breaking news
Ikkat
-
అందాల నారీమణులతో ‘శారీ’గమలు
సాక్షి, యాదాద్రి: చేనేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి పరిచయం చేయడమే ప్రథమ లక్ష్యంగా.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెల ముందు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే అందగత్తెలు ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లిలోని రూరల్ టూరిజం రిసార్టుకు ప్రపంచ సుందరీమణులు 25 మంది రానున్నారు. వీరి రాక సందర్భంగా ఇక్కడి ఇక్కత్ చీరల ప్రాధాన్యాన్ని వారికి తెలియజేస్తారు.ఇందువల్ల స్థానిక చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నమిది. ఈ సందర్భంగా యాదగిరిగుట్టకు కూడా సుందరీమణులు రానున్నారు. కొండపైన స్వామి వారి దర్శనం అనంతరం.. కొండ కింద ఫొటో సెషన్ ఉంటుంది.చేనేత కళాకారులతో మాటామంతీమిస్ వరల్డ్ పోటీదారులు (Miss World 2025 contestants) స్థానికంగా చేనేత కళాకారులతో ముచ్చటిస్తారు. చీరల తయారీకి వాడే దారం పుట్టుక నుంచి.. వస్త్రం తయారీ వరకు.. పలు అంచెల్లో వస్త్రాల తయారీని ఎలా రూపొందిస్తారో వారు అడిగి తెలుసుకుంటారు.యాంఫీ థియేటర్లో ప్రదర్శనపోచంపల్లిలోని టూరిజం సెంటర్ యాంఫీ థియే టర్లో విభిన్నమైన చేనేత వస్త్రాల ప్రదర్శన ఉంటుంది. చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాల్.. ఇలా పలు రకాల వస్త్రాల ప్రదర్శన ద్వారా సంప్ర దాయ, ఆధునికత కలిసిన నూతన ప్యాషన్ వస్త్రాలను ప్రదర్శిస్తారు. దీనిద్వారా సంప్రదాయం, ఆధునికత కలిసి నూతన ప్యాషన్ అనే మాటకు చిరునామా కాబోతున్నాయి. ఇందువల్ల దేశ విదేశాల యువతలో చేనేతకు గౌరవం లభిస్తుంది. ప్రముఖులు ఇప్పటికే పొచంపల్లి వస్త్రాలను ధరించడం ప్యాషన్గా మారింది. స్టాళ్లలో ప్రదర్శనలు పూర్తిగా గ్రామీణ వాతావరణం కల్పించేందుకు టూరిజం పార్క్ను సిద్ధం చేశారు. సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట, గద్వాల చీరలు, పోచంపల్లి, పుట్టపాక, సిరిపురాలలో తయారయ్యే వస్త్రాలను ప్రదర్శిస్తారు. వీటిని స్థానిక మహిళలు ధరిస్తారు. సంప్రదాయంగా వచ్చిన వస్త్రాలను ఆధునిక ప్యాషన్ డిజైనర్లతో కొత్త రకంగా వస్త్రాలను రూపొందించి అందగత్తెల ముందు ప్రదర్శిస్తారు. ఇక్కత్ డిజైన్లతో తయారవుతున్న తేలియా రుమాల్, సిల్క్, కాటన్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కాప్స్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టన్స్, పిల్లో కవర్స్ తదితర వెరైటీలను ప్రదర్శించనున్నారు. చదవండి: సరసర్వతి నది పుష్కరాలకు నీళ్లు వచ్చాయి -
వెరైటీ ఇక్కత్ పట్టుచీర..
భూదాన్పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లికి చెందిన సాయిని భరత్ అనే యువ చేనేత కళాకారుడు (Weaver) రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, వేర్వేరు రంగులు కలిగిన ఇక్కత్పట్టు చీరను (ikkat silk saree) నేసి ఔరా అనిపించారు. కొద్ది సంవత్సరాల క్రితం ఆయన మొదటి సారిగా రెండు వేర్వేరు రంగులు, డిజైన్లు కలిగిన ఇక్కత్ దుపట్టాను మగ్గంపై తయారు చేశారు. ఎంతో కళాత్మకంగా దుపట్టాను రూపొందించినందుకు గాను 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ (National Merit Certificate) అందుకున్నారు.ఎంటెక్ చేసిన సాయిని భరత్.. అదే స్ఫూర్తితో ఇక్కత్ కీర్తిని ద్విగుణీకృతం చేయాలని రెండున్నర ఏళ్లు కష్టపడి, ఎంతో సృజనాత్మకంగా ఆలోచించి ఒక చీరకు వేర్వేరు డిజైన్లు, రంగులు వచ్చేలా అభివృద్ధి చేశారు. అనంతరం టై అండ్ డై డిజైనింగ్, మగ్గంతో పాటు వీవింగ్లో సైతం ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని వినియోగించి 15 రోజులు మగ్గంపైనేసి రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, రంగులు కలిగిన ఉల్టా లేని పట్టు చీరను తయారు చేశారు.ప్రస్తుతం ఆయన కొత్త డిజైన్లతో 3 శాంపిల్ ఇక్కత్ పట్టుచీరలను రూపొందించారు. వీటికి పేటెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కత్లో సాధ్యం కాని ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి.. పరిశ్రమకు కొత్త ఇమేజ్ తీసుకొస్తున్న భరత్ ప్రతిభను పలువురు కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు ప్రశంసిస్తున్నారు. పట్టుచీరలే కాకుండా భవిష్యత్తులో ఫర్నిషింగ్ వస్త్రాలనూ (Furnishing Cloth) రూపొందించనున్నట్లు భరత్ తెలిపారు. చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం హైదరాబాద్: చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిక్కా దేవదాసు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం చిక్కడపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత, జౌళి శాఖలను వేరు చేయాలని, చేనేతకు రెండు వేల కోట్ల నిధులను విడుదల చేయాలన్నారు.చదవండి: ప్రాణం తీసిన చీర గొడవగత సంవత్సరం ఆర్థిక ఇబ్బందులకుతోడు ఉపాధి లభించకపోవడంతో 27 మంది చేనేతే కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇ చ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నేతలు శ్రీనివాస్, సుదర్శన్, నాగమూర్తి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
జీరో వేస్ట్ : పల్లె నుంచి పట్నానికి ఫ్యాషన్ (ఫోటోలు)