-
కోరెగావ్ ఓ శౌర్య ప్రతీక
సందర్భం మహర్ తెగ ప్రజలు యుద్ధవీరులు. శివాజీ సైన్యంలో వీరి శౌర్యం దేదీప్యమానంగా వెలిగింది. కశ్మీర్పై పాక్ దండయాత్రను వీరోచితంగా అడ్డుకున్న చరిత్ర వీరిది. కానీ దాన్ని సమాజంలో చీలికలకు ఉపయోగించుకోవడం కూడనిపని. రెండువందల సంవత్సరాల క్రితం పూనాకు 40 కి.మీ.ల దూరంలో భీమానది ఒడ్డున ఆంగ్లేయుల సైన్యానికి, పీష్వా సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. 1818 సం‘‘లో కోరేగావ్ వద్ద జరిగిన యుద్ధంవల్ల మరాఠా సామ్రాజ్యం పూర్తిగా పరాజితం అయింది. ఆనాటి ఆంగ్లసైన్యంలో ‘మహర్’లు గణనీయంగా ఉన్నారు. ఆ యుద్ధంలో చనిపోయిన మహర్ సైనికులను స్మరిస్తూ అంబేడ్కర్ అనుయాయులు గత అనేక సంవత్సరాలుగా శౌర్యదినంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ శౌర్యదినాన్ని నిర్వహించడానికి వేలాదిమంది అంబేడ్కర్ అనుయాయులు కోరేగావ్ వద్దగల స్మారకం వద్ద కలుస్తుంటారు. ఈ ఉత్సవాలను ఇంతకాలం మిగిలిన సమాజం పెద్దగా పట్టించుకోలేదు. జనవరి 2వ తేదీన నిర్వహించిన ప్రదర్శనపై రాళ్ళురువ్వటం, 3వ తారీఖున నిర్వహించిన బంద్తో జరిగిన దుర్ఘటనలవల్ల కోరేగావ్ చరిత్ర మహారాష్ట్రలోని ఇంటింటికీ తెలిసింది. మహర్ తెగ ప్రజలు యుద్ధవీరులు. శివాజీ సైన్యంలో వీరి పరాక్రమం దేదీప్యమానంగా వెలిగింది. 1947లో పాకిస్తాన్ కశ్మీర్పై దండయాత్ర చేసినపుడు డా‘‘బాబా సాహెబ్ అంబేడ్కర్ సలహా మేరకు పాకిస్తాన్ దురాక్రమణను ఎదుర్కొనడానికి మహర్ బెటాలి యన్ని పంపారు. అక్కడ మహర్ సైనికులు చేసిన వీరోచిత యుద్ధం స్వర్ణాక్షరాలతో రాయగలిగిన చరిత్ర. భారత సేనాపతి, తదితర ఉన్నత అధికారులు, ‘‘హిందూ సైన్యంలో మహర్ సైనికులు అత్యంత శ్రేష్ఠవీరులు’’ అని బహిరంగంగా అనేకసార్లు కొనియాడారు. 1947 డిసెం బర్ 24న ఝాంగర్ వద్ద భీషణ సంగ్రామం జరిగింది. మహర్ సైనికుల వద్ద గల తుపాకులలో గుండ్లు అయిపోయాయి. అయినా మహర్ సైనికులు ముష్ఠి యుద్ధంతోనే పాక్ సైన్యం ఆక్రమణను విజయవంతంగా ఎదుర్కొన్నారు. తర్వాత మహర్ సైనికులలో ఒకరిని ‘మహావీరచక్ర,’ మరొక 5 మందిని ‘వీరచక్ర’ లతో సన్మానించారు. డిసెంబర్ 24ని మహర్లు, మొత్తం భారత సమాజం నిజమైన శౌర్యదినోత్సవంగా జరుపుకోవాలి. ప్రకాశ్ అంబేడ్కర్, వామపక్ష భావజాల మేధావులకు 24 డిసెంబర్ని శౌర్యదినంగా నిర్వహించటం ఇష్టం ఉండదు. పీష్వాలు జన్మతః బ్రాహ్మణులు. కానీ వీరు స్వయంగా రాజులు కాదు, శివాజీ అనుయాయులకు ప్రతినిధులుగా వారు యుద్ధం చేశారు. పీష్వాల పరాజ యమంటే మరాఠా మహాసామ్రాజ్యపు పతనమే. ఇంత సరళమైన విషయాన్ని ‘బ్రాహ్మణ పరాజయం’గా పేర్కొనడం వామపక్ష చరిత్రకారుల ప్రత్యేకత. జనవరి 2న కోరేగావ్ ప్రదర్శనపై రాళ్లురువ్విన సంఘటనలు, దాడులు అత్యంత ఖండనీయం. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని ప్రకాశ్ అంబేడ్కర్ మహారాష్ట్ర 3 రోజుల బంద్కు పిలుపునిచ్చారు. బంద్ ప్రారంభమైన పదిగంటలకే ప్రకాశ్ అంబేడ్కర్ బంద్ను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ప్రభుత్వ బస్సులపై, ప్రైవేటు వాహనాలపై నీలం జెండాలతో ఉద్యమకారులు రాళ్లు రువ్వారు, దాడులు చేశారు. పలువురు అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదుపు తప్పిన ఉద్యమ కారుల వ్యవహారశైలి కారణంగా సామాన్య మహారాష్ట్ర ప్రజానీకంలో ఒక అసంతృప్తి ఏర్పడింది. డా‘‘ బాబాసాహేబ్ అంబేడ్కర్ బంధుభావనకు (సోదర భావనకు) అత్యంత ప్రముఖస్థానం ఇచ్చారు. ‘బంధుభావం అంటే మానవత్వం, ధర్మానికి మరోపేరు’ అని వారు పేర్కొన్నారు. పౌరులందరిలో బంధుభావన అనుభూతిని కలిగించాలి. భారతీయులమందరమూ మన మొక్కటే, మనమందరం సమానులం అనే భావన ఆలోచనలో, ఆచరణలో వ్యక్తం కావాలి, ఇది అత్యంత కష్టమైన పనే అని పేర్కొన్నారు. ఈ అనుభూతిని, సమరసతను నిర్మాణం చేయటంకోసం వివిధ వర్గాల ప్రజలమధ్య సద్భావన కోసం గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఈ బంద్ కారణంగా ప్రకాశ్ అంబేడ్కర్వంటి కొద్దిమంది అంబేడ్కర్వాదులకు రాజకీయ లబ్ధి లభించవచ్చునేమో, సాధారణ అంబేడ్కర్ వాదులకు ఈ సంఘటనలు మింగుడుపడని ఘటనలుగా మిగిలిపోయాయి. అంబేడ్కర్ అనుయాయులకు మిగిలిన సమాజం మధ్య అగాధాన్ని ఇవి మరింతగా పెంచాయి. ఒకనాడు మరాఠా విశ్వవిద్యాలయం పేరును డా‘‘ బాబా సాహెబ్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పేరుగా మార్చే ప్రతిపాదన పెద్ద వివాదం లేవదీసింది. ఈ వివాదం చాలాకాలం కొనసాగింది. సామాజిక సమరసతా మంచ్ కార్యకర్తగా ‘‘డా‘‘అంబేడ్కర్ జాతీయ నాయకుడు, ఒక కులనాయకుడు కాదు’’ అంటూ మహా రాష్ట్ర సమాజంలోని అన్ని కులాలు, వర్గాల ప్రజలను కలిసి నచ్చచెప్పి, మరాఠా విశ్వవిద్యాలయం పేరును డా‘‘ అంబేడ్కర్ మరాఠా విశ్వవిద్యాలయంగా ప్రజలం దరి ఏకాభిప్రాయంతో మార్పుచేయించిన ఘటనలో నేను ఒక కార్యకర్తగా పనిచేయటం నా జీవితంలో మర్చిపోలేని ఆనందకరమైన సంఘటన. ప్రకాశ్ అంబేడ్కర్ వంటి కొద్దిమంది నాయకుల ధోరణివల్ల నేడు మహా రాష్ట్ర సమాజం రెండుముక్కలైంది. దీనికి ఎవరు బాధ్యులు? ఫడ్నవిస్, మోదీ, భాగవత్లను కొత్త పీష్వా లుగా బ్రాహ్మణ ద్వేషంతో దూషించటం ప్రకాష్ అంబేడ్కర్ తదితర నాయకులకు ఆనందం కలిగి ఉండవచ్చును. కానీ ఈ దుర్ఘటన సందర్భంగా ఏర్పడిన పరిణామాలపై వీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. - రమేష్ పతంగే వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యులు -
కుల చిచ్చు రేపాల్సిన అవసరమేంటి?
సాక్షి, ముంబై : కుల చిచ్చు కారణంగా చెలరేగిన అల్లర్ల తర్వాత పరిస్థితులు దాదాపుగా చక్కబడటంతో మహారాష్ట్ర పోలీసు శాఖ రంగంలోకి దిగింది. సీసీపుటేజీలు, సాక్ష్యాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భీమ-కోరేగావ్ వద్ద చెలరేగిన హింసకు సంబంధించి సంభాజీ భిడే, మిలింద్ ఎక్బోతే పేర్లను ఎఫ్ఐఆర్లో ప్రధానంగా చేర్చింది. అయితే వారు మాత్రం తమకు ఈ అల్లర్లతో సంబంధం లేదని చెబుతుండటం విశేషం. సంభాజీ భిడే(85) హిందూ అతివాది. శివ్ రాజ్ ప్రతిస్థాన్ అనే సంస్థ ప్రధాన ప్రతినిధి అయిన భిడే సరిగ్గా అల్లర్లు చెలరేగటానికి ముందు తన అనుచరులతో భేటీ అయ్యారు. కవ్వింపు చర్యల గురించి ఆయన వారితో చర్చించారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ముందుగానే వారిని మోహరించి అల్లర్లకు పురిగొల్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో నిందితుడు మిలింద్ రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా తన అనుచరుల్ని ఉసిగొల్పాడు అని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు జనవరి 2న ఓ ఫిర్యాదు అందటంతో పింప్రి పోలీసులు ఆ రెండు సంస్థల ప్రతినిధులపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక భరిప బహుజన్ మహాసంగ్(బీబీఎం) నేత ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. అల్లర్లకు హిందూ ఎక్తా అగాది, శివ్రాజ్ ప్రతిస్థాన్ సంస్థలే కారణమని ఆరోపిస్తున్నారు. భిడే వివరణ... కాగా తనపై ఆరోపణలను భిడే తీవ్రంగా ఖండించారు. ‘‘కుల చిచ్చు రేపాల్సిన అవసరం నాకేంటి? దానివల్ల నాకేం ఒరుగుతుంది? నా పేరును ఇందులోకి లాగి కొందరు రాజకీయం చేస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది’’ అని భిడే పేర్కొన్నారు. గురువారం వేలాది మంది అనుచరులతో ఆయన సంగలి జిల్లా కలెక్టర్ను కలిసి తనపై నమోదైన అభియోగాలను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. మిలింద్ కూడా దాదాపు ఇలాంటి వాదననే వినిపిస్తున్నారు. ఇంకోపక్క వారిపై కేసుల విషయంలో వెనక్కి తగ్గితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నాయి. భీమ-కోరేగావ్ పోరాటానికి 200 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దళితులు నిర్వహించిన కార్యక్రమంలో హింస చెలరేగగా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకగణం వెనకుండి హింసకు ప్రేరేపించాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పోరాట చైతన్య దీప్తి ‘కోరేగావ్’
ఏటా నూతన సంవత్సరం రోజున కోరేగావ్ వద్ద చేరే వేలాది ప్రజలందరిదీ ఒక్కటే మాట... ‘‘ఇది మాకు మరువలేని రోజు. ఆత్మగౌరవం కోసం, తెగనరికిన తలలను సైతం పెకైత్తుకొని తిరగడం కోసం మా తాతలు ఇక్కడ ప్రాణాలర్పించారు. మనిషిని పశువుకన్నా హీనంగా చూసే హేయమైన అంటరానితనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, సహించి... చివరకు తెగించి తిరగబడ్డ చరిత్రకు ఈ నదే సాక్ష్యం. పీష్వాల క్రూర పాలనను అంతం చేసి వారు మాకు మార్గనిర్దేశనం చేశారు. వారి త్యాగాలను గానం చేయడానికి, ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుకోవడానికి ఇక్కడ కలుస్తుంటాం’’. జనవరి 1, 2015. ప్రపంచమంతా నూతన సంవత్సర సంబరాల్లో మునిగి తేలుతున్న సందర్భమిది. అయితే మహారాష్ట్రలోని పుణే సమీపాన ఉన్న భీమా నది ఒడ్డున నిటారుగా నింగికి ఎగసి, సగర్వంగా తలెత్తి నిలిచిన కోరేగావ్ స్మారక స్తూపం వద్ద వేలాది మంది గుమిగూడి నివాళులర్పిస్తుంటారు. ఒకటి సంబరమైతే, రెండవది సంస్మరణ. ప్రపంచ ప్రజలంతా అనిశ్చితమైన భవితపై ఎక్కడలేని ఆశలతో సంబరాలలో తేలుతుండగా... అక్కడ చేరిన వారు మాత్రం తమ చేతులతో తామే తాము కోరుకుంటున్న భవితను నిర్మించుకోగలిగే స్ఫూర్తిని పొందడం కోసం తపిస్తారు. జనవరి ఒకటిన భీమా నది ఒడ్డున నిలిస్తే మరో ప్రపంచంలోకి దారులు వేస్తున్నట్టుంటుంది. రాచరికపు అరాచకాలకు ఎదురొడ్డి, ప్రాణాలకు తెగించి పోరాడిన దళిత పోరాటాల చరిత్రకు, ప్రత్యేకించి సైనిక పోరాటాల చరిత్రకు కోరేగావ్ స్మారక స్తూపం మరుగున పడిపోకుండా మిగిలిన సజీవ సాక్ష్యం. ఏటా ఈ రోజున అక్కడ చేరిన ప్రజలలో విజయగర్వం తొణికిసలాడుతుంది. అందరి నోటా ఇంచుమించుగా ఇదే మాట వినవస్తుంది. ‘‘ఇది మాకు మరువలేని రోజు. ఆత్మ గౌరవం కోసం, తెగ నరికిన తలలను సైతం పెకైత్తుకొని తిరగడం కోసం మా తాతలు ఇక్కడ ప్రాణాలర్పిం చారు. మనిషిని పశువుకన్నా హీనంగా చూసే హేయమైన అంటరానితనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, సహించి... చివరకు తెగించి తిరగబడ్డ చరిత్రకు ఈ నదే సాక్ష్యం. పీష్వాల క్రూర పాలనను అంతం చేసి వారు మాకు మార్గనిర్దేశనం చేశారు. ఆ యుద్ధంలో ప్రాణాలర్పించిన వారిని సంస్మరిస్తూనే ఇక్కడ విజయ స్తూపాన్ని నిర్మించుకున్నాం. వారి త్యాగాలను గానం చేయడానికి, ఎప్పటి కప్పుడు మాలో ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుకోవడానికి ఇక్కడ కలుస్తుంటాం’’. పీష్వాల పీచ మణచిన దళిత సేన బ్రిటిష్ వర్తకులు ఈస్టిండియా కంపెనీని స్థాపించి, భారతదేశాన్ని రాజకీయంగా గెలుచుకోవడానికి అనేక యుద్ధాలు చేశారు. అందులో భీమా నది వద్ద పీష్వాలను ఓడించిన రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం ప్రముఖమైనది. ఈ యుద్ధం, అత్యంత క్రూరమైన కుల అణచివేత సాగించిన పీష్వాల రాజ్యం అంతం కావడానికి, బ్రిటిష్ పాలన నెలకొనడానికి ఎంతో ఉపకరించింది. ఒక సామ్రాజ్యవాదశక్తికీ, కుల వివక్ష తలకెక్కిన నిరంకుశ రాచరికానికి మధ్య జరిగిన యుద్ధంలో దళితులు బ్రిటిష్ సైన్యం పక్షాన నిలిచినది అత్యంత హేయమైన అంటరానితనాన్ని రుద్దిన పాలనను అంతం చేయడం కోసమే. అందుకే అది దళిత పోరాటాల చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఇతర యుద్ధాలకు ఇది చాలా భిన్నమైనది. అసలు ఈ యుద్ధం జరిగిన తీరే అద్భుతం. 1817 నవంబర్లో పీష్వా సైన్యం పుణేలోని బ్రిటిష్ రెసిడెన్సీని ఆక్రమించడంతో కంగుతిన్న బ్రిటిష్ సైన్యం బొంబాయిలోని తన ఫస్ట్ రెజిమెంట్ రెండవ బెటాలియన్ను పంపి పీష్వాలకు బుద్ధి చెప్పాలనుకుంది. కెప్టెన్ స్వంటన్ నేతృత్వంలో అయిదు వందల మంది సైనికులను, 250 మందితో కూడిన అశ్విక దళాలను పంపారు. కానీ పీష్వాలకు 20 వేల సైనికులు, 8 వేల అశ్విక దళం ఉంది. పీష్వాల బలాధిక్యతకు బ్రిటిష్ వారి తరఫున రంగంలోకి దిగిన సైనికులు జంకలేదు. 1818, జవవరి 1న కోరేగావ్ దగ్గర జరిగిన ఈ యుద్ధంలో... ఒక రోజంతా అన్నం, నీళ్లు లేకుండానే యుద్ధానికి దిగిన 750 మంది సైనికులు దాదాపు 28 వేల పీష్వా సైన్యంతో తలపడ్డారు. ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ యుద్ధం సాగింది. పీష్వాల వేలకు వేల సైన్యాన్ని స్వంటన్ నేతృత్వంలో నిలిచిన కొన్ని వందల మంది సైనికులు మట్టి కరిపించారు. 1707 నుంచి 1818 వరకు సాగిన పీష్వాల దుర్మార్గ పాలనకు ముగింపు పలికారు. అయితే ఆ యుద్ధంలో బ్రిటిష్ సేనగా పోరాడిన సైనికులు బ్రిటిష్ వాళ్లు కారు, అంటరాని కులంగా చూసే మహర్లు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఈ విజయం దళిత సేన సాధించిన విజయం. అణచివేత నుండి వచ్చిన తెగింపు ఈ అపూర్వ విజయం వెనుక మరో కోణం దాగి ఉంది. మహర్లు చాలా కాలంగా సైనిక వారసత్వం కలిగి, సైనికులుగా పనిచేసిన వాళ్లు. ముస్లింల దండయాత్రలను ప్రతిఘటించిన శివాజీ కాలంలోనే మహర్లను సైనికులుగా నియమించడం ప్రారంభమైంది. తద్వారా శివాజీ మహర్లకు సముచిత స్థానాన్ని కల్పించాడు. 1707లో పీష్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని సైన్యం నుంచి తొలగించారు. అంతేగాక అత్యంత దుర్మార్గమైన పద్ధతుల్లో, నీచమైన పద్ధతుల్లో అంటరానితనాన్ని పాటించారు. అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాచంగ్లు గ్రామాల్లోకి రాకూడదు. ఉదయం, సాయంత్రాలైతే అసలే రాకూడదు. ఆ సమయాల్లో సూర్యుడు ఏటవాలుగా ఉంటాడు కాబట్టి వాళ్ల నీడలు పొడవుగా ఉంటాయి. అంటరాని వాళ్ల నీడలు సైతం అగ్ర కులాలను తాకరాదు అని ఆ నిషేధం విధించారు. మధ్యాహ్నం సూర్యుడు నట్టనడినెత్తిన ఉండే సమయంలో మాత్రమే వాళ్లు ఊళ్లోకి రావచ్చు. అది కూడా వారి అడుగులను వారే చెరిపేసుకునేలా నడుము వెనక చీపురు కట్టుకొని, ఉమ్మినా బయట పడకుండా ఉండేందుకు మూతికి ముంత కట్టుకొని రావాలి. పొరపాటున పీష్వాల వ్యాయామశాలల ముందు నుంచి పోతే మహర్, మాతంగ్ల తలలను నరికి, కత్తులతో బంతి ఆట ఆడేవారు. ఇంత క్రూర పాలనను అనుభవించారు కనుకనే మహర్ సైనికులు చావో రేవో తేల్చుకోవాలనుకున్నారు. బ్రిటిష్ సైన్యంలో చేరి పీష్వాల పీచమణచడానికే ప్రాణాలను లెక్కచేయక పోరాడారు. పీష్వాల క్రూర అణచివేత నుంచే వారిలో ఆ కసి, పట్టుదల పుట్టుకొచ్చాయి. లేకపోతే గుప్పెడు మంది వహర్లు వేల కొలది పీష్వా సైన్యాన్ని మట్టుబెట్టడం సాధ్యమయ్యేదే కాదు. నీచమైన బతుకు కన్నా యుద్ధరంగంలో చావడమే గౌరవమని వాళ్లు భావించారు. కనుకనే విజయం వారి సొంతం అయింది. అమెరికా మానవ హక్కుల నాయకుడు, వర్జీనియా విముక్తి కోసం పోరాడిన యోధుడు పాట్రిక్ హెన్రీ మాటలు ఇక్కడ చక్కగా వర్తిస్తాయి. ‘‘మనం విముక్తి పొందాలంటే పోరాటం తప్పనిసరి. నా వరకైతే విముక్తి పొందడమో, వీర మరణమో కావాలి’’. కోరేగావ్ యుద్ధంలో మహర్లు సరిగ్గా అలాగే అంటరానితనం సంకెళ్లను తెంచుకోవడానికి ప్రాణ త్యాగాలకు సిద్ధమయ్యారు, విజయం సాధించారు. కోరేగావ్ రగిల్చిన పోరాట స్ఫూర్తి 1819లో జరిగిన బ్రిటిష్ పార్లమెంట్ సమావేశాల్లో మహర్ సైనికుల వీరోచిత పోరాటం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత మహర్ రెజిమెంట్ సైనికులు మూడు, నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నారు. 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయ సైనికులందరిలాగే మహర్లు కూడా తిరుగుబాటు చేశారు. ఆ తదుపరి బ్రిటిష్ వారు అన్ని కులాలవారిని తిరిగి సైన్యంలో చేర్చుకున్నారు. కానీ 1892 నుంచి మహర్లను సైన్యంలోకి తీసుకోవడం ఆపేశారు. మహర్లను సైన్యంలోకి చేర్చుకోవాలంటూ 1894లో గోపాల్ బాబా వాలంగ్కర్ నాయకత్వంలో మరో ఉద్యమం ప్రారంభమైంది. కానీ ఆధిపత్య కులాల మాటలు నమ్మి బ్రిటిష్వారు మహర్లను సైన్యంలోకి తీసుకోవడానికి నిరాకరించారు. శివ్రామ్ కాంబ్లే అనే మరొక నాయకుడు కూడా ఈ సమస్యపై నిరంతర పోరాటం చేశారు. ఆయన అంటరాని కులాల కోసం పాఠశాలలు నిర్వహించేవారు. కాంబ్లే 1910లో 50 గ్రామాల మహర్లను సమీకరించి మహర్ సైనికుల సమస్యలను ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఆ తదుపరి పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. చివరికి 1917లో మహర్లను తిరిగి సైన్యంలోకి తీసుకోవడం మొదలైంది. అదీ మొదటి ప్రపంచ యుద్ధ సమయం కావడం వల్ల తప్పనిసరై చేర్చుకున్నారు. యుద్ధం ముగిసిపోయాక, 1922లో తిరిగి వారిని సైన్యంలో చేర్చుకోవడం ఆపేశారు. 1940లో అంబేద్కర్ చూపిన చొరవ వల్లనే తిరిగి మహర్లను సైన్యంలోకి తీసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు భారత సైన్యంలో మహర్ రెజిమెంట్ కొనసాగుతోంది. కోరేగావ్ యుద్ధంలో అమరులైన వారికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం 1851లో అక్కడే స్తూపాన్ని నిర్మించింది. అదే స్తూపం వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మొదటిసారిగా 1927లో జనవరి ఒకటిన సభను నిర్వహించి ఏటేటా సంస్మరణ జరిపే సంప్రదాయాన్ని ప్రారంభించారు. కోరేగావ్ యుద్ధం పీష్వాల దుర్మార్గ పాలనను అంతం చేయడంతో మహారాష్ట్రలో ఒక చైతన్య స్రవంతికి అంకురార్పణ జరిగింది. అదే పుణేలో, 1827లో జన్మించిన జ్యోతిరావు పూలే ఆనాటి మహర్ సైనికుల విజయాన్ని పునాది చేసుకొని కుల వ్యతిరేక పోరాటాలను నిర్మాణాత్మకంగా కొనసాగిం చారు. ఆ స్ఫూర్తి వల్లనేనేమో అంటరాని కులాల బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచారు. ఆ చైతన్య స్రవంతికి కొనసాగింపుగా అదే మట్టిలో పుట్టిన బాబా సాహెబ్ అంబేద్కర్ కృషితో అంటరానితనాన్ని చట్టపరంగా నిషేధించారు. అందువల్లనే మహర్ సైనికులు జనవరి 1, 1818లో సాధించిన అద్భుత విజయాన్ని గుర్తు చేసుకో వడం, వారికి నివాళి అర్పించడం సామాజిక సమానత్వాన్ని, న్యాయాన్ని కాంక్షించే వారందరి బాధ్యత. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ నం: 9705566213)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement