breaking news
hanmakopnda
-
సొంతగూటికి మహాలక్ష్మి
హన్మకొండ అర్బన్: మహాలక్ష్మి అలియాస్ దొరసాని.. ఈమెది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపూర్ గ్రామం. మహాలక్ష్మి పెళ్లాయిన కొద్ది రోజుల తరువాత ఆమె తల్లి మృతి చెందింది. తండ్రి వేరే మహిళతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో మహాలక్ష్మి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విధి వక్రీకరించి మహాలక్ష్మికి మానసిక సమస్యలు రావడంతో అత్తింటివారు తండ్రి వద్ద వదిలి వెళ్లగా.. సవతి తల్లి ఆమెను రైల్వే స్టేషన్లో వదిలిపెట్టి పోయింది. అంతటితో ఆగకుండా మానసిక పరిస్థితి సరిగా లేక ఆమె చనిపోయిందని నమ్మించింది. ఎక్కడెక్కడో తిరిగిన మహాలక్ష్మి 2013లో వరంగల్ పోలీసుల చెంతకు చేరగా.. ఆమెను హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి అప్పగించారు. అప్పటి నుంచి ఆమె అక్కడే ఉంటోంది. ఈ మధ్య మనోవికాస కేంద్రంలోని వసతులు, భోజనం, ఇతర కార్యక్రమాలకు సంబంధించి నిర్వాహకులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అందులో మహాలక్ష్మి ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు మనోవికాస కేంద్రం నిర్వాహకులు బండ రామలీలను సంప్రదించారు. కొద్ది రోజులుగా మహాలక్ష్మితో వారు మాట్లాడుతున్నారు. ఇంతకాలం ముభావంగా ఉన్న మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, బంధువులను గుర్తిస్తూ భావోద్వేగానికి గురవుతోంది. పూర్తి వివరాలు తెలుసుకున్న అధికారులు అంగీకరించడంతో గురువారం మహాలక్ష్మి అన్న, బంధువులు మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చేరుకుని ఆమెను కలిశారు. ఇంతకాలం తమ చెల్లిని కంటికి రెప్పలా కాపాడిన నిర్వాహకులకు మహాలక్ష్మి అన్న ఇతర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను తమ స్వస్థలానికి తీసుకెళ్లారు. (గో కార్టింగ్ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి) -
హన్మకొండ బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం వరంగల్ జిల్లా హన్మకొండ బయల్దేరి వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో గత నెల 23న మరణించిన పార్టీ యువజన విభాగం నేత భీంరెడ్డి సుధీర్రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. సుధీర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు.