breaking news
Kotha Rangula Prapancham Movie
-
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న 30 ఇయర్స్ పృథ్వీ కుమార్తె
క్రాంతి హీరోగా, శ్రీలు హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. నటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టారు. గుంటక శ్రీనివాస్ రెడ్డి, కె.కృష్ణారెడ్డి, పద్మ రేఖ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను నటుడు, నిర్మాత నాగబాబు విడుదల చేశారు. ‘‘కొత్త రంగుల ప్రపంచం’ వంటి మంచి కథలో నటించే అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు క్రాంతి. ‘‘మా నాన్న(పృధ్వీ) దర్శకత్వం వహించిన తొలి సినిమాతో నేను హీరోయిన్గా పరిచయమవడం సంతోషంగా ఉంది’’అన్నారు శ్రీలు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
పృద్వీ రాజ్ దర్శకత్వంలో ‘కొత్త రంగుల ప్రపంచం’
ఇప్పటివరకు ప్రేక్షకులను తనదైన కామెడీతో మేనరిజంతో ఆకట్టుకున్న సీనియర్ నటుడు పృద్వీ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్త రంగుల ప్రపంచం’. పృద్విరాజ్, క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, కృష్ణ తేజ, అంబటి శ్రీను, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ గణపతి నటీనటులుగా శ్రీ పిఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డిలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి మాట్లాడుతూ... ఈ సినిమా చాలాబాగా వచ్చింది. ఒక సీన్ ను మొదలుపెట్టేముందు డీఓపీ తో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. ఈ సినిమాకి సినీ ప్రముఖులు నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి’అని అన్నారు. ‘సీనియర్ నటులతో నేను సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని హీరో క్రాంతికృష్ణ అన్నారు. ‘మా నాన్న దర్శకత్వంలో నేను ఈ సినిమా చెయ్యడం లక్కీ ఫీల్ అవుతున్నాను.