Konda Lakshman Bapuji birth anniversary
-
కొండా లక్ష్మణ్ బాపూజీకి కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి (సెప్టెంబర్ 27)ని పురస్కరించుకుని బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన నిస్వార్థ సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ సాధించడమే ఆయనకు అసలైన నివాళి అని పేర్కొన్నారు. -
అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
హైదరాబాద్ : ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. సెప్టెంబర్ 27 న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి రోజున అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయన జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ నుంచి 8 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.