breaking news
heart touching
-
చూపు లేకపోయినా.... ప్రపంచమంతా చూస్తోంది!
ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐబీఎస్ఎఫ్) వరల్డ్ గేమ్స్లో టీ 20 క్రికెట్ భాగం అయిన తరవాత కొత్తగా ఏర్పాటైన భారత మహిళా క్రికెట్ జట్టు తమ అద్భుత ప్రతిభతో క్రీడాలోకాన్ని ఆకట్టుకుంది. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచింది. ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించడాన్ని దృష్టిలో పెట్టుకొని... ‘మా విజయానికి నాకు మాటలు రావడం లేదు. క్రికెట్లో నేను మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. చిన్నప్పుడు ఎంతోమంది క్రికెటర్ల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు మా గురించి మాట్లాడు కుంటుంటే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది’ అంటుంది కర్నాటకకు చెందిన దీపిక టీసి.ఆటలో అత్యత్తమ ప్రతిభ కనబరుస్తున్న బ్లైండ్ ఇండియన్ ఉమెన్ టీమ్పై ‘దేఖ్లే ఇండియా’ పేరుతో శాంతి మోహన్, ముకుంద మూర్తి డాక్యుమెంటరీ నిర్మించారు. ‘భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాల నుంచి రావడం వల్ల తొలిరోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. మొదట నే΄ాల్తో జరిగిన మ్యాచ్లో సమన్వయం చేయడం కష్టమైంది. దీంతో ఓడి΄ోయాం. క్రమక్రమంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలైంది. సమన్వయం చేసుకోవడంతో సులభం అయింది’ అంటుంది కర్నాటక ప్లేయర్, టీమ్ కెప్టెన్ వర్ష. ‘మాకు కావాల్సింది మీ సానుభూతి కాదు. మద్దతు’ అంటున్నారు టీమ్ సభ్యులు.‘మన దేశంలో క్రికెట్ అనేది చాలా పాపులర్ అయినప్పటికీ చాలామందికి బ్లైండ్ క్రికెట్ ఉమెన్ టీమ్ ఉంది అనే విషయం తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డాక్యుమెంటరీ తీయాలనుకున్నాం. ఈ జట్టులో ఉన్న అమ్మాయిలు అంధులు మాత్రమే కాదు కఠినమైన సామాజిక, ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చినవారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం అనేది సాధారణ విషయం కాదు’ అంటున్నాడు ‘దేఖ్లే ఇండియా’ డాక్యుమెంటరీ నిర్మించిన వారిలో ఒకరైన శాంతి మోహన్ -
‘అయ్యా.. లేవయ్యా’.. తిండి పెట్టిన ఓనర్ కోసం ఆ వానరం
-
అతడు సత్యవంతుడు
సత్యవంతుడి కోసం సావిత్రి యముడితో పోరాడింది... నేను నా భార్యకోసం సత్యవంతుడిలా పోరాడుతున్నాను... అంటున్నాడు విజయ్ మండల్.గత నాలుగేళ్లుగా ఇతను భార్యకు 24 గంటల్లో కావలసిన 3 ఆక్సిజన్ సిలిండర్లను రోజూ భుజంపై మోస్తున్నాడు. ఇందుకోసం సిలిండర్తో రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తాడు. అలుపు లేదు. ఆగిందీ లేదు. బిహార్ భాగల్పూర్కు చెందిన ఈ భర్తకు భార్య కన్నీటి కృతజ్ఞత తెలుపుతుంటోంది. నేటి ఉలిక్కిపడే వార్తల మధ్య ఈ అనుబంధం ఎంతో ఆదర్శం.భర్త కోసం భార్యలు పోరాడిన గాథలు ఉన్నాయి. కాని భార్య కోసం భర్తలు చేసే త్యాగాలు లోకం దృష్టికి రావడం తక్కువ. కాని విజయ్ మండల్ కథ విస్మరించను వీలు కానిది. ఒక మనిషి నిజమైన హృదయంతో పూనుకుంటే తప్ప ఇలాంటి ఘనకార్యాన్ని, ఘనమైన సేవను చేయలేడు. బిహార్లోనే ఇటువంటి భర్తలు ఉన్నారేమో. గతంలో దశరథ్ మాంఝీ అనే అతను తన భార్యకు సమయానికి వైద్యం అందనివ్వకుండా అడ్డుగా నిలిచిన కొండను ఒక్కడే తొలిచి, దారి వేసి ‘మౌంటెన్ మేన్’ అనిపించుకున్నాడు. కరోనా తర్వాత రోగగ్రస్త అయిన భార్య కోసం నాలుగేళ్లుగా పట్టుదలగా ఆక్సిజన్ సిలిండర్లు మోస్తున్న విజయ్ మండల్ను ‘ఆక్సిజన్ మేన్’ అనొచ్చేమో.భాగల్పూర్ నుంచివిజయ్ మండల్ది బిహార్లోని భాగల్పూర్కు దగ్గరలోని కహల్గావ్. ఇక్కడ అతను చిన్న కిరాణా షాపు నడిపేవాడు. భార్య అనితాదేవికి 2021లో కరోనా సోకింది. పరిస్థితి చాలా సీరియస్ అయ్యింది. భార్యను బతికించుకోవడానికి విజయ్ మండల్ చేయని ప్రయత్నం లేదు. కూతురి పెళ్లి కోసం దాచిన 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. చివరకు ఢిల్లీ ఎయిమ్స్కు కూడా తీసుకెళ్లారు. వాళ్లు ఆమెను చేర్చుకొని అన్ని విధాలా వైద్యం చేసి చివరకు ‘ఈమె ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకోవు. బతికి ఉన్నంత కాలం ఆక్సిజన్ మీద బతకాల్సిందే’ అని చెప్పి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చి పంపారు. అది సంవత్సరంలో చెడిపోయింది. ఇంకోటి కొన్నా దాని పరిస్థితీ అంతే. దాంతో స్థానికంగా దొరికే ఆక్సిజన్ సిలిండర్లే మేలని వాటితో భార్యను బతికించుకోవాలని విజయ్ మండల్ నిశ్చయించుకున్నాడు.ఉదయాన్నే 4 గంటలకు లేచిఒక్కో సిలిండర్ 8 గంటలు వస్తుంది. అందుకే ఖాళీ అయిన దానిని వెంటనే ఇచ్చి నిండింది తెచ్చుకోవాలి. విజయ్ మండల్ దినచర్య ఇలా ఉంటుంది. అతడు తన ఊరు రసల్పూర్ నుంచి తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ‘ఇక్చారి’ రైల్వేస్టేషన్కు సిలిండర్ మోసుకొని బయలుదేరుతాడు. అక్కడ రైలు పట్టుకుని 50 నిమిషాల దూరంలోని భాగల్పూర్ చేరుకుంటాడు. అక్కడి నుంచి ఆక్సిజన్ దొరికే చోటుకు వెళ్లి సిలిండర్ తీసుకుని 9 గంటలకు ఇల్లు చేరుతాడు. మళ్లీ 11కు వెళ్లి ఒంటి గంటకు వస్తాడు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లి 7కు తిరిగి వస్తాడు. అంటే రోజులో భుజాన సిలిండర్తో 30 కిలోమీటర్లు అతడు నడుస్తాడు. అతని భుజం కదుం కట్టి పోయింది. ‘ఎందుకు ఆక్సిజన్ మోస్తూ కనిపిస్తావు’ అని ఎవరైనా అడిగితే ‘ఒక పక్షి దాహంతో ఉంది. దాని కోసం’ అని సమాధానం చెబుతాడు.ఆయుష్మాన్ కార్డు‘ఒకరికొకరు తోడుండటమే వివాహం అంటే. ఆమె మరణించేవరకూ నేనే తోడు’ అంటాడు విజయ్ మండల్. ఇతని గాథ అందరికీ తెలిసినా స్థానిక అధికారులు ఆయుష్మాన్ కార్డు ఇచ్చి సరిపెట్టారు. ఒక మనిషి ఆక్సిజన్ కోసం ఇంతగా ఎందుకు తిరగాలి పర్మినెంట్ సొల్యూషన్ ఏమిటి అనేది ప్రభుత్వం ఆలోచించడం లేదు. పిచ్చివాడిలా గడ్డం పెంచుకుని తిరుగుతున్న ఆ భర్తను చూసి భార్య రెండు చేతులూ జోడిస్తుంటుంది. ‘ఉత్త పుణ్యానికి భార్యలను హతమార్చే ఈ రోజుల్లో అనారోగ్యంతో ఉన్న నన్ను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్నాడు నా భర్త’ అని కన్నీరు కారుస్తుంది. విజయ్ మండల్ ఆ మాటలు పట్టించుకోడు. తనకు మిగిలిన టైమ్లో ఆమె దగ్గర కూచుంటాడు. పాదాలు నొక్కుతాడు. కబుర్లు చెబుతాడు. ఆమెలో జీవితేచ్ఛ నశించకుండా చూసుకుంటాడు. ఒక మనిషి ఇంత గొప్పగా ఉంటాడా? ఉంటాడు. ప్రతి మనిషి ఇలా ఉంటే కనీసం ఇంతలో కొంతగా అయినా ఉంటే ఎంత బాగుణ్ణు. ఇంట్లోని గదినే ఐసియుగా మార్చి...‘నేను బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. భార్యను ఎంత బాగా చూసుకోవాలనే విషయం పై నేను ఒక ఉదాహరణగా నిలవాలి’ అన్నాడు విజయ్ మండల్. అతను తాను నడిపే కిరాణా దుకాణాన్ని కొడుక్కు అప్పజెప్పి జీవితాన్ని ఇక పూర్తిగా భార్యకు అంకితం చేశాడు. మూడు ఆక్సిజన్ సిలిండర్లను పర్మినెంట్గా ఉండేలా కొనేశాడు. వాటిని నింపుకొని రావడమే ఇప్పుడతని కర్తవ్యం. -
ఆయనో స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్! మీనా పెళ్లిలో మాత్రం భావోద్వేగంతో..
సముద్రం సునామీగా ముంచెత్తి దాదాపు 6 వేల మందిని పొట్టనబెట్టుకుంది. అంతటి ప్రళయం నుంచి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడినవాళ్లు కొందరే. అందులో రెండేళ్ల ఓ పసిప్రాణం కూడా ఉంది. పసికందుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆమెపై అక్షింతలు జల్లి దీవించి భావోద్వేగానికి లోనయ్యారు. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటనలోకి వెళ్తే.. డిసెంబర్ 26, 2004 ముంచెత్తిన సునామీలో తమిళనాడుకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే. నాగపట్టణంలో సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరున్న రాధాకృష్ణన్కు అప్పగించింది. అప్పుడు ఆయన తంజావూరు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 28వ తేదీన కీచన్కుప్పం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలకు.. శిథిలాల కింద ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. దాదాపు రెండేళ్ల వయసున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ సునామీ నుంచి బయటపడిన అతిచిన్న వయస్కురాలు కూడా ఆమెనే!. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అలాంటప్పడు చిన్నారి సంరక్షణ బాధ్యతలు ఎలా? అని అధికారులు ఆలోచన చేశారు.ఈలోపు.. విషయం తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్-కృతిక దంపతులు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి మీనా అని పేరు పెట్టి.. అన్నై సత్య ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ మొత్తం ఆ జంటే చూసుకుంటూ వచ్చింది. ఈలోపు రాధాకృష్ణన్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మరో ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ.. రాధాకృష్ణన్ జంట మీనా సంరక్షణ బాధ్యతను మరిచిపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అదే ఆశ్రమంలో సౌమ్య ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలా.. ఏళ్లు గడిచిపోయాయి. సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత.. వాళ్లకు ఆశ్రమంలో కొనసాగడానికి వీలు ఉండదు. ఆశ్రమంలో సౌమ్య, మీనాలకు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైంది. విషయం తెలిసి.. రాధాకృష్ణన్ ముందుకొచ్చారు. మీనా, సౌమ్య బాధ్యతలకు దాతల సహకారం తీసుకున్నారు. అలా.. వాళ్లిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. అలా వాళ్లిద్దరికీ తండ్రికాని తండ్రిగా మారిపోయారు.రెండేళ్ల కిందట.. సౌమ్య ఓ టెక్నీషియన్ను వివాహం చేసుకుంది. ఆ వివాహానికి సౌమ్య తరఫున పెద్దగా రాధాకృష్ణన్ హాజరై ఆశీర్వదించారు. కిందటి ఏడాది సౌమ్య ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఇంటికి పిలిపించుకుని మరీ మనవరాలిని దీవించారు. ఇక మీనా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. నర్సింగ్ పూర్తి చేసుకుంది. మీనాను వివాహం చేసుకునేందుకు మణిమరన్ అనే బ్యాంక్ ఉద్యోగి ముందుకు వచ్చాడు. విషయం తెలిసి రాధాకృష్ణన్ సంతోషించారు. ఫిబ్రవరి 2వ తేదీన నాగపట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీనా-మణిమరన్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు సౌమ్య తన భర్త, కూతురితో హాజరైంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దత్త పుత్రిక వివాహానికి స్వయంగా హాజరై తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించారు. ఆశ్రమంలో సౌమ్య-మీనాలు గడిపిన రోజులను, వాళ్ల స్నేహాన్ని, ఆశ్రమ నిర్వహణకు సహకరించిన సూర్యకళను ఆయన గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మించి.. 2018లో గాజా తుపాన్ సమీక్ష కోసం వెళ్లినప్పుడు మీనా తనను ‘‘నాన్నా..’’ అని పిలవడాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం గమనార్హం. -
హృదయాల్ని కదిలిస్తున్న చిన్నారి : వైరల్ వీడియో
సాధారణంగా కన్నబిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. అమ్మా, నాన్న చేయి పట్టుకుని అడుగులు నేర్చుకునే వయసులోనే తల్లిదండ్రులను చేయి పట్టుకొని భద్రంగా తీసుకెళుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ఆకర్షణీయంగా నిలిచింది.In a touching emotional scene, a child is helping his blind parents at an age when they have to teach him to walk. pic.twitter.com/zVVSXHexlx— Akanksha Parmar (@iAkankshaP) July 18, 2024ఆకాంక్ష పర్మార్ అనే యూజర్ ఎక్స్లో ఈ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఇదీ సంస్కారం అంటే’ అంటూ నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. హృదయాన్ని కదిలిస్తోంది అంటూ చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే ఇలాంటి వారికోసం ప్రభుత్వం పూనుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలని మరికొంతమంది సూచించారు. -
ఈ స్నేహం ఎంత గొప్పదో
-
Heart Touching Photo: ఒక్క ఫోటోతో హృదయాలను కదలిస్తున్న బాలిక
వంద మాటలు మాట్లాడినా అర్థంకాని కొన్ని విషయాలు ఒక్క చిత్రం చూస్తే ఇట్టే అర్థం అవుతాయి. మనం చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ఫోటో చెబుతుంది. వంద మాటలకు సమాధానంగా నిలుస్తుంది.కొన్ని చిత్రాలు మనసుకు హాయినిస్తే.. మరికొన్ని దృశ్యాలు గుండెలు పిండేసేలా కనిపిస్తాయి. ఫోటో జీవిత సత్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఎన్నో సమస్యలను ప్రతిబింబిస్తుంది. తాజాగా ఓ విద్యార్థిని పాఠశాలలోని తరగతి గదిలో కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మణిపూర్ రాష్ట్రంలోని తమెంగ్లాంగ్కు చెందిన పదేళ్ల చిన్నారి పమి నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో చిన్నారి ఓ రోజు తన రెండేళ్ల చెల్లెల్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని తరగతి గదిలో పాఠాలు వినేందుకు వచ్చింది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయం పనుల నిమిత్తం పొద్దున్నే పొలానికి వెళ్లడంతో చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యతను తనకు అప్పగించారు. అయితే చదువుకోవాలన్న ఆసక్తి కలిగిన పామి తన చెల్లెల్ని ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లలేక తనను తీసుకొని స్కూల్కి వెళ్లింది. తరగతి గదిలో చెల్లెల్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని పాఠాలు వినడం, రాసుకోవడం చేస్తుంది. చదవండి: విద్యార్థులతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన మహిళా కలెక్టర్.. వీడియో వైరల్! చదువుపై తనకున్న ఆసక్తి, తల్లిదండ్రుల అప్పజెప్పిన బాధ్యతను రెండింటిని కలగలిపి చూపించే ఈ దృశ్యం అందర్ని మనసుల్ని కదిలిస్తోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. చెల్లెలి బాధ్యత, భవిష్యత్తు కోసం చిన్నారి పడుతున్న తపనను అభినందిస్తున్నారు. పమి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవడంతో ఈ విషయం రాష్ట్ర మంత్రి వరకు చేరింది. ఈ ఫోటోలపై మణిపూర్ మంత్రి స్పందించారు. చదువు పట్ల చిన్నారికి ఉన్న అంకితభావం తనను ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తను చూసిన తర్వాత బాలిక కుటుంబాన్ని గుర్తించామని, వారిని ఇంఫాల్ తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. బాలిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు తానే చదివిస్తానంటూ ఆమె కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. Her dedication for education is what left me amazed! This 10-year-old girl named Meiningsinliu Pamei from Tamenglong, Manipur attends school babysitting her sister, as her parents were out for farming & studies while keeping her younger sister in her lap. pic.twitter.com/OUIwQ6fUQR — Th.Biswajit Singh (@BiswajitThongam) April 2, 2022 -
చూస్తే చాలు కళ్లు చెమరుస్తాయి.. దీపావళి వేళ.. మనసును హత్తుకునేలా
దీపావళి పండగ అంటే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అంతా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బిజినెస్ సెక్టార్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. స్టాక్మార్కెట్లో ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్ ఉంటుంది. దాదాపు అన్ని వ్యాపార సంస్థలులు ధమాకా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే మనసును ఆకట్టుకునేలా యాడ్స్ రూపొందించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. అందులో ఈసారి వచ్చిన కొన్ని ప్రకటనలు మనసును హత్తుకునేలా.. గుండె తడిని పెంచేలా.. ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా భావంతో కట్టిపడేసేలా వాటిని రూపొందించారు. పండగ వేళ మీరు వాటిని చూడండి. వీటి తీరే వేరు సాధారణంగా అన్ని యాడ్స్ ఆయా కంపెనీలు తయారు చేసే ప్రొడక్టు గురించి విపరీతంగా ప్రమోట్ చేస్తున్నట్టుగా తయారవుతాయి. కానీ దీపావళి యాడ్స్ అలా కాదు పూర్తిగా భావోద్వేగంగా ఉంటాయి. బ్రాండ్, ప్రొడక్ట్ ప్రమోషన్ అనేది అంతర్లీనంగా ఉంటూ ఎమోషనల్గా ఉంటాయి. అందుకే ఏళ్లు గడిచినా సరే వాటిని మరిచిపోవడం కష్టం. సేల్స్మేన్ కళ్లలో ఆనందం ఇండియన్ ఆయిల్ యాడ్లో .. దీపావళి పండగ సందర్భంగా ఓ స్వీట్ షాప్ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ షాప్ యజమాని వచ్చిన కస్టమర్లందరికీ టేస్ట్ చూడమంటూ కలాకాన్ అందిస్తుంటాడు. ఈ షాప్లోని సేల్స్మేన్ చూస్తుండగానే కాంప్లిమెంటరీ స్వీట్ మొత్తం అయిపోతుంది. చివరకు షాప్ మూసివేసే సమయంలో ఏమైనా స్వీట్ మిగిలి ఉందా అని సేల్స్మేన్ వెతుకుతారు. కానీ అక్కడ ఏమీ కనిపించదు. పండగ వేళ బయటంతా బాణాసంచా వెలుతురుతో సందండి నెలకొంటే సేల్స్మ్యాన్ ముఖంలో విచారణం నెలకొంటుంది. మనసంతా బాధతో నిండిపోయి ఉంటుంది. Sometimes, the smallest gesture can light up someone's world. This festive season, let's celebrate all such moments and spread good cheer and warmth.#IndianOil #Indane #XTRATEJ #HappyDiwali pic.twitter.com/s7Xkei8vhF — Indian Oil Corp Ltd (@IndianOilcl) November 2, 2021 మనసంతా నిరాశతో గుండె బరువెక్కిపోయిన సేల్స్మేన్ కళ్లలో ఆనందం ఎలా వచ్చింది. ఎవరు ఆ సంతోశానికి కారణమనే అంశాలను ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించారు. చివర్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్తో యాడ్ మరో లెవల్కి వెళ్లిపోతుంది. దీపావళి యాడ్స్కి స్పెషల్ ట్రెండ్ని క్రియేట్ని చేసి వాటిలో రెండేళ్ల క్రితం వచ్చిన హెచ్పీ ప్రింటర్స్ యాడ్కి ప్రత్యేక స్థానం ఉంది. ఓల్డ్ అడ్వెర్టైజ్మెంట్కి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈసారి కూడా హెచ్పీ సంస్థ యాడ్ను రెడీ చేసింది. కొన్ని బంధాలకు లేబుళ్లు అక్కర్లేదు అంటూ అమెజాన్ రూపొందించిన యాడ్ తప్పకుండా ఆకట్టుకుంటుంది. దీపావళి రోజున ఇంటి దగ్గర ఉండకుండా బయటకు తీసుకెళ్లిన కొడుకుతో తండ్రి వాదులటతో ప్రారంభమయ్యే ఎల్ అండ్ టీ యాడ్ ఎండింగ్లో ఇచ్చే ట్విస్ట్తో మరో లెవల్కి చేరుకుంటుంది. వృద్దాప్యంలో చాదస్తం ఎక్కువైన భర్త, అతనితో వేగలేక పోతున్న భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చెబుతూ ఏయూ బ్యాంక్ రూపొందించిన యాడ్ కూడా ఆకట్టుకుంటుంది. -
అంత్యక్రియల్లో.. తండ్రి సేవలకు గుర్తుగా
సిడ్నీ : ప్రపంచంలో ఏ పిల్లాడైనా సరే తన తండ్రి గొప్పదనం తెలుసుకున్నప్పుడు వారు ఎంతగా మురిసిపోతారో చెప్పనవసరం లేదు. అందులోనూ దేశంకోసం ప్రాణత్యాగం చేసిన తండ్రి విలువను అందరూ గుర్తించినప్పుడు ఆ పిల్లల ఆనందానికి అవదులు లేకుండా పోతాయి. తాజాగా అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. కార్చిచ్చు ధాటికి అమరుడైన తన తండ్రి అంత్యక్రియల సమయంలో అతని సాహసానికి గుర్తుగా తన 19 నెలల కూతురుకు వోడయ్యర్ వాడిన హెల్మట్తో పాటు మెడల్ను బహూకరించారు. వీటిని ఆ పాప ధరించినప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులు భావోద్వేగానికి గురవడం అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చూసిన ప్రతీ వీక్షకుడి గుండె బరువెక్కుతుంది. వివరాల్లోకి వెళితే.. ప్రసుత్తం ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కార్చిచ్చు భారీ నుంచి ప్రజలను రక్షించడానికి ఫైర్ ఫైటర్స్ తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19న ఫైర్ ఫైటర్స్ కార్చిచ్చు నుంచి ప్రజలను రక్షించడానికి ఫైర్ ఇంజన్లో వెళ్లారు. అయితే ఒక్కసారి కార్చిచ్చు మంటలు మరింతగా వ్యాపించి వారు వెళుతున్న వాహనంపై పడడంతో అందరూ అక్కడికక్కడే మరణించారు. అందులో 36 ఏళ్ల వోడయ్యర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను న్యూసౌత్ వేల్స్ రూరల్ ఫైర్ సర్వీస్ నుంచి ఫైర్ఫైటర్గా తన సేవలందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సిడ్నీలో వోడయ్యర్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో భాగంగా 12 మంది ఫైర్ ఫైటర్స్ వరుసగా నిలబడి వోడయ్యర్ మృతదేహానికి హార్డ్ ఆఫ్ గానర్తో గౌరవించారు. అనంతరం వోడయ్యర్ 19 నెలల కూతురైన చార్లెట్ను హెల్మట్తో పాటు సేవా పతకాన్ని అందించారు. ' చార్లెట్.. ఈరోజు నీ తండ్రి ఎంత గొప్పవాడో నీకు తెలియాలి. మీ నాన్న ఒక గొప్ప వ్యక్తి, దేశకోసం తన ప్రాణాలను పణంగా పెట్టి నిజమైన హీరో అయ్యారు. అతని సేవను మేము ఎప్పటికి గుర్తుంచుకుంటాం' అంటూ అధికారి ఫిట్జ్సిమ్మన్స్ కన్నీటి పర్యంతమయ్యారు. 19 నెలల చార్లెట్ తన తండ్రి జ్ఞాపకార్థంగా ఇచ్చిన హెల్మట్తో పాటు సేవా పతకాన్ని ధరించినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆస్ట్రేలియన్ ప్రధాని స్కాట్ మోరిసన్ దంపతులు వోడయ్యర్ కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకొని వారిని ఓదార్చారు. రెండు నెలలుగా ఆస్ట్రేలియాను వణికిస్తున్న కార్చిచ్చుకు ఇప్పటివరకు 26 మంది ఫైర్ ఫైటర్లు తమ ప్రాణాలు కోల్పోగా, వేలాది జంతువులు బలయ్యాయి. -
‘హార్ట్’ టచింగ్ మెసేజ్
సామాజిక మాధ్యమం ట్విటర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర చేసిన ఓ పోస్ట్ గుండెకు హత్తుకునేలా ఉంది. చనిపోయిన కూతురి ఓ తండ్రి ఎంత ప్రేమను కనబరుస్తున్నాడో తెలిపే ఓ వీడియోను ట్వీట్ చేసిన ఆయన..‘ఈ రోజు నేను రెండు ప్రొడక్ట్స్ ప్రారంభించినప్పటికీ.. ఈ వీడియోను మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో ఎప్పటిదో నాకు తెలియదు.. కానీ అది నా మనసును కదిలించింది. అదే విధంగా ఆ తండ్రి కూడా తన కూతురు గుండెను కదిలించాడు. మన చర్మం ఏ రంగులో ఉన్న.. శరీరంలోని గుండె మాత్రం అందరిలో ఒకేలా కొట్టుకుంటుందనే చక్కటి సందేశం అందులో ఉంద’ని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఏముదంటే.. యూఎస్లోని ఒరెగాన్కు చెందిన బిల్ కన్నేర్కు గతేడాది తన కొడుకు ఆస్టిన్, కూతురు అబ్బేతో కలిసి ఫ్యామిలీ టూర్కు వెళ్లాడు. అక్కడ ఆస్టిన్, అబ్బేలు ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదం నుంచి ఆస్టిన్ బయటపడినప్పటికీ.. అబ్బే మరణించింది. తర్వాత బిల్ ఆమె అవయవాలను దానం చేశారు. అయితే తన కూతురిని మరచిపోలేకపోయిన బిల్.. అబ్బే జ్ఞాపకార్థంగా సైకిల్పై దేశవ్యాప్తంగా పర్యటించాలని అనుకున్నాడు. అలాగే అవయవ దానం గొప్పతనం గురించి చాటిచెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా అతడు అబ్బే అవయవాలు దానం చేసిన హెల్త్ సెంటర్కు వెళ్లి.. ఆమె అవయవాలు ఎవరికైతే అమర్చారో వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన విజ్ఞప్తితో హెల్త్ సెంటర్ సిబ్బంది అబ్బే అవయవాలు అమర్చిన వారిని సంప్రదించారు. A lot on today,including two product launches but had to share this post.Don’t know how old the story is but it touched my heart the same way this dad touched his daughter’s heart. A powerful message that no matter what colour our skin,the heart beating underneath is the same... pic.twitter.com/CM3xL87nR9 — anand mahindra (@anandmahindra) 15 November 2018 అందులో ఆమె హృదయాన్ని అమర్చిన లూమోత్ జాక్ మాత్రమే.. అబ్బే తండ్రిని కలిసేందుకు అంగీకారం తెలిపాడు. దీంతో హెల్త్ సెంటర్ నిర్వహకులు అతని వివరాలను బిల్కు అందజేశారు. తన యాత్రలో భాగంగా ఫాదర్స్డే రోజున లూమెత్ను కలిసిన బిల్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. స్టేతస్కోప్తో లూమెత్ గుండె(అతనికి అమర్చిన అబ్బేది) చప్పుడు విని కూతురిని గుర్తుచేసుకున్నారు. అక్కడే ఉన్న లూమెత్ తండ్రి బిల్ను ఓదార్చారు. లూమెత్ విషయానికి వస్తే.. 21 ఏళ్ల లూమెత్ గుండె బలహీనంగా ఉండటం వల్ల ఎక్కువ కాలం బ్రతకడని వైద్యులు ప్రకటించారు. ఆ సమయంలో అబ్బే గుండె అమర్చడం వల్ల లూమెత్కు మరో జన్మ లభించినట్టయింది. -
హృదయాన్ని హత్తుకునే సినిమాలు చేస్తా
బిచ్చగాడు దర్శకుడు ‘శశి’ పసలపూడి (రాయవరం) : హృదయాన్ని హత్తుకునే సినిమాలు తీయాలనేది తన లక్ష్యమని ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడిన బిచ్చగాడు దర్శకుడు శశి తెలిపారు. తదుపరి తీయబోయే సినిమా షూటింగ్ నిమిత్తం లొకేషన్స్ చూసేందుకు శుక్రవారం ఆయన పసలపూడి గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. బీఏ సోషియాలజీ చదివిన తాను ఇప్పటి వరకు ఆరు సినిమాలకు దర్శకత్వం వహించానన్నారు. తెలుగులో తన తొలి సినిమా వెంకటేష్ హీరోగా ‘శీను’కు దర్శకత్వం వహించగా ‘బిచ్చగాడు’ రెండో సినిమా అన్నారు. ఈ సినిమా ఘన విజయం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. కథ బలంగా ఉంటే ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోగా నటించిన ‘ఓ పాపా లాలి’ సినిమా దర్శకడు వసంత్ వద్ద తాను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానన్నారు. కె.విశ్వనాథ్, శేఖర్ కమ్ముల, క్రిష్, కరుణాకరణ్ దర్శకత్వ పనితీరు తనను ఆకట్టుకున్నాయన్నారు. ఉత్తమ అభిరుచి ఉన్న సినిమాలు నిర్మిస్తానన్నారు. ప్రస్తుతం తెలుగులో సినిమాకు దర్శకత్వం వహించనున్నానన్నారు. వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. ఆయన వెంట యానాంకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ల ఏజెంట్ మడికి రామస్వామి, షార్ట్ఫిల్మ్స్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, యానాం కథల రచయిత సాధనాల బాబు, సినీ నటుడు కర్రి రామారెడ్డి, జూనియర్ రాజనాల ఉన్నారు.