indian weight lifters
-
మీరాబాయి చానుకు కీలక పదవి.. వెయిట్లిఫ్టర్ స్పందన ఇదే
న్యూఢిల్లీ: స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను... భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎన్నికైంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం చేజిక్కించుకొని చరిత్ర సృష్టించిన చాను... సహచర లిఫ్టర్లకు తోడ్పాటు అందించేందుకు ఇది సహకరిస్తుందని పేర్కొంది. ‘తోటి లిఫ్టర్ల తరఫున మాట్లాడే అవకాశం దక్కంది. దీన్ని సద్వినియోగ పర్చుకుంటా. పదవితో వచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా.క్రీడేతర అంశాలపై దృష్టి పడకుండా... వెయిట్లిఫ్టింగ్కు మరింత తోడ్పాటు అందించేందుకు నా వంతు కృషి చేస్తా. లిఫ్టర్ల సమస్యలతో పాటు అన్ని కోణాల్లో దృష్టి సారిస్తా’ అని మీరాబాయి చాను ఒక ప్రకటనలో తెలిపింది. టోక్యో ఒలింపిక్స్లో చాను 49 కేజీల విభాగంలో రజతం గెలిచి... ఈ ఘనత సాధించిన తొలి భారత లిఫ్టర్గా నిలిచింది. అంతకుముందు (2000 సిడ్నీ ఒలింపిక్స్) భారత్ నుంచి వెయిట్లిఫ్టింగ్లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం నెగ్గింది. అదే అనిశ్చితి: గందరగోళంలో భారత బాక్సింగ్ సంఘంన్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సంఘం (బీఎఫ్ఐ)లో అనిశ్చితి కొనసాగుతోంది. రాష్ట్ర సంఘాలన్నీ వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంటే... తాజాగా ఎన్నికైన తాత్కాలిక కమిటీ మాత్రం జాతీయ చాంపియన్షిప్ల నిర్వహణ, కోచ్ల నియామకం, అంతర్జాతీయ టోర్నీలో ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా... న్యాయపరమైన సమస్యలతో ఆలస్యమైంది.గత నెల 28న ఎన్నికలు నిర్వహించాలని మొదట నిర్ణయించగా... సమాయాభావం వల్ల అదీ సాధ్యపడలేదు. తాజాగా ఈ నెల 28 లోపు ఎన్నికలు నిర్వహించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. చాన్నాళ్లు బీఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ సింగ్... తాత్కాలిక కమిటీకి కూడా చీఫ్గా కొనసాగుతున్నాడు.‘సుదీర్ఘ అనుభవం ఉన్న అజయ్ సింగ్... ఎన్నికలను వాయిదా వేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు’ అని అస్సాం బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు, హేమంత్ అన్నారు. ‘అజయ్ సింగ్ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఏడాది కాలంగా ఒక్క చాంపియన్షిప్ కూడా నిర్వహించలేదు. పారిస్ ఒలింపిక్స్లో మనవాళ్లకు రిక్తహస్తాలే మిగిలాయి’ అని మధ్యప్రదేశ్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. -
నా శ్రమంతా వృథా అవుతుంది
న్యూఢిల్లీ: ఒకవేళ టోక్యో ఒలింపిక్స్ రద్దు అయితే నాలుగేళ్ల తన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని భారత వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా ఆటగాళ్లంతా ఒలింపిక్స్ వాయిదా వేయాలని పట్టుబడుతుంటే ఈ మణిపురి లిఫ్టర్ మాత్రం సకాలంలో ఈ మెగా ఈవెంట్ జరగాలని కోరుకుంటోంది. ‘ఒలింపిక్స్ రద్దవుతే మా శ్రమంతా వృథా అవుతుంది. ఒలింపిక్స్ పతకం కోసం నాలుగేళ్లుగా శ్రమిస్తున్నా. నేను ఇది కోరుకోవట్లేదు. రోజూ దేవున్ని దీని గురించే ప్రార్థిస్తున్నా. ఒక వేళ ఇవి వాయిదా పడినా ఇబ్బందే. ప్రాక్టీస్లో తీవ్రత తగ్గిపోతుంది. ఇది పతక అవకాశాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి సకాలంలో ఒలింపిక్స్ జరిగితే బావుంటుంది’ అని ఇప్పటికే ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకున్న చాను తెలిపింది. కరోనా కారణంగా వెయిట్ లిఫ్టర్లు ప్రాక్టీస్ చేసే పాటియాలా జాతీయ ట్రెయినింగ్ సెంటర్ కూడా మూసేస్తారని తొలుత భయపడినట్లు ఆమె చెప్పింది. అయితే కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులను మినహాయించి మిగతా క్రీడాకారుల్ని ఇళ్లకు పంపించివేశారని తెలిపింది. ‘అకాడమీ కూడా లిఫ్టర్లు లేక వెలవెలబోతుంది. కేవలం ఒలింపిక్స్ ఆశావహులు మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. మమ్మల్ని కూడా పంపిస్తారని ముందుగా భయపడ్డా. కానీ అలాంటిదేమీ లేదు. తగిన ఆరోగ్య భద్రతలు పాటిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాం’ అని చాను వివరించింది. -
రాహుల్కు ఐదు పతకాలు
న్యూఢిల్లీ: ఏకకాలంలో జరుగుతున్న ఆసియా కప్, ఆసియా ఇంటర్ క్లబ్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత వెయిట్లిఫ్టర్లు పతకాల పంట పండించారు. ఉత్తర కొరియాలోని ప్యాంగ్యాంగ్ నగరంలో జరుగుతున్న ఈ ఈవెంట్లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో 25 పతకాలు (12 రజతాలు, 13 కాంస్యాలు) చేరాయి. ఆంధ్రప్రదేశ్ వెయిట్లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ మూడు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు సాధించాడు. ఆసియా కప్లో రాహుల్ 77 కేజీల విభాగంలో రెండు రజతాలు (స్నాచ్, టోటల్ అంశాల్లో), కాంస్యం (క్లీన్ అండ్ జెర్క్లో) నెగ్గాడు. ఆసియా ఇంటర్ క్లబ్ పోటీల్లో ఈ గుంటూరు జిల్లా లిఫ్టర్ రజతం (స్నాచ్లో), కాంస్యం (టోటల్ లిఫ్ట్) దక్కించుకున్నాడు.