breaking news
Health priority
-
యోగ మనదే...
భాగ్యనగరం ‘యోగ’మంత్రం పఠించింది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మంగళవారం సిటీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, దేవాలయాలు, పార్కులు, స్టేడియాలు, కాలనీలు, జైళ్లు...ఇలా అన్ని ప్రాంగణాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల నుంచి ప్రముఖల వరకు అందరూ యోగాసనాలు వేసి ఆరోగ్య ప్రాధాన్యతను చాటారు. గన్ఫౌండ్రీ : యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఎల్బి స్టేడియంలో పతంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... యోగా మతానికి చెందినది కాదని, భారతీయ సంస్కతికి చిహ్నమన్నారు. అరబ్ దేశాల్లో సైతం యోగాను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. యోగాకు ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యోగాతో వ్యక్తిత్వ వికాసం, క్రమ శిక్షణ అలవడుతుందన్నారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ... కొన్ని సంస్థలు, శక్తులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం యోగాపై దుష్ర్పచారం చేస్తున్నాయని ఆరోపించారు. అనంతరం పలు పాఠశాలలకు చెందిన విద్యార్ధుల యోగాసనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, విశ్వహిందూ పరిషత్ రాష్ర్ట అధ్యక్షులు రామరాజు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. -
భయం వీడితేనే జయం
ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి విద్యార్థులు పరీక్షలకున్న సమయాన్ని బట్టి ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఎక్కువ మార్కులు సాధించాలనే తపనతో అదే పనిగా చదవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత చది వామని కాకుండా చదివింది ఎంత గుర్తుంచుకున్నామన్నది ముఖ్యం. చదివిన అంశాలు కనీసం ఒక్కసారైనా చూడకుండా రాయడం మంచిది. చదివిన అంశాలను పునశ్చరణ చేయడం కూడా ఎంతో ప్రధానం. ముఖ్యంగా రాత్రి వేళల్లో 10.30 కల్లా చదవడం ముగించి వేకువ జామున ఎక్కువ సమయం చదువుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. విద్యార్థులకు కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కు సమయం కేటాయించాలి. వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజూ ప్రతి సబ్జెక్టుకు కనీసం గంట తక్కువ కాకుండా టైమ్ టేబుల్ తయారు చేసుకొని తదనుగుణంగా సాధన చేయాలి. - హరిశ్చంద్ర, జిల్లా ఉప విద్యాధికారి టీవీలు, సినిమాలకు దూరంగా ఉంచాలి పరీక్షల సమయంలో పిల్లలను సాధ్యమైనంత వరకు టీవీలు, సినిమాలకు దూరంగా ఉంచాలి. వీటి వ్యాపకంతో విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించే వీలుండదు. తల్లిదండ్రులు ఇంటి వద్ద విద్యార్థులకు సరైన గెడైన్స్ ఇచ్చి కష్టపడి చదివేలా ప్రోత్సహించాలి. పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగులైతే ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని చదివించాలి. పరీక్షల సమయంలో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడం ఏ మాత్రం మంచిది కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒత్తిడికి గురి చేస్తే విద్యార్థుల మానసిక సంఘర్షణకు గురయ్యే ప్రమాదముంది. - ఝాన్సీరాణి, ప్రధానోపాధ్యాయురాలు, బాలికల ఉన్నత పాఠశాల, ఆహార నియమాలు, నిద్ర, వ్యాయామం తప్పనిసరి పరీక్షల సమయంలో ఆరోగ్య పరిరక్షణకు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. పాలు తాగడం, సీజనల్ పండ్లు తినడం, జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి. అల్పాహారంగా ప్రొటీన్, కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినడం మంచిది. ఇడ్లి, దోశ, ఉప్మా వంటివి తీసుకోవచ్చు. చాక్లెట్లు, బిస్కెట్ల వంటివి తినడం మానేసి వాటి స్థానంలో ఎండిన పండ్లు, ఖర్జూర, బాదం, వాల్న ట్స్ వంటివి తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల మానసిక ఉపశమనం కలుగుతుంది. ఆరెంజ్, దానిమ్మ, ఆపిల్ లాంటి పండ్లను ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. పరీక్షలకు సిద్ధమయ్యే, రాయబోయే విద్యార్థులందరికీ చదువెంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి రోజుకు కనీసం ఐదారు గంటలైనా తప్పనిసరిగా నిద్ర అవసరం. - ప్రసాద్కుమార్, వైద్యాధికారి, దోమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్యం ప్రధానం చాలామంది విద్యార్థులు ఆరంభం నుంచి చదువును అశ్రద్ధ చేసి ఆటపాటలతో గడిపి తీరా పరీక్షలు దగ్గరకొచ్చాక నానా హడావుడీ పడుతుంటారు. రాత్రంతా గంటల తరబడి మేల్కొని చదివేస్తుంటారు. దీంతో వారిపై ఒత్తిడి అధికమవుతుంది. ఈ కారణంగా అనారోగ్యానికి గురయ్యే వీలుంది. ఇది మొదటికే మోసం తెస్తుంది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. నీటిని ఎక్కువగా తాగడం, తగిన మోతాదులో ఆహారం తీసుకోవడం, చదువు మధ్యలో విరామం తీసుకొని సంగీతం వినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తే శరీరంపై ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. - ప్రకాష్రావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ జాగ్రత్తలు ఎంతో అవసరం పరీక్షల సమయంలో రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలు, నూనె పదార్థాలు, జీర్ణ సంబంధ సమస్యలు కలిగించే ఆహార పదార్థాలు తీసుకోరాదు. టీవీలు, సినిమాలు చూడడం కన్నా చదువు మధ్యలో స్నేహితులతో కాసేపు సరదాగా గడపడం, కబుర్లు చెప్పుకోవడం మంచిది. అనవసరమైన, చదువుకు నష్టం కలిగించే వ్యాపకాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. {పస్తుతం గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా అన్ని చోట్లా విద్యుత్ కోతలు విపరీతంగా ఉండే అవకాశం ఉండడంతో విద్యార్థులు చదువుకు ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.