breaking news
FTII Pune
-
ఎఫ్టీఐఐ చైర్మన్గా అనుపమ్ ఖేర్
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్(62)కు కీలక పదవి లభించింది. పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) చైర్మన్గా ఖేర్ను నియమించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారులు తెలిపారు. ఎఫ్టీఐఐ చైర్మన్గా తనను ఎంపిక చేయడంపై ఖేర్ స్పందిస్తూ ‘ప్రతిష్టాత్మకమైన ఎఫ్టీఐఐకి చైర్మన్గా ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నాకు అప్పగించిన విధుల్ని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తాను’ అని ట్వీటర్లో అన్నారు. ఎఫ్టీఐఐ చైర్మన్గా పనిచేసిన గజేంద్ర చౌహాన్ పదవీకాలం ముగిసిన 7 నెలల అనంతరం కేంద్రం అనుపమ్ ఖేర్ను చైర్మన్గా కేంద్రం నియమించింది. ఖేర్ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ఎస్డీ)లో డిగ్రీ పొందారు. 500 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఖేర్ సినిమా,కళల రంగానికి అందించిన సేవలకు గానూ 2004లో పద్మశ్రీ, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. -
ఎన్నికల తాయిలాలు!
సాక్షి ముంబై: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో రాష్ట్రానికి కొంతమేర ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అనేకవర్గాల ప్రజలు, విశ్లేషకులు, ప్రతిపక్ష నేతల నుంచి పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబైకి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపు జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుణేలోని ఎఫ్టీఐఐ సంస్థకు జాతీయ హోదా కల్పించడం, నాగపూర్లో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేయడం రాష్ట్రవాసులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగించే అంశాలని చెబుతున్నారు. నాణ్యమైన విద్యనందించేందుకు దేశవ్యాప్తంగా ఐదు ఐఐఎంలను స్థాపించనున్నట్లు ప్రకటించగా అందులో ఒకటి మహారాష్ట్రకు దక్కడం కూడా ఊరటగానే చెప్పవచ్చని చెబుతున్నారు. నదుల అనుసంధానం కోసం అధ్యయనం జరిపేందుకు రూ. 100 కోట్లు కేటాయించారు. అనుసంధానం జరిగితే దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ఎక్కువ ప్రయోజనం పొందేది మన రాష్ట్రమే. ఇక తీరప్రాంతాలు, ఓడరేవుల అభివృద్ధి కోసం రూ. 11,000 కోట్లను కేటాయించారు. దీంతో కేటాయించిన సొమ్ములో రాష్ట్రానికి గరిష్ట వాటా ఉంటుందనేది ఆర్థిక నిపుణుల విశ్లేషణ. చౌక ధరల ఇళ్లు, మురికివాడల అభివృద్ధి వంటి నిర్ణయాలతో నగరంలోని ధారవి వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందు తాయని చెబుతున్నారు. పుణేలో పారిశ్రామి క కారిడార్ల ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఇందుకోసం రూ. 100 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి అరున్ జైట్లీ ప్రకటించారు.