breaking news
Four Seasons
-
ఈ వనాన్ని తప్పక చూడాల్సిందే !
‘అది ఒక నందన వనము, దేవతలు విహరించే స్వర్గ ధామము’ అని వర్ణించినా ఆ వనం అందాలు తక్కువ చేసినట్లే. రంగురంగుల పూలు, ఆకులతో ఇంద్ర ధనుస్సును నేలపై పరిచినట్లుగా కనిపించే ఆ వనం ప్రకతి సిద్ధమైనది కాదు. మానవ నిర్మితమైనది. కేవలం ఇద్దరు భార్యా భర్తలు కలిసి ఆ వనాన్ని తీర్చి దిద్దిన తీరు అమోగం. అద్భుతం. ఇది మనం చెబుతున్న మాటలు కాదు. ఇప్పటి వరకు 48 దేశాల నుంచి వచ్చి సందర్శించిన దాదాపు 14 వేల మంది చెప్పిన అభిప్రాయాలు. ఇంగ్లాండ్కు చెందిన వెస్ట్ మిడ్లాండ్స్లోని వాల్సల్ పట్టణంలో ఈ వనం ఉంది. నీ దంపతులు తమ ఇంటి వెనక పెరట్లో ఈ వనాన్ని అభివృద్ధి చేశారు. టోనీ దంపతులు తమ ఇంటి వెనక పెరట్లో ఈ వనాన్ని అభివద్ధి చేశారు. ఆ వనానికి ఇంత వన్నెలొచ్చాయంటే మేరీ, టోని న్యూటన్ అనే ఇద్దరు దంపతులు చేసిన కృషే.. ఒకటి, రెండు ఏళ్లు కాదు, వారు 37 సంవత్సరాలు కషి చేస్తే ఈ వనం తయారయింది. ఇందులో అన్నీ 35 ఏళ్లున్న చెట్ల గుబుర్లే. ఆ భార్యా భర్తలిద్దరు 1982లో ఈ వనాన్ని పెంచడం మొదలు పెట్టగా ఇటీవల పూర్తయింది. అప్పుడు 40 ఏళ్లున్న వాళ్లకు ఇప్పుడు 71 ఏళ్లు. ఇద్దరిది ఒకే వయస్సు ఆ రంగుల వనంలో నివసిస్తున్నందున తాము ఇప్పటికీ ఆయురారోగ్యాలతో ఉన్నామని వారు చెబుతున్నారు. వాని వనంలో వివిధ దేశాల నుంచి తెచ్చిన మొక్కలు ఉన్నాయి. 450 రకాల అజాలీస్ (ముదురు రంగుల పూల మొక్కలు. ఎప్పుడూ చిన్నగానే ఉంటాయి), 120 జపనీస్ మాపుల్స్ (వివిధ రంగుల్లో చీలినట్లు హస్తం లాగా ఆకులు కలిగిన జపనీస్ జాతి మొక్కలు), 15 జూనిపర్ బ్లూస్టార్ (నీలి రంగు పూలు కలిగిన గుబురు చెట్లు) ఉన్నట్లు దంపతులు వివరించారు. ఈ వనానికి మరో విశేషం ఉంది. అన్ని రుతువుల్లో ఈ వనం ఇలాగే కనిపిస్తుందట. ఓ చెట్టు ఒక రంగు ఆకులు లేదా పూలు సీజన్లో రాలిపోతే మరో జాతి మొక్కకు అదే రంగు పూలు లేదా ఆకులు మొలవడం వల్ల అలా కనిపిస్తుందట. అయితే ఈ విషయం తెలిసిన బ్రిటన్ రాణి టోనీ దంపతులను పిలిచి సముచితంగా సత్కరించినట్లు తెలిసింది. ఈ వనం అభివద్ధికి మరీ ఎక్కువ కాకుండా 15 వేల పౌండ్లు (దాదాపు 14 లక్షల రూపాయలు) ఖర్చు అయ్యాయట. -
రగడ రేపిన హీరో బర్త్ డే పార్టీ
ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బర్త్ డే పార్టీ వివాదానికి దారి తీసింది. బర్త్ డే పార్టీ బ్యాష్ అంటే సందడే సందడి. విందులు, వినోదాలు మామూలే. అయితే 42వ పుట్టిన రోజు వేడుకలు మాత్రం హృతిక్ రోషన్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముంబైలోని ప్రముఖ హోటల్ లో పెద్ద ఎత్తున నిర్వహించిన పార్టీ విమర్శలకు తావిచ్చింది. పరిమితికి మించి ఆడియో సౌండ్ పెట్టి హోరెత్తించడం, మర్నాడు తెల్లవారే వరకూ గలాటా సృష్టించడంతో రగడ జరిగింది. హోరెత్తిన మ్యూజిక్ శబ్దాలతో విసుగెత్తిగిన అష్రఫ్ ఖాన్ అనే స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. యథావిధిగా విపరీతమైన శబ్దాలతో, మ్యూజిక్ తో పార్టీ కొనసాగింది. దీంతో చిర్రెత్తిన అతడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి పదిగంటల తరువాత అనుమతి లేకుండా ఇలాంటి పార్టీలు నిర్వహించడం నేరమంటూ వాదించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు. సదరు హోటెల్ యజమానికి పాతిక వేల జరిమానా విధించారు. హృతిక్ 42వ పుట్టిన రోజు వేడుకలు ముంబై నగరంలోని ఫోర్ సీజన్స్ హోటెల్ లో శనివారం ఘనంగా జరిగాయి. 34 వ అంతస్తులోని అట్టహాసంగా నిర్వహించిన ఈ పార్టీకి అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు, ఇతర అతిధులు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్లు ఈ బర్తడే బాష్ లో సందడి చేశారు. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పడుకోన్, అమీషా పటేల్, ప్రీతిజింటా, శిల్పాశెట్టి తదితర నటీనటులు సెల్పీలతో హల్చల్ ఇంకా కరణ్ జోహార్, వివేక్ ఒబెరాయ్ ఇలా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ విందుకు విచ్చేశారు. దీంతో హోటెల్ ముందు లెక్కకు మించి వాహనాలను పార్క్ చేయడం ట్రాఫిక్ జామ్కు దారితీసింది. దీనికితోడు అర్థరాత్రి మొదలైన పార్టీ మరునాడు 3.30 దాకా జోరుగా సాగడంతో వివాదం రాజుకుంది. అటు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహారించారన్న ఆరోపణలను వర్లి పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి ఖండించారు. ఫిర్యాదు రాకముందే ఒకసారి హోటెల్ యజమానిని హెచ్చరించి, 12,500 రూ. జరిమానా విధించామని తెలిపారు. ఫిర్యాదు అందిన పిదప మరోసారి దాడిచేసి, మరో 12,500 రూ. జరిమానా విధించామన్నారు. మరోవైపు ఈ వివాదంపై స్పందించడానికి హీరో ప్రతినిధి నిరాకరించాడు. అయితే ఎవరో కిట్టని వారే ఈ ఫిర్యాదు చేశారని ఆరోపించాడు.