-
సమస్యను వారంలో పరిష్కరిస్తాం
కొణిజర్ల: ఏన్కూర్లోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను వారంరోజుల్లో పరిష్కరిస్తానని జిల్లా విద్యాశాఖాధికారి పి.మదన్మోహన్ అన్నారు. బాలికలు సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గ్రహించిన డీఈఓ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బాలికల మరుగుదొడ్లు, నీటి వసతులను ఆయన పరిశీలించారు. బాలికలతో మాట్లాడారు. వంట శాల పరిశీలించి బాలికలకు అమలు చేస్తున్న మెనూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏన్కూర్ కస్తూర్బాలో బాలికల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని వినియోగంలో లేకపోవడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటిని వారం రోజుల్లో బాగు చేయించి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పాఠశాలలో సమస్యలపై టీఎస్ ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ విభాగానికి తెలియజేశామని, వారు పాఠశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో 471 వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామని, వారిలో గతేడాది పని చేసిన 413 మందిని రెన్యూవల్ చేసినట్లు చెప్పారు. పిల్లల సంఖ్యను బట్టి ఎంఈఓల నుంచి నివేదిక తెప్పించుకుని ఖాళీలను భర్తీ చేస్తామని, ఈ ఏడాది కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్ తరగుతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కొత్తగా 9 పాఠశాలల్లో సిబ్బంది నియామకాలు చేపడుతున్నామన్నారు. ఇంటర్లో బాలికలు అదనంగా వచ్చి చేరడం వల్ల సమస్య ఏర్పడుతుందని, ఈ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచడం కోసం విద్యార్థులను ఏ బీ, సీ, డీ, ఈ గ్రూపులుగా చేసి చదివిస్తామని, సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేకంగా మెటీరియల్ తయారు చేయించి పంపిణీ చేయబోతున్నామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 8,500 మంది విద్యార్థులు చేరారని, ఎక్కడ మౌలిక వసతుల కొరత ఉందో అక్కడ నిధులు కేటాయించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎంఈఓ జయరాజు, ఎస్ఓ సంతు పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్ను పరిశీలించిన డీఈవో
కారేపల్లి: ఖమ్మం జిల్లాలోని మోడల్ స్కూల్ను జిల్లా విద్యా శాఖాధికారి (డీఈవో) రాజేష్ బుధవారం సందర్శించారు. కారేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులతో డీఈవో మాట్లాడుతూ... టీచర్ల బోధనా విధానంపై ప్రశ్నలు అడిగారు. వసతిగృహాన్ని సందర్శించిన అనంతరం పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలోని పాఠశాలలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని సిబ్బందికి డీఈవో సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement