-
రెండో స్థానంలో హైదరాబాద్ బాలుర జట్టు
అంతర్ జిల్లా స్కూల్స్ అండర్-14 హ్యాండ్బాల్ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ స్కూల్స్ అండర్-14 బాలుర హ్యాండ్బాల్ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు రెండో స్థానం లభించింది. వరంగల్ జిల్లా స్కూల్స్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో వరంగల్లోని జేఎన్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో వరంగల్ జట్టు 11-9 స్కోరుతో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ సెలక్షన్ టోర్నీలో జాతీయ స్కూల్స్ అండర్-14 హ్యాండ్బాల్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టును ఎంపిక చేశారు. ఇందులో హైదరాబాద్కు చెందిన ముగ్గురు క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. సందీప్(తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ స్కూల్, షేక్పేట్), వి.సాయి కిరణ్ (గతి గవర్నమెంట్ హైస్కూల్), ఎం.సాయి అభినవ్ (లిటిల్ ఫ్లవర్ హైస్కూల్) ఎంపికయ్యారు. జాతీయ పోటీలు వచ్చే నెల మొదటి వారంలో నాగ్పూర్లో జరుగుతాయి. -
‘హైదరాబాద్ ఏసెస్’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ‘ఏసెస్’గా ఖరారుచేశారు. గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో జట్టు పేరును ప్రకటించారు. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్రాజ్ ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నగరానికి చెందిన మాజీ ఆటగాడు డాక్టర్ కె. రామరాజు, రాజేశ్ రాజు హైదరాబాద్ ఫ్రాంచైజీకి యజమానులుగా ఉన్నారు. ఏసెస్ జట్టుకు మార్క్ ఫిలిప్పోసిస్, మార్టినా హింగిస్, మిఖాయిల్ యూజ్నీ, జీవన్ నెడుంజెళియన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ జట్టు హోం మ్యాచ్లు ఈ నెల 17, 18 తేదీల్లో ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో జరుగుతాయి. 17న బెంగళూరుతో, 18న పుణేతో ఏసెస్ టీమ్ తలపడుతుంది. సీటీఎల్ వల్ల భారత్లోని వర్ధమాన టెన్నిస్ ఆటగాళ్లకు మేలు జరుగుతుందని, ఆటకు మరింత ప్రాచుర్యం లభిస్తుందని ఈ సందర్భంగా అమృత్రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు, ప్రకాశ్ అమృత్రాజ్, ఫ్రాంచైజీ యజమానులు పాల్గొన్నారు. గేమ్ల ఆధారంగా... సీటీఎల్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో మూడు జట్లు ఉంటాయి. తమ గ్రూప్లోని ఇతర రెండు టీమ్లతో తలపడిన అనంతరం పాయింట్ల ఆధారంగా టీమ్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ప్రతీ మ్యాచ్లో ఐదు సెట్లు ఉంటాయి. ఒక్కో సెట్ ఆరు గేమ్ల చొప్పున సాగుతుంది. లెజెండ్స్ సింగిల్స్, మెన్స్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్, మెన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లుగా ఈ ఐదు సెట్లను వర్గీకరించారు. సెట్ల ఆధారంగా కాకుండా ఐదు సెట్లలో కలిపి ఒక జట్టు సాధించిన గేమ్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ టోర్నీ చాంపియన్కు రూ. 1 కోటి, రన్నరప్కు రూ. 50 లక్షలు ప్రైజ్మనీగా లభిస్తుంది. 10 రోజుల పాటు జరిగే ఈ లీగ్లో మొత్తం 13 మ్యాచ్లు జరుగుతాయి.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement