా అక్కడ పైచేయి సాధించాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. -
కూడ్లిగిలో అనుపమ !
రాజీనామా వెనక్కు తీసుకునే ప్రశ్నే లేదు న్యాయపోరాటానికి సిద్ధం ఫేస్బుక్లో నేను కామెంట్ చేయలేదు పరమేశ్వర్ నాయక్ రాజీనామా చేయాలని కూడ్లిగిలో నిరసనలు బళ్లారి : ఎట్టకేలకు కూడ్లిగి డీవైఎస్పీ అను పమ షణై కూడ్లిగి డీఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. రాజీనామా చేసిన అనంతరం ఐదు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అనుపమ షణై ఎక్కడ ఉన్నారో ఆచూకీ కనుగొనేందుకు జిల్లా ఎస్పీ ఆర్.చేతన్ పోలీసు బృందాలను ఉడిపికి కూడా పంపిన సంగతి తెలిసిందే. ఆమె రాజీనామా చేయడంతో సీఎం సిద్దరామయ్య కూడా రంగంలో దిగి ఆమెతో ఎలాగైనా రాజీనామా ఉపసంహరించుకునేలా చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు తెలపడంతో డీజీపీ కూడా రంగంలోకి దిగి ఆమెను రాజీనామా ఉపసంహించుకునే దిశగా ఎస్పీ ఆర్.చేతన్కు సూచనలు ఇచ్చారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పరమశ్వర్ నాయక్ వ ర్సస్ అనుపమ షణై వార్ జరుగుతోంది. జిల్లా మంత్రిపై ఫేస్బుక్లో అనుపమ షణై వాగ్బాణాలు సంధించిన నేపథ్యంలో జిల్లా మంత్రిపై సంఘ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం అనుపమ షణై తన సోదరుడితో కలిసి ప్రైవేటు కారులో కూడ్లిగిలోకి అడుగు పెట్డడటంతో ఒక్కసారిగా భారీ జన సందోహం తరలి వచ్చారు. కూడ్లిగిలోని తన ప్రభుత్వ అధికార నివాసంలో ఆమె కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత డీవైఎస్పీ కార్యాలయానికి చేరుకుని తనకు సంబంధించిన రికార్డులను తీసుకున్నారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులు, విలేకరులతో మాట్లాడుతూ... తాను సమర్పించిన తన రాజీనామాను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. తాను పోలీసు ఉన్నతాధికారులెవరినీ కలిసే అవసరం లేదన్నారు. ఫేస్బుక్లో తన పేరు మీదుగా ఎవరో ట్వీట్ చేస్తున్నారని, తాను ఫేస్బుక్ అకౌంట్ కూడా ఓపెన్ చే యలేదన్నారు. ఫేస్బుక్లో అజ్ఞాత వ్యక్తులు ట్వీట్లు చేసిన అంశంపై కేసు పెడతారా? అని విలేకరులు ప్రశ్నించగా, కేసు పెడితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. ఇక నుంచి తాను చట్టపరంగా పోరాటం చేస్తానని పేర్కొన్నారు. మొత్తం మీద అనుపమ షణై రాజీనామా అంశం ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో స్వయానా సీఎం సిద్దరామయ్య, హోం మంత్రి పరమేశ్వర్లు జోక్యం చేసుకున్న ఫలితం కనిపించలేదు. ఆమె రాజీనామా ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పడంతో పోలీసు ఉన్నతాధికారులకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్లకు సవాల్గా మారింది. అనుపమ షణై రాజీనామా ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పడంతో కూడ్లిగిలో అమెకు మద్దతుగా భారీ ప్రదర్శనలు చేశారు. కూడ్లిగిలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, తాలూకా పంచాయతీ మెంబర్లు తదితరుల నేతృత్వంలో డీవైఎస్పీ కార్యాలయం ముందు ఆమెకు మద్దతుగా, జిల్లా ఇన్ఛార్జి మంత్రికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కూడ్లిగి జాతీయ రహదారిలో ధర్నా చేపట్టడంతో వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పెద్ద ఎత్తున నిరసన కారులలో రోడ్డుపై బైఠాయించి మంత్రి పరమేశ్వర నాయక్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అనుపమ షణైకు మద్దతుగా నినాదాలు చేశారు. జాతీయ రహదారి-13ని దిగ్బంధనం చేయడంతో కిలోమీటర్ల పొడవున వాహనాలు ఆగిపోయాయి.