Indo-Tibetan Border Police Force
-
ఎవరెస్ట్పై వందేమాతరం
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగ చరిత్రలో 2026 మే 21వ తేదీ ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దేశ సరిహద్దులను కాపాడే వీర వనితలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అపూర్వమైన రికార్డు సాదించారు. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)కు చెందిన మొట్టమొదటి పూర్తి మహిళా బృందాలు వేర్వేరుగా ఒకే రోజు ఎవరెస్ట్పై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి అ రుదైన జంట రికార్డును నెలకొల్పారు. దేశంలోని యువతులకు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించడమే కాదు ప్రకృతి విసిరే కఠిన సవాళ్లను సైతం ఎదుర్కొని విజయం సాధించడంలో ఎవరికీ తీసిపోమని నిరూపించారు. ఎవరెస్ట్పై మార్మోగిన వందేమాతరం సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన 60వ అవతరణ దినోత్సవం సందర్భంగా మిషన్ వందేమాతరం పేరుతో మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళలతో ఎవరెస్ట్ యాత్రను చేపట్టింది. గురువారం ఉదయం 8.00 గంటలకు ఈ బృందం ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకుంది. వీరి బృందంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరు లద్దాఖ్కు చెందిన కౌసర్ ఫాతిమా, పశ్చిమబెంగాల్కు చెందిన మూన్మూన్ ఘోష్, ఉత్తరాఖండ్కు చెందిన రబేకా సింగ్, కార్గిల్కు చెందిన త్సెరింగ్ చోరోల్ అనే కానిస్టేబుళ్లు. ఎవరెస్ట్పైన సాధారణంగా నిలబడటానికే ప్రాణవాయువు అవసరముంటుంది. అలాంటిది, అత్యంత ప్రమాదకరమైన ఆ ప్రదేశంలో వీరంతా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వీరి ఘటనను చాటుతూ బీఎస్ఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. నారీ శక్తి అజేయ సంకల్పానికి, పట్టుదలకు ఇది నిదర్శనమని, మహిళా సాధికారతకు తార్కాణమని తెలిపింది. ఐటీబీపీ మొదటి మహిళా బృందం ఘనత ఐటీబీపీ చరిత్రలోనే ఇది మొట్టమొదటి పూర్తి మహిళా అంతర్జాతీయ పర్వతారోహణ యాత్ర. మొత్తం 14 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్లో 11 మంది మహిళా పర్వతారోహకులు, ముగ్గురు సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరంతా నేపాల్ వైపు ఉన్న కఠినమైన సౌత్ కోల్ రూట్ గుండా ప్రయాణించి గురువారం ఉదయం 6.52 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. ఈ మహిళా జవాన్లు కేవలం రికార్డు కోసమే కాకుండా ‘క్లీన్ హిమాలయ–సేవ్ గ్లేసియర్’నినాదాన్ని వినిపించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఎవరెస్ట్ పరిసర ప్రాంతాలలో పేరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర కుళ్లిపోని వ్యర్థాలను సేకరించి, పర్యావరణ స్పృహ ను చాటారు. ‘ఎవరెస్ట్ శిఖరంపై చరిత్ర నెలకొల్పాం. అత్యంత కఠినమైన వాతావరణం, తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, 8వేల మీటర్లకు మించి ఎత్తులో ఉండే భయంకరమైన డెత్ జోన్ను అధిగమించి మా 11 మంది మహిళా సైనికులు ఈ మైలురాయిని అందుకున్నారు. ఇది మన దేశానికి ఎంతో గర్వకారణమైన క్షణం’అని ఐటీబీపీ పేర్కొంది. ఈ విజయంతో ఐటీబీపీ ఇప్పటివరకు ఐదుసార్లు ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన 14 శిఖరాలకుగాను ఆరింటి(ఎవరెస్ట్, కాంచనగంగ, మకాలు, లోట్సే, ధౌలగిరి, మనస్లు)ని విజయవంతంగా అధిరోహించినట్లయింది. -
మన సరిహద్దులు ఆర్మీ చేతుల్లో భద్రం
న్యూఢిల్లీ/గుర్గావ్: దేశానికి చెందిన భూభాగం యావత్తూ మన భద్రతా బలగాల పూర్తి రక్షణలోనే ఉందని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్.ఎస్.దేశ్వాల్ స్పష్టం చేశారు. ఆదివారం గుర్గావ్లో బీఎస్ఎఫ్ ఆధ్వ ర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా జనరల్ దేశ్వాల్ మాట్లాడు తూ..‘మన దేశ భూభాగమంతా మన చేతుల్లోనే ఉంది. పూర్తిగా మన భద్రతా బలగాల అధీనంలోనే ఉంది. మన సరి హద్దులన్నీ సురక్షితంగా ఉన్నాయి. మన బలగాలు చురుగ్గా, సమర్ధంగా, అం కితభావంతో పనిచేస్తున్నాయి. సరిహ ద్దుల్లో ఎలాంటి శత్రువునైనా ఎదు ర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’అని తెలిపారు. కాగా, ఫింగర్ –4 వద్ద మోహ రించిన బలగాల్లో మరికొన్నిటినీ, పాంగాం గ్ సో సరస్సులో ఉన్న కొన్ని గస్తీ పడవలను చైనా ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ పూర్తిగా చేపట్టేందుకు అవసరమైన మార్గదర్శకాలకు తుదిరూపం ఇచ్చేందుకు భారత, చైనా బలగాల మధ్య మరో విడత చర్చలు జరగనున్న నేప థ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ఉద్యోగాలు
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. కానిస్టేబుల్ (పయనీర్) ఖాళీల సంఖ్య: 497 విభాగాలు: ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, మాసన్ వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం అవసరం. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 9 వెబ్సైట్: http://itbpolice.nic.in/ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్నికల్ అసిస్టెంట్ టి-3 అర్హతలు: అగ్రికల్చర్ సెన్సైస్లో బ్యాచిలర్స్ డిగ్రీ. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 25 వెబ్సైట్: www.nrcpb.org.in -
ఉద్యోగాలు
ఐటీబీపీఎఫ్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. విభాగం: టెలికమ్యూనికేషన్ పోస్టుల సంఖ్య: 299 అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా పదోతరగతితో పాటు ఎలక్ట్రానిక్స్ / కమ్యూనికేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రికల్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష ద్వారా. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: అక్టోబరు 24 వెబ్సైట్: http://itbpolice.nic.in/ మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు -
ఉద్యోగాలు
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) పారామెడికల్ విభాగంలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్): 8 అర్హతలు: ఇంటర్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. వయసు: 21నుంచి30 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఫార్మసిస్ట్): 13 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ల్యాబ్ టెక్నీషియన్): 4 అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫార్మసీ/ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొ మా ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 20నుంచి28 ఏళ్ల మధ్య ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫ్): 10 అర్హతలు: పదో తరగతి, యాక్జిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ సర్టిఫికెట్ కోర్సుతో పాటు నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. వయసు: 18నుంచి25 ఏళ్ల మధ్య ఉండాలి. శారీరక ప్రమాణాలు: పురుషులు ఎత్తు 170 సెం.మీ., ఛాతి 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి. ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వోక్ ఎగ్జామినేషన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 5 వెబ్సైట్: http://itbpolice.nic.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్టాఫ్ నర్స్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ జూనియర్ టెక్నీషియన్ అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది:ఆగస్టు11 వెబ్సైట్: www.nimhans.kar.nic.in


